India
oi-Jakki Mahesh
కేరళకు
చెందిన
ప్రసిద్ధ
‘అల్
హింద్
(Alhind)’
గ్రూప్
ఇప్పుడు
విమానయాన
రంగంలోకి
అడుగుపెడుతోంది.
కేంద్ర
పౌర
విమానయాన
మంత్రిత్వ
శాఖ
నుంచి
‘నో
అబ్జెక్షన్
సర్టిఫికేట్’
పొందిన
తర్వాత,
ఈ
సంస్థ
అల్
హింద్
ఎయిర్
పేరుతో
తన
సర్వీసులను
ప్రారంభించనుంది.ఈ
కొత్త
ఎయిర్లైన్
వెనుక
ఉన్న
వ్యక్తి,
అతని
నేపథ్యం,
అల్
హింద్
గ్రూప్
ప్రస్థానానికి
సంబంధించిన
ఆసక్తికరమైన
విషయాలను
ఇక్కడ
తెలుసుకుందాం.
ఎవరీ
మొహమ్మద్
హారిస్
టి?
అల్
హింద్
ఎయిర్కు
ప్రమోటర్గా
వ్యవహరిస్తున్న
మొహమ్మద్
హారిస్
టి,
అల్
హింద్
గ్రూప్
ఆఫ్
కంపెనీల
వ్యవస్థాపకుడు,
చైర్మన్.
ట్రావెల్
అండ్
టూరిజం
రంగంలో
ఆయనకు
మూడు
దశాబ్దాలకు
పైగా
అపారమైన
అనుభవం
ఉంది.
హారిస్
కేరళలోని
కాలికట్
(కోజికోడ్)లో
జన్మించారు.
ఆయన
కాలికట్
విశ్వవిద్యాలయం
నుంచి
ఆర్ట్స్
(హిస్టరీ
అండ్
ఎకనామిక్స్)లో
డిగ్రీ
పూర్తి
చేయడమే
కాకుండా,
ఫార్మకాలజీలో
కూడా
డిగ్రీ
పొందారు.
ఆయన
కేవలం
వ్యాపారవేత్త
మాత్రమే
కాదు,
‘ఇండియన్
హజ్
ఉమ్రా
అసోసియేషన్’
వ్యవస్థాపక
జనరల్
సెక్రటరీగా
కూడా
కీలక
బాధ్యతలు
నిర్వహిస్తున్నారు.
Credit:
X(Twitter)
అల్
హింద్
గ్రూప్
ప్రస్థానం
1990లో
కాలికట్లో
ఓ
చిన్న
సంస్థగా
ప్రారంభమైన
అల్
హింద్
గ్రూప్..
నేడు
ఆసియాలోనే
ప్రసిద్ధ
ట్రావెల్
అండ్
టూర్
మేనేజ్మెంట్
సంస్థగా
ఎదిగింది.
ఈ
గ్రూప్కు
కేవలం
భారత్లోనే
కాకుండా
యూఏఈ,
సౌదీ
అరేబియా,
ఖతార్,
ఒమన్,
కువైట్,
బంగ్లాదేశ్
వంటి
దేశాల్లో
కార్యాలయాలు
ఉన్నాయి.
2023
నాటికి
ఈ
గ్రూప్
దాదాపు
రూ.
20,000
కోట్ల
టర్నోవర్ను
సాధించి,
10
లక్షల
మందికి
పైగా
కస్టమర్లకు
సేవలు
అందించింది.
టికెట్
బుకింగ్,
హజ్-ఉమ్రా
యాత్రలు,
వీసా
సర్వీసులు,
హోటల్
బుకింగ్స్,
ఫుడ్
డెలివరీ
వంటి
రంగాల్లో
ఈ
సంస్థ
విస్తరించింది.
అల్
హింద్
ఎయిర్:
ఏం
ఆశించవచ్చు?
అల్
హింద్
ఎయిర్
ఒక
ప్రాంతీయ
విమానయాన
సంస్థగా
తన
ప్రస్థానాన్ని
ప్రారంభించనుంది.
ప్రారంభంలో
ATR
72-600
మోడల్
విమానాలను
ఈ
ఎయిర్లైన్
వినియోగించనుంది.
ఈ
ఎయిర్లైన్
ప్రధాన
కార్యాలయం
కొచ్చిలో
ఉండనుంది.
కేరళలోని
విమానాశ్రయాలను
అనుసంధానిస్తూ
దేశీయ
విమాన
సర్వీసులపై
ఇది
దృష్టి
సారిస్తుంది.
సరసమైన
ధరలలో,
నమ్మకమైన
విమాన
ప్రయాణాన్ని
అందించడమే
లక్ష్యంగా
ఈ
ఏడాది
చివరలో
కార్యకలాపాలు
ప్రారంభించవచ్చని
భావిస్తున్నారు.


