ఏపీలో లెక్కలన్నీ తారుమారు..! ఈ ఏడాది టాప్ పొలిటిషియన్ ఆయనే..!

Date:


Andhra Pradesh

oi-Syed Ahmed

ఏపీలో
గతేడాది
అసెంబ్లీ
ఎన్నికల
తర్వాత
రాజకీయ
పరిణామాల్లో
పెనుమార్పులు
వచ్చాయి.
ఐదేళ్లుగా
అధికారంలో
ఉన్న
వైఎస్
జగన్
ను
కాదని
ప్రజలు
చంద్రబాబు,
పవన్
కళ్యాణ్,
బీజేపీతో
కూడిన
ఎన్డీయే
కూటమిని
గెలిపించారు.

తర్వాత
పాలన
మొదలుపెట్టిన
ఎన్డీయే
ఏడాదిన్నర
పూర్తి
చేసుకుంది.
అయితే

ఏడాదిన్నరలో
చాలా
లెక్కలు
మారిపోయాయి.
రాష్ట్ర
ముఖ్యమంత్రిగా
చంద్రబాబు,
ఉప
ముఖ్యమంత్రిగా
పవన్
కళ్యాణ్,
విపక్ష
నేతగా
వైఎస్
జగన్
అంచనాల
మేరకు
రాణించేందుకు
ప్రయత్నిస్తున్నారు.
అయితే
ప్రజల
తీర్పు
ఎలా
ఉందో
ఓసారి
చూద్దాం.

కూటమి
సర్కార్
ఏడాదిన్నర
పాలన
సందర్భంగా
పలు
సర్వేలు,
గణాంకాలు
వెలువడుతూనే
ఉన్నాయి.
అలాగే
విపక్ష
వైసీపీ
అధినేత
జగన్
పనితీరుపైనా
చర్చలు
జరుగుతూనే
ఉన్నాయి.
అయితే
డిజిటల్
విభాగంలో
అంటే
ఇంటర్నెట్
లో
ఆంధ్రప్రదేశ్
కు
సంబంధించి
యూజర్లు
ఎక్కువగా
సెర్చ్
చేసిన
రాజకీయ
నేతల
జాబితా
ఓసారి
గమనిస్తే
ప్రజల్లో
ఆదరణ
ఎవరికి
ఎలా
ఉందో
అర్దమవుతోంది.
ఇందులో
ప్రధానంగా
గూగుల్
సెర్చ్
లో
చంద్రబాబు,
జగన్,
లోకేష్,
పవన్
లను
జనం
ఎక్కువగా
సెర్చ్
చేశారు.

అయితే
సీఎంగా
ఉన్న
చంద్రబాబు,
విపక్ష
నేతగా
ఉన్న
వైఎస్
జగన్
కంటే
డిప్యూటీ
సీఎంగా
ఉన్న
పవన్
కళ్యాణ్
కోసమే
గూగుల్
లో
ఎక్కువగా
యూజర్లు

ఏడాది
సెర్చే
చేశారని
తెలుస్తోంది.
గూగుల్

ఏడాది
ట్రెండ్స్,
ప్రజాభిప్రాయం
ఆధారంగా
నేతల
ఆదరణ
ఎలా
ఉందో
వెల్లడించింది.
ఇందులో
పవన్
కళ్యాణ్
టాప్
లో
నిలిచారు.

తర్వాత
స్ధానంలో
చంద్రబాబు,
జగన్,
లోకేష్
ఉన్నారు.

లెక్కన
చూస్తే
పవన్
కళ్యాణ్

ఏడాది
టాప్
పొలిటిషియన్
గా
జనం
మద్దతు
ఎవరికి
లభించిందో
తెలుస్తోంది.

పవన్
కళ్యాణ్
ను
యూజర్లు
తన
శాఖలకు
సంబంధించిన
అంశాలతో
పాటు
సనాతన
ధర్మం,
వారాహి
డిక్లరేషన్,
ఓజీ
సినిమా
విషయాల్లో
ఎక్కువగా
సెర్చ్
చేశారని
గూగుల్
చెబుతోంది.
అలాగే
చంద్రబాబును
రాష్ట్ర
పాలన,
కొత్త
పెట్టుబడులు,
వికసిత్
ఆంధ్రప్రదేశ్
వంటి
అంశాల్లో
ఎక్కువగా
సెర్చ్
చేసినట్లు
తెలిపింది.
వైఎస్
జగన్
ను
విపక్ష
నేత
పాత్ర,
కేసులు,
ప్రభుత్వంపై
విమర్శలు
వంటి
అంశాల్లో
ఎక్కువగా
సెర్చ్
చేశారు.
చివరిగా
లోకేష్
ను
ప్రపంచ
టెక్
దిగ్గజాలను
ఏపీకి
తీసుకురావడం,
యువత
కోసం
ఆయన
చేపడుతున్న
స్కిల్
రోడ్
మ్యాప్
వంటి
అంశాల్లో
సెర్చ్
చేశారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related