Telangana
oi-Bomma Shivakumar
తెలంగాణలో
నెల
రోజులుగా
చలి
పంజా
విసురుతోంది.
గడ్డకట్టే
చలి
కారణంగా
జనజీవనం
స్తంభించి
పోతుంది.
ముఖ్యంగా
ఉమ్మడి
ఆదిలాబాద్,
మెదక్
జిల్లాలతో
పాటు
కామారెడ్డి
జిల్లాలో
కనిష్ట
ఉష్ణోగ్రతలు
సింగిల్
డిజిట్
కు
చేరాయి.
ఈ
క్రమంలో
హైదరాబాద్
వాతావరణ
శాఖ
కీలక
ప్రకటన
చేసింది.
తెలంగాణలో
కనిష్ఠ
ఉష్ణోగ్రతలు
పెరిగి..
చలి
తీవ్రత
తగ్గిపోయిందని
పేర్కొంది.
ఈ
మేరకు
రాష్ట్ర
వ్యాప్తంగా
నాలుగు
నుంచి
ఐదు
డిగ్రీల
మేర
కనిష్ఠ
ఉష్ణోగ్రతలు
పెరిగినట్లు
స్పష్టం
చేసింది.
తెలంగాణ
రాష్ట్రవ్యాప్తంగా
గత
నెల
రోజులుగా
చలి
తీవ్రత
అంతకంతకూ
పెరుగుతున్న
విషయం
తెలిసిందే.
ముఖ్యంగా
ఉమ్మడి
ఆదిలాబాద్,
మెదక్
జిల్లాలతో
పాటు
కామారెడ్డి
జిల్లాలోనూ
కనిష్ట
ఉష్ణోగ్రతలు
భారీగా
తగ్గిపోయాయి.
ఈ
నేపథ్యంలో
తెలంగాణలో
కనిష్ఠ
ఉష్ణోగ్రతలు
పెరిగి..
చలి
తీవ్రత
తగ్గుముఖం
పట్టిందని
హైదరాబాద్
వాతావరణ
శాఖ
స్పష్టం
చేసింది.
రాష్ర్ట
వ్యాప్తంగా
నాలుగు
నుంచి
ఐదు
డిగ్రీల
మేర
కనిష్ఠ
ఉష్ణోగ్రతలు
పెరిగినట్లు
పేర్కొంది.
దాంతో
రెండు,
మూడు
రోజులు
చలి
ప్రభావం
తక్కువగా
ఉంటుందని
వాతావరణ
శాఖ
అధికారి
శ్రీనివాస్
రావు
వివరించారు.
మరోవైపు
రాష్ట్రంలోని
గ్రామీణ
ప్రాంతాల్లోని
ప్రజలు
చలి
తీవ్రతకు
ఇబ్బంది
పడుతున్నారు.
ప్రజలు
చలి
నుంచి
తట్టుకోవడానికి
ఉదయం,
రాత్రి
సమయాల్లో
చలిమంటలు
కాచుకుంటున్నారు.
చలి
తీవ్రత
కారణంగా
వృద్ధులు,
చిన్నపిల్లలు
ఉదయం
పూట
బయటకు
రాకపోవడమే
మంచిదని
వైద్యులు
సూచిస్తున్నారు.
శ్వాసకోశ
సంబంధిత
సమస్యలు
ఉన్నవారు
తగిన
జాగ్రత్తలు
తీసుకోవాలని
చెబుతున్నారు.
వేడి
ఆహారం,
గోరువెచ్చని
నీటిని
తీసుకోవాలని
వైద్యులు
సలహా
ఇస్తున్నారు.


