Andhra Pradesh
oi-Syed Ahmed
దక్షిణ
రైల్వే
పరిధిలో
తాజాగా
రాకపోకలు
ప్రారంభించిన
అమృత్
భారత్
ఎక్స్
ప్రెస్
(Amrit
Bharat
Express)ల
టైమింగ్స్
లో
కీలక
మార్పులు
చోటు
చేసుకున్నాయి.
ప్రధాని
మోడీ
తాజాగా
ప్రారంభించిన
మూడు
అమృత్
భారత్
రైళ్లతో
పాటు
మరో
అమృత్
భారత్
రైలు
టైమింగ్స్
లోనూ
కొన్ని
స్టేషన్లలో
సమయాల్లో
మార్పులు
చేస్తూ
దక్షిణ
రైల్వే
ఓ
ప్రకటన
విడుదల
చేసింది.
అలాగే
ఈ
మార్పులు
ఏయే
రైలుకు
ఎప్పటి
నుంచి
అమల్లోకి
వస్తాయో
కూడా
వెల్లడించింది.
నాలుగు
అమృత్
భారత్
ల
సమయాల్లో
మార్పు
దక్షిణ
రైల్వే
పరిధిలో
ఎంపిక
చేసిన
స్టేషన్లలో
నాలుగు
అమృత్
భారత్
ఎక్స్ప్రెస్
రైళ్ల
సమయాల్ని
సవరించినట్లు
అధికారులు
ప్రకటించారు.
ఇందులో
రైలు
నం.16108
సంత్రగచ్చి
-తాంబరం
అమృత్
భారత్
వీక్లీ
ఎక్స్ప్రెస్,
రైలు
నం.20610
తిరుచ్చిరాపల్లి
-న్యూ
జల్పైగురి
అమృత్
భారత్
వీక్లీ
ఎక్స్ప్రెస్,
రైలు
నం.20604
న్యూ
జల్పైగురి
-అమృత్
భారత్
వీక్లీ
ఎక్స్ప్రెస్,
రైలు
నం.16121
తాంబరం
-తిరువనంతపురం
అమృత్
భారత్
వీక్లీ
ఎక్స్ప్రెస్
ఉన్నాయి.
ఆయా
రైళ్లలో
ప్రయాణించే
వారు
తమ
ప్రయాణాన్ని
ప్లాన్
చేసుకునేటప్పుడు
సవరించిన
సమయాలను
గమనించాలని
అధికారులు
కోరారు.
ఏపీలోని
ఈ
స్టేషన్లలో
టైమింగ్స్
మార్పు
రైలు
నం.16108
సంత్రగచ్చి
-తాంబరం
అమృత్
భారత్
వీక్లీ
ఎక్స్ప్రెస్
కు
ఏపీలోని
శ్రీకాకుళం
రోడ్
నుంచి
నెల్లూరు
స్టేషన్
వరకూ
స్పల్పమార్పులు
జరిగాయి.
గమ్యస్దానమైన
తాంబరానికి
మాత్రం
ఈ
రైలు
10
నిమిషాల
ముందే
అంటే
ఉదయం
9.05కు
చేరుకోనుంది.
ఈ
మార్పులు
ఫిబ్రవరి
7
నుంచి
అమల్లోకి
వస్తాయి.
అలాగే
రైలు
నం.20610
తిరుచ్చిరాపల్లి
-న్యూ
జల్పైగురి
అమృత్
భారత్
వీక్లీ
ఎక్స్ప్రెస్
కు
ఏపీలోని
దువ్వాడ,
విశాఖ,
విజయనగరం,
శ్రీకాకుళం
రోడ్,
పలాస
స్టేషన్లలో
టైమింగ్స్
స్వల్పంగా
మార్చారు.
ఈ
మార్పులు
ఫిబ్రవరి
4
నుంచి
అమల్లోకి
వస్తాయి.
The
timings
of
the
following
Amrit
Bharat
Express
services
have
been
revised
at
select
stations
with
effect
from
the
dates
mentioned:🔹
Train
No.
16108
Santragachi
–
Tambaram
Amrit
Bharat
Weekly
Express
🔹
Train
No.
20610
Tiruchchirappalli
–
New
Jalpaiguri
Amrit
Bharat
Weekly…
pic.twitter.com/vnPE7ylS4M—
Southern
Railway
(@GMSRailway)
January
30,
2026
మార్పులు
స్వల్పమే
అలాగే
రైలు
నం.20604
న్యూ
జల్పైగురి
-అమృత్
భారత్
వీక్లీ
ఎక్స్ప్రెస్
రైలుకు
కూడా
ఏపీలోని
దువ్వాడ,
విశాఖ,
విజయనగరం,
శ్రీకాకుళం
రోడ్,
పలాస
స్టేషన్లలో
టైమింగ్స్
స్వల్పంగా
మార్చారు.
ఈ
మార్పులు
ఫిబ్రవరి
1
నుంచే
అమల్లోకి
వస్తాయి.
చివరిగా
రైలు
నం.16121
తాంబరం
-తిరువనంతపురం
అమృత్
భారత్
వీక్లీ
ఎక్స్ప్రెస్
రైలుకు
కేవలం
తాంబరం
స్టేషన్లో
మాత్రమే
సమయాన్ని
స్వల్పంగా
మార్చారు.
ఈ
మార్పులను
దక్షిణ
రైల్వే
ఎక్స్
లో
ట్వీట్
చేసింది.


