Andhra Pradesh
oi-Chandrasekhar Rao
Heavy
rains:
బంగాళాఖాతంలో
ఏర్పడిన
అల్పపీడనం
మరింత
బలపడింది.
వాయుగుండంగా,
అనంతరం
తీవ్ర
వాయుగుండంగా
రూపాంతరం
చెందింది.
దీని
ప్రభావంతో
నేటి
నుంచి
భారీ
వర్షాలు
పడనున్నాయి.
ఈ
తీవ్ర
వాయుగుండం
ప్రభావం
ఏపీపైనా
పడింది.
పలు
జిల్లాల్లో
ఓ
మోస్తరు
నుంచి
భారీ
వర్షాలు
కురిసే
అవకాశం
ఉంది.
వర్షాలు
తోడు
కావడం
వల్ల
ఇప్పుడున్న
చలి
తీవ్రత
మరింత
పెరుగుతుందని
భారత
వాతావరణ
కేంద్రం
సూచించింది.
ఈ
నెల
5వ
తేదీన
బంగాళాఖాతం
నైరుతి
ప్రాంతంలో
ఈ
ఆవర్తనం
ఏర్పడింది.
తమిళనాడు
దక్షిణ
ప్రాంతం,
శ్రీలంక
తీరం
మీదుగా
విస్తరించింది.
క్రమంగా
ఇది
అల్పపీడనంగా
మారింది.
తదనంతరం
వాయుగుండంగా
ఆవిర్భవించింది.
గురువారం
అర్ధరాత్రి
తీవ్ర
వాయుగుండంగా
అవతరించింది.
ఈ
వ్యవస్థ
ప్రస్తుతం
శ్రీలంకలోని
హంబన్టోటాకు
410,
చెన్నైకి
నైరుతి
దిశగా
980
కిలోమీటర్ల
దూరంలో
కేంద్రీకృతమై
ఉంది.
పశ్చిమ-వాయువ్య
దిశగా
కదులుతోంది.
ఫలితంగా
తమిళనాడు,
కేరళల్లో
భారీ
వర్షాలు
కురుస్తోన్నాయి.
జనవరిలో
తీవ్ర
వాయుగుండం,
తుఫాన్
ను
తమిళనాడు
ఎదుర్కొంటోండటం
135
సంవత్సరాల
తరువాత
ఇదే
తొలిసారి.
డెల్టా
ప్రాంతం,
కోస్తా,
ఉత్తర
తమిళనాడులోని
పలు
ప్రాంతాల్లో
వచ్చే
48
గంటల
పాటు
భారీ
వర్షాలు
కురుస్తాయి
ఆయా
జిల్లాలకు
ఎల్లో,
ఆరెంజ్
అలర్ట్
జారీ
చేసింది.
గురువారం
నాడు
రామనాథపురం,
పుదుక్కోటై,
తంజావూరు,
తిరువారూర్,
నాగపట్టణం
జిల్లాలతో
పాటు
కారైకల్
ప్రాంతంలో
అక్కడక్కడా
భారీ
వర్షాలు
పడ్డాయి.
దీని
ప్రభావం
ఏపీపై
పడింది.
ఇప్పటికే
రాయలసీమలోని
కొన్ని
ప్రాంతాల్లో
అక్కడక్కడ
తేలికపాటి
వర్షాలు
పడ్డాయి.
నేడు
కూడా
ఇవే
పరిస్థితులు
కొనసాగనున్నట్లు
ఏపీ
విపత్తు
నిర్వహణ
సంస్థ
వెల్లడించింది.
రాయలసీమ,
మధ్య-
దక్షిణ
కోస్తా
జిల్లాల్లో
అక్కడక్కడ
తేలికపాటి
జల్లులు
ఓ
మోస్తరు
వర్షాలు
కురుస్తాయని
తెలిపింది.
రాయలసీమలోని
చిత్తూరు,
తిరుపతి,
శ్రీసత్యసాయి
పుట్టపర్తి,
అన్నమయ్య
జిల్లాల్లో
అక్కడక్కడ
తేలికపాటి
నుంచి
మోస్తరు
వర్షాలు
కురుస్తాయని
ఏపీఎస్డీఎంఏ
తెలిపింది.
వీటితో
పాటు
కోస్తా
తీరంలోని
కృష్ణా,
బాపట్ల,
ప్రకాశం,
నెల్లూరు
జిల్లాల్లో
కొన్నిచోట్ల
తేలికపాటి
వర్షాలు
కురిసే
అవకాశం
ఉందని
రాష్ట్ర
విపత్తుల
నిర్వహణ
సంస్థ
అంచనా
వేసింది.


