ఒక్క రోజులోనే 2.84 కోట్ల కేసులు పరిష్కారం.. జాతీయ లోక్‌ అదాలత్‌ రికార్డ్ !!

Date:


India

-Korivi Jayakumar

2026 ఏడాదికి గాను తొలిసారిగా నిర్వహించిన తొలి జాతీయ లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో కేసులు పరిష్కరించబడ్డాయి. National Legal Services Authority (నల్సా) విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా మొత్తం 2,84,14,329 కేసులకు పరిష్కారం లభించింది. ఈ పరిష్కారాల ద్వారా సుమారు రూ.10,920 కోట్ల విలువైన వివాదాలు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం దేశవ్యాప్తంగా ఒకే రోజు నిర్వహించిన ఈ కార్యక్రమం న్యాయ వ్యవస్థలో వేగవంతమైన పరిష్కారాలకు మంచి ఉదాహరణగా నిలిచింది.

ప్రాథమిక వివాదాలు – పెండింగ్ కేసులు..

పరిష్కరించబడిన కేసుల్లో ఎక్కువ భాగం ప్రాథమిక దశలో ఉన్న వివాదాలే. మొత్తం కేసుల్లో 2,57,82,254 ప్రీ-లిటిగేషన్ లేదా కోర్టుకు వెళ్లకముందే పరిష్కరించగలిగిన వివాదాలు కాగా, 26,32,075 కేసులు ఇప్పటికే కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నవి. లోక్ అదాలత్ విధానం ద్వారా ఈ కేసులు పరస్పర సమ్మతితో త్వరగా ముగిసాయి.

సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిర్వహణ..

ఈ జాతీయ లోక్ అదాలత్‌ను Supreme Court of India పర్యవేక్షణలో నిర్వహించారు. నల్సా పేట్రన్-ఇన్-చీఫ్‌గా ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి Justice Surya Kant మార్గదర్శకత్వంలో, నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ Justice Vikram Nath ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. దేశవ్యాప్తంగా న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

దేశవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహణ

ఈ జాతీయ లోక్ అదాలత్‌ను దేశంలోని 26 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించారు. హైకోర్టులు, జిల్లా కోర్టులు, వివిధ ట్రైబ్యునళ్లు, వినియోగదారుల ఫోరంలు, శాశ్వత లోక్ అదాలత్‌లు వంటి అనేక న్యాయ వేదికలలో కేసులు విచారించి పరిష్కరించారు. వేలాది న్యాయమూర్తులు, న్యాయవాదులు మరియు న్యాయ సేవా వాలంటీర్లు ఇందులో పాల్గొన్నారు.

ఈ లోక్ అదాలత్‌లో వివిధ రకాల కేసులను పరిష్కరించారు. ముఖ్యంగా సివిల్ కేసులు, జరిమానాలకు అర్హత ఉన్న క్రిమినల్ కేసులు, రెవెన్యూ వివాదాలు, బ్యాంక్ రికవరీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు వంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగ సేవలు, పింఛన్ సమస్యలు, మోటార్ వాహన ప్రమాద క్లెయిమ్‌లు కూడా పెద్ద ఎత్తున పరిష్కరించబడ్డాయి.

ట్రాఫిక్ చలానాలు, కుటుంబ మరియు వైవాహిక వివాదాలు, వారసత్వ సంబంధిత కేసులు, భూసేకరణ సమస్యలు, కార్మిక వివాదాలు వంటి అనేక అంశాలు కూడా ఈ సందర్భంగా పరిష్కారమయ్యాయి. అదనంగా ఆర్బిట్రేషన్, వినియోగదారుల ఫిర్యాదులు, విద్యుత్, నీటి, టెలిఫోన్ బిల్లులకు సంబంధించిన వివాదాలు కూడా లోక్ అదాలత్ ద్వారా ముగిశాయి.

లోక్ అదాలత్ ప్రత్యేకత..

లోక్ అదాలత్‌ల ముఖ్య ఉద్దేశ్యం కేసులను త్వరగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించడం. ఇందులో పక్షాల మధ్య పరస్పర చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. కోర్టు ఫీజు కూడా తిరిగి చెల్లించబడే అవకాశం ఉండటం వల్ల ప్రజలు ఈ విధానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దేశంలోని కోర్టుల్లో పెండింగ్ కేసులు కోట్లలో ఉన్న నేపథ్యంలో లోక్ అదాలత్‌లు న్యాయ వ్యవస్థపై ఉన్న ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒకే రోజులో లక్షల కేసులు పరిష్కరించబడడం వల్ల కోర్టుల పనిభారం గణనీయంగా తగ్గుతోంది.

కాగా లోక్ అదాలత్‌ల ద్వారా ప్రజలు త్వరగా న్యాయం పొందగలుగుతారు. దీర్ఘకాలం కోర్టు కేసులు నడవకుండా సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుంది. సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. అందుకే న్యాయ సేవా సంస్థలు ప్రజలు ఎక్కువగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నాయి.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Harry Styles Pulls Double Duty on SNL, Performs Two Songs

Harry Styles pulled double duty on this week’s episode...

AI Czar David Sacks wants Trump to ‘get out’ of Iran

David Sacks, the White House’s AI and crypto czar,...