International
oi-Jakki Mahesh
ఇరాన్
నిరసనకారులపై
ఆ
దేశ
ప్రభుత్వం
సాగిస్తున్న
అణచివేత
పరాకాష్టకు
చేరింది.
ద్రవ్యోల్బణం,
రాజకీయ
అణచివేత,
పౌర
హక్కుల
కోసం
జనవరి
ప్రారంభం
నుంచి
సాగుతున్న
నిరసనల్లో
వేలాది
మంది
ప్రాణాలు
కోల్పోయినట్లు
దిగ్భ్రాంతికరమైన
గణాంకాలు
వెలుగులోకి
వచ్చాయి.
రెండు
రోజుల్లోనే
మారణహోమం
విపక్షాల
మద్దతు
ఉన్న
‘ఇరాన్
ఇంటర్నేషనల్’
నివేదిక
ప్రకారం..
జనవరి
8,
9
తేదీల్లో
భద్రతా
దళాలు
జరిపిన
కాల్పుల్లో
ఏకంగా
36,000
మందికి
పైగా
మరణించినట్లు
సమాచారం.
క్షేత్రస్థాయి
నివేదికలు,
వైద్య
సిబ్బంది,
ప్రత్యక్ష
సాక్షుల
నుంచి
సేకరించిన
సమాచారం
ఆధారంగా
ఈ
అంకెలను
వెల్లడించారు.
ఆధునిక
చరిత్రలో
ఇది
అతిపెద్ద
పౌర
ఊచకోతగా
అభివర్ణించబడుతోంది.
ఇరాన్
ఇస్లామిక్
రివల్యూషనరీ
గార్డ్
కార్ప్స్(IRGC)పై
తీవ్ర
ఆరోపణలు
ఈ
దారుణ
కాండ
వెనుక
ఇరాన్
ఇస్లామిక్
రివల్యూషనరీ
గార్డ్
కార్ప్స్
(IRGC),
‘బసీజ్
మిలీషియా’
దళాలు
ఉన్నట్లు
నివేదికలు
పేర్కొంటున్నాయి.
నిరసనలను
అణచివేయడానికి
ఇరాన్
ప్రభుత్వం
ఇరాక్,
సిరియా
నుండి
కిరాయి
దళాలను
కూడా
రప్పించినట్లు
ఆరోపణలు
వస్తున్నాయి.
వివిధ
నివేదికల
ప్రకారం
మృతుల
సంఖ్య
27,500
నుంచి
36,500
మధ్య
ఉండవచ్చని
అంచనా.
అజ్ఞాతంలోకి
సుప్రీం
లీడర్
ఖమేనీ?
దేశంలో
పరిస్థితులు
చేయి
దాటిపోవడంతో
ఇరాన్
సుప్రీం
లీడర్
అలీ
ఖమేనీ
భద్రత
దృష్ట్యా
టెహ్రాన్లోని
ఒక
రహస్య
భూగర్భ
ప్రాంతానికి
మారినట్లు
సమాచారం.
అంతర్గత
తిరుగుబాటు,
విదేశీ
దాడుల
భయంతో
ప్రభుత్వం
ఈ
నిర్ణయం
తీసుకున్నట్లు
తెలుస్తోంది.
అంతర్జాతీయ
స్పందన
ఇరాన్
భద్రతా
దళాల
హింసాత్మక
చర్యలను
ఐక్యరాజ్యసమితి
మానవ
హక్కుల
మండలి
తీవ్రంగా
ఖండించింది.
ఉద్రిక్తతల
నేపథ్యంలో
ఎయిర్
ఫ్రాన్స్,
లుఫ్తాన్సా
వంటి
ప్రముఖ
విమానయాన
సంస్థలు
ఇరాన్,
పరిసర
ప్రాంతాలకు
విమాన
సర్వీసులను
రద్దు
చేశాయి.
భారత్
నుంచి
ఎయిర్
ఇండియా,
ఇండిగో
కూడా
తమ
రూట్లను
మార్చుకున్నాయి.
ఇరాన్
ప్రభుత్వం
ఈ
గణాంకాలను
అధికారికంగా
ధ్రువీకరించలేదు,
కానీ
అంతర్జాతీయ
మానవ
హక్కుల
సంస్థలు
అక్కడి
పరిస్థితులపై
తీవ్ర
ఆందోళన
వ్యక్తం
చేస్తున్నాయి.


