ఆంధ్రప్రదేశ్లో
ప్రసిద్ధిచెందిన
ప్రముఖ
పుణ్యక్షేత్రాలు
చాలానే
ఉన్నాయి.
అందులో
ముఖ్యంగా
విజయవాడ
కనకదుర్గమ్మ
ఆలయం
ఒకటి.
ఇక్కడ
దసరా
ఉత్సవాలు
ఎంతో
వైభవంగా
నిర్వహిస్తారు.
అయితే,
ఇంద్రకీలాద్రీపై
దసరా
ఉత్సవాలు
ముగిసాయి.
దసరా
నవరాత్రి
ఉత్సవాల్లో
భాగంగా
చివరి
రెండురోజులు
కనకదుర్గమ్మ
అమ్మవారిని
దర్శించుకునేందుకు
భక్తులు
భారీగా
తరలివచ్చారు.
శుక్రవారం
అమ్మవారి
ఆలయ
హుండీకి
భారీ
ఆదాయం
సమకూరింది.
ఒక్కరోజే
అమ్మవారి
హుండీకి
భారీ
ఆదాయం
సమకూరినట్లు
ఆలయ
అధికారులు
తెలిపారు.
శుక్రవారం
ఒక్కరోజే
ఏకంగా
రూ.84లక్షలకుపైగా
ఆదాయం
వచ్చినట్లు
పేర్కొన్నారు.
దర్శన
టికెట్లు,
లడ్డూల
విక్రయం,
సేవల
టికెట్లు
కలిపి
ఈ
ఆదాయం
వచ్చినట్లు
ఆలయ
అధికారులు
తెలిపారు.
ఒక్కరోజే
ఏకంగా..
ఒక్కరోజే
ఏకంగా
రూ.84,02,775
ఆదాయం
సమకూరినట్లు
ఆలయ
అధికారులు
తెలిపారు.
ఆ
రోజు
4,149
మంది
భక్తులు
రూ.500
టికెట్లు
కొనుగోలు
చేయగా
రూ.20,74,500
ఆదాయం
వచ్చినట్లు
వివరించారు.
అలాగే
1,847
మంది
భక్తులు
రూ.
300
టికెట్లు
కొనుగోలు
చేయగా
రూ.5,54,
100
ఆదాయం
సమకూరింది.
రూ.100
టికెట్
కొనుగోలు
చేసిన
భక్తులు
4,686
మంది
దర్శించుకున్నారు.
రూ.
100
టిక్కెట్
కొనుగోలుతో
రూ.
46,
86,000
ఆదాయం
సమకూరినట్లు
ఆలయ
అధికారులు
వివరించారు.
అలాగే,
మొత్తం
26,584
లడ్డూలను
విక్రయించారు.
ఇవి
మొత్తం
రూ.3,98,760
ఆదాయం
సమకూరింది.
రూ.100
చొప్పున
మొత్తం
ఆరు
లడ్డూలున్న
ప్యాకింగ్
లను
విక్రయించగా
రూ.44,06,600
ఆదాయం
సమకూరినట్లు
తెలిపారు.
అయితే
ఆలయంలో
మొత్తం
2,64,396
లడ్డూలను
విక్రయించినట్లు
అధికారులు
వివరించారు.
మొక్కుల
రూపంలో..
వీటితో
పాటు
అమ్మవారి
దర్శనం
చేసుకున్న
భక్తులు
పరోక్ష
ప్రత్యేక
కుంకుమార్చనుకు
రూ.
3000
టికెట్లను
18
మంది
కొనుగోలు
చేయగా,
రూ.54వేల
ఆదాయం
సమకూరినట్లు
ఆలయ
అధికారులు
పేర్కొన్నారు.
ఇక,
పరోక్ష
ప్రత్యేక
చండీ
హోమానికి
నాలుగువేల
రూపాయల
టిక్కెట్లను
ఏడుగురు
కోనుగోలు
చేశారు.
దీనికి
మొత్తం
రూ.
28వేల
ఆదాయం
సమకూరింది.
వీటితోపాటు
శ్రీచక్ర
నవావరణార్చన
కోసం
రూ.3,000
టికెట్ను
ఇద్దరు
భక్తులు
కొనుగోలు
చేశారు.
వీటికి
రూ.6వేలు
ఆదాయం
సమకూరింది.
అమ్మవారి
శరన్నవరాత్రుల
ఉత్సవాల్లో
భాగంగా
పబ్లికేషన్లు,
ఫొటోలు,
క్యాలెండర్ల
ద్వారా
రూ.10,230
ఆదాయం
అందింది.
మిగిలిన
ఆదాయం
రూ.20,
545,
రూ.40
టికెట్
ద్వారా
వచ్చింది.
ఆలయానికి
వచ్చిన
9,536
మంది
భక్తులు
అమ్మవారికి
మొక్కుల
రూపంలో
తలనీలాలు
సమర్పించగా
రూ.3,81,440
ఆదాయం
వచ్చినట్లు
అధికారులు
పేర్కొన్నారు.
ప్రముఖుల
దర్శనం..
ఇదిలా
ఉండగా,
అమ్మవారిని
పలువురు
సినీ
సెలబ్రిటీలు
దర్శించుకున్నారు.
మెగాస్టార్
చిరంజీవి
భార్య
కొణిదెల
సురేఖ
దుర్గమ్మ
దర్శనం
చేసుకున్నారు.
అలాగే
నటుడు
పృధ్వీ
కూడా
అమ్మవారి
సేవలో
పాలు
పంచుకున్నారు.
విజయవాడ
దుర్గమ్మ
ఆలయంలో
నిన్న
(విజయదశమి
రోజున)
శ్రీరాజరాజేశ్వరీదేవి
రూపంలో
అమ్మవారు
భక్తులకు
దర్శనమిచ్చారు.
శనివారం
నుంచి
ఆలయానికి
విచ్చేసే
భవానీ
భక్తుల
రద్దీ
పెరిగింది.
ఉదయం
నుంచి
రాత్రి
11
గంటల
వరకూ
లక్ష
మందికిపైగా
భక్తులు
దర్శనానికి
వచ్చారు.
నిన్న
సాయంత్రం
వేళ
కృష్ణా
నదిలో
తెప్పోత్సవ
కార్యక్రమం
కూడా
అత్యంత
వైభవంగా
జరిగింది.


