Andhra Pradesh
oi-Sai Chaitanya
ఏపీలో
రాజకీయాలు
కొత్త
మలుపు
తీసుకుంటున్నాయి.
వివాదాస్పద
వ్యాఖ్యలు..
తదనంతర
పరిణామాలు
ఇప్పుడు
కొత్త
చర్చకు
కారణం
అవుతున్నాయి.
వైసీపీ
లక్ష్యంగా
కూటమి
పార్టీలు
వ్యూహాలు
అమలు
చేస్తున్నాయి.
కూటమి
ప్రభుత్వాన్ని
టార్గెట్
చేస్తూ
వైసీపీ
పోరాటాలకు
సిద్దం
అవుతోంది.
ఇదే
సమయంలో
స్థానిక
సంస్థల
ఎన్నికల
పైన
కీలక
సమాచారం
అందుతోంది.
రాష్ట్రంలో
స్థానిక
ఎన్నికల
పైన
రాష్ట్ర
ఎన్నికల
సంఘం
కసరత్తు
మొదలు
పెట్టింది.
దీంతో,
ఎన్నికల
పైన
దాదాపు
ఒక
స్పష్టత
వచ్చింది.
ఏపీలో
స్థానిక
సంస్థల
ఎన్నికల
దిశగా
కసరత్తు
జరుగుతోంది.
ఇప్పటికే
రాష్ట్ర
ఎన్నికల
సంఘం
ఓటర్ల
జాబితా
పైన
కలెక్టర్లకు
స్పష్టత
ఇచ్చింది.
తాజాగా
జరిగిన
పార్టీ
సమావేశంలో
ముఖ్యమంత్రి
చంద్రబాబు
సైతం
స్థానిక
సంస్థల
ఎన్నికలకు
సిద్దంగా
ఉండాలని
కేడర్
కు
సూచన
చేసారు.
కాగా,
కూటమి
పార్టీల్లోని
మూడు
పార్టీల
నేతలు
స్థానికంగా
ఎన్నికలకు
సమాయత్తం
అవుతున్నారు.
అదే
విధంగా
స్థానిక
సంస్థల్లో
పోటీ
చేసేందుకు
మూడు
పార్టీల
అభ్యర్ధుల
నుంచి
పోటీ
ఎక్కువగా
ఉంది.
టీడీపీతో
పాటుగా
బీజేపీ..
జనసేన
సైతం
స్థానికంగా
తమ
బలం
పెంచుకోవాలని
భావిస్తోంది.
ఇక…
వైసీపీ
కడప
జిల్లా
పులివెందులలో
జరిగిన
జెడ్పీటీసీ
ఉప
ఎన్నికల్లో
ఓటమి
తరువాత
రాష్ట్ర
వ్యాప్తం
గా
జరిగే
స్థానిక
ఎన్నికల్లో
సత్త
చాటాలని
వేచి
చూస్తోంది.
దీంతో,
ఎన్నికల
ముహూర్తం
పైన
రాజకీయంగా
ఆసక్తి
నెలకొంది.
సెన్సెస్
పూర్తయిన
తరువాతనే
అయితే,
ఇదే
సమయంలో
కీలక
అప్డేట్
అందుతోంది.
ఏపీలో
స్థానిక
సంస్థల
ఎన్నికలు
ఇప్పట్లో
జరిగే
అవకాశం
కనిపించటం
లేదు.
దేశ
వ్యాప్తంగా
ఈ
నెల
20వ
తేదీ
తరువాత
జన
గణన
ప్రారంభం
కానుంది.
ఇందు
కోసం
ఇప్పటికే
షెడ్యూల్
ప్రకటించారు.
దీంతో..
20వ
తేదీ
లోగా
స్థానిక
ఎన్నికలను
పూర్తి
చేయాల్సి
ఉంది.
దీనికి
అనుగుణంగానే
తెలంగాణ
రాష్ట్ర
ఎన్నికల
సంఘం
మున్సిపల్
ఎన్నికల
షెడ్యూల్
ప్రకటించింది.
నామినేషన్ల
ఘట్టం
పూర్తి
చేసింది.
ఈ
నెల
11న
ఎన్నికలు
జరగనున్నాయి.
ఇక..
సెన్సెస్
పూర్తి
చేసి
లెక్కలు
వెల్లడించిన
తరువాతనే
ఏపీ
లో
స్థానిక
సంస్థల
ఎన్నికలు
జరిగే
అవకాశం
ఉంది.
సెన్సెస్
పూర్తి
కావటానికి
దాదాపు
ఏడాదిన్నార
కాలం
పడుతుందనే
అంచనాలు
ఉన్నాయి.
ఈ
లెక్కన
2027
ద్వితీయార్ధంలో
లేదా
2028
ప్రారంభంలో
స్థానిక
సంస్థల
ఎన్నికలు
జరిగే
అవకాశం
ఉందని
సమాచారం.
అప్పటి
వరకు
ఏపీలో
ఎన్నికలు
నిర్వహించే
ఛాన్స్
లేదని
చెబుతున్నారు.


