ఉచిత బస్సు అమలు వేళ కొత్త కష్టాలు – ఆర్టీసీ కీలక నిర్ణయం, ఇక..!!

Date:


Telangana

oi-Sai Chaitanya

ఉచిత
బస్సు
పథకం
అమలు
వేళ
కొత్త
అంశాలు
తెర
మీదకు
వస్తున్నాయి.

పథకం
అమలు
ప్రభుత్వం
ప్రతిష్ఠాత్మకంగా
తీసుకుంది.

స్కీం
ను
మహిళలు
పెద్ద
సంఖ్యలో
వినియోగించు
కొంటున్నారు.
ఆర్టీసీకి
ఆదాయం
పెరిగింది.
కాగా..అమలు
లో
ఎదురవుతున్న
సమస్యలను
పరిష్కారం
దిశగా
ఆర్టీసీ
కసరత్తు
చేస్తోంది.
సీట్ల
విషయంలోనూ
స్పష్టత
ఇచ్చింది.
కాగా..
తెర
పైకి
కొత్త
సమస్యలు
వచ్చాయి.
దీంతో..
ఆర్టీసీ
నిర్ణయం
ఏంటనేది
ఆసక్తి
కరంగా
మారుతోంది.

ప్రభుత్వం
మహాలక్ష్మీ
పథకం
అమలు
పైన
ప్రత్యేకంగా
ఫోకస్
చేసింది.
ఆర్టీసీ
యాజమాన్యం
సైతం

పథకం
నిర్వహణ
ప్రతిష్ఠాత్మకంగా
తీసుకుంది.
కొత్తగా

పథకం
కోసం
మహిళలకు
స్మార్ట్
కార్డులు
ఇవ్వాలని
నిర్ణయించారు.
ఇక
నుంచి
ఆధార్
చూపించాల్సిన
అవసరం
లేకుండా
స్మార్ట్
కార్డులతో
మహిళలు
ప్రయాణం
చేసేలా
కసరత్తు
జరుగుతోంది.
అదే
విధంగా
ఎలక్ట్రిక్
బస్సు
ల్లోనూ

పథకం
విస్తరణ
దిశగా
నిర్ణయం
తీసుకున్నారు.

కాగా,
ఉచిత
బస్సుల్లో
పురుషులకు
సీట్ల
కేటాయింపు
పైన
చర్చ
..పలు
ప్రాంతాల్లో
రచ్చ
జరుగుతోంది.
దీని
పైనా
తాజాగా
ఆర్టీసీ
అధికారులు
స్పష్టత
ఇచ్చారు.
పురుషుల
కోసం
ప్రత్యేకంగా
సీట్ల
కేటాయింపు
లేదని
తేల్చి
చెప్పారు.
ఇదే
సమయంలో
పెద్ద
సంఖ్యలో
మహిళలు
ఉచిత
బస్సు
ప్రయాణం
వినియోగిస్తున్న
వేళ..
ఆర్డినరీ,
ఎక్స్​ప్రెస్​లలో
మహిళా
ప్రయాణికుల
రద్దీ
తీవ్రంగా
పెరిగింది.

హైదరాబాద్
పరిధిలోని
రద్దీ
మార్గాల్లో
కనీసం
బస్సుల్లో
నిల్చొని
ప్రయాణించడానకీ
వీలులేని
పరిస్థితులు
వచ్చాయి.
ప్రయాణికుల
రద్దీకి
అనుగణంగా
బస్సుల
సంఖ్య
పెరగకపోవడం
పెద్ద
సమస్యగా
మారింది.
మహాలక్ష్మీ
పథకం
రాకముందు
ఆర్టీసీ
బస్సుల్లో
ప్రయాణికుల
సంఖ్య
నేటితో
పోల్చుకుంటే
గణనీయంగా
పెరిగింది.
ఇంతటి
రద్దీతో
వాహనాన్ని
నడపటం
బస్సు
డ్రైవర్​తో
పాటు
టికెట్లు
పంపిణీ
చేసే
కండక్టర్లకూ
ఇబ్బందిగా
మారింది.
నగరంలోని
పలు
చోట్ల
బస్సుల్లో
ప్రయాణించాలంటే
నానా
ఇక్కట్లు
తప్పడం
లేదు.

గ్రేటర్
పరిధిలో
2,996
బస్సులతో
32
వేల
ట్రిప్పులు
నడుపుతుండగా
వేర్వేరు
మార్గాల్లో
వాటి
సంఖ్య
పెంచాలని,
ట్రాఫిక్
కూడళ్లను
దాటవేస్తూ
నేరుగా
గమ్యం
చేర్చేలా
నడపాలని
ప్రయాణికులు
కోరుతున్నారు.
ప్రస్తుత
అవసరాల
దృష్ట్యా
7
వేలకు
పైగా
బస్సులు
అవసరమవుతుండగా
ఉన్నవాటితోనే
సర్దుబాటు
చేయడం
సవాల్​గా
మారింది.
అయితే,
కొత్త
బస్సుల
ఏర్పాటు
ఆర్టీసీకి
సమస్యగా
మారటంతో..
ప్రస్తుతం
ఉన్న
వాటితోనే
నెట్టుకొస్తోంది.
దీంతో..
సాధారణ
ప్రజలు
ఆర్టీసీ
సానుకూల
నిర్ణయం
కోసం
వేచి
చూస్తున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related