Andhra Pradesh
oi-Syed Ahmed
మహిళలకు
ఉచిత
బస్సు
అందిస్తున్న
నేపథ్యంలో
రాష్ట్ర
ప్రభుత్వాలు
ప్రయాణాలు
చేసేటప్పుడు
గుర్తింపు
కార్డు
చూపించాలనే
నిబంధన
పెడుతున్నాయి.
అయితే
ఏ
రాష్ట్రం
బస్సులో
ఆ
రాష్ట్రంలోనే
ఎక్కువగా
తిరుగుతాయి.
అలాగే
అందులో
ప్రయాణించే
మహిళలకు
కూడా
సాధారణంగా
ఆ
రాష్టానికి
చెందిన
వారే
ఉంటారు.
అటువంటప్పుడు
వారికి
బస్సుల్లో
ఉచిత
ప్రయాణాలకు
గుర్తింపు
కార్డులు
చూపించాలనే
నిబంధన
అవసరమా
అనే
చర్చ
జరుగుతోంది.
ఇదే
క్రమంలో
ఆంధ్రప్రదేశ్
లోనూ
మహిళలకు
ఉచిత
బస్సు
ప్రయాణాలు
అందిస్తున్న
స్త్రీ
శక్తి
పథకం
అమల్లో
భాగంగా
గుర్తింపు
కార్డులు
చూపించి
ప్రయాణాలు
చేయాలనే
రూల్
పెట్టారు.
అయితే
దీని
వల్ల
అదనంగా
ప్రభుత్వానికి
కలుగుతున్న
లాభం
అంటూ
ఏమీ
లేదు.
కానీ
ఆర్టీసీ
ఉద్యోగులపై
ఒత్తిడి
పెరుగుతోందట.
ఇదే
విషయాన్ని
తాజాగా
ఆర్టీసీ
ఉద్యోగ
సంఘం
ఎంప్లాయీస్
యూనియన్
నేతలు
ప్రభుత్వం
దృష్టికి
తీసుకెళ్లారు.
స్త్రీ
శక్తి
పథకంలో
భాగంగా
ఉచిత
బస్సు
ప్రయాణాలు
చేస్తున్న
మహిళల్లో
పెద్దగా
ఇతర
రాష్ట్రాల
వారు
లేకపోవడంతో
గుర్తింపు
కార్డులు
చూపించాలనే
నిబంధన
తీసేయాలని
ఈయూ
నేతలు
తాజాగా
సీఎం
చంద్రబాబును
కలిసి
విజ్ఞప్తి
చేశారు.
ఈ
నిబంధన
వల్ల
కండక్టర్లపై
అనవసరంగా
ఒత్తిడి
పెరుగుతోందని,
దీన్ని
తీసేస్తే
మహిళలతో
పాటు
కండక్టర్లకు
కూడా
ఊరట
లభిస్తుందని
వారు
చంద్రబాబు
దృష్టికి
తెచ్చారు.
ఈ
నిబంధన
లేకపోతే
సులువుగా
వేగంగా
టికెట్లు
ఇచ్చేందుకు
వీలు
కలుగుతుందన్నారు.
దీంతో
సీఎం
చంద్రబాబు
కూడా
దీనిపై
సానుకూలంగా
స్పందించినట్లు
తెలుస్తోంది.ఈ
మేరకు
కొత్త
ఏడాదిలో
ఈ
గుర్తింపు
కార్డుల
నిబంధన
తొలగించే
అవకాశం
ఉంది.
రాష్ట్రాల
సరిహద్దు
ప్రాంతాల్లో
అమలు
చేసి
ఇతర
ప్రాంతాల్లో
ఈ
గుర్తింపు
కార్డులు
చూపించి
ప్రయాణాలు
చేయాలనే
నిబంధన
తొలగిస్తారని
చెప్తున్నారు.
ప్రభుత్వం
త్వరలోనే
దీనిపై
నిర్ణయం
తీసుకునే
అవకాశం
కనిపిస్తోంది.


