Telangana
oi-Sai Chaitanya
తెలంగాణలో
మరో
ఉప
ఎన్నిక
ఖాయమైంది.
ఎమ్మెల్సీ
కవిత
రాజీనామాను
మండలి
ఛైర్మన్
ఆమోదించారు.
మండలి
సమావేశాల్లో
కవిత
తన
రాజీనామా
ఆమోదించాలని
కోరుతూ..
తన
రాజీనామాకు
దారి
తీసిన
కారణాలను
వివరించారు.
కన్నీటి
పర్యంతమయ్యారు.
సభా
వేదికగా
కవిత
కోరటంతో
ఛైర్మన్
రాజీనామాను
ఆమోదించారు.
ఇప్పుడు
కవిత
స్థానం
కోసం
జరిగే
ఉప
ఎన్నికలో
ప్రస్తుత
మంత్రి
బరిలోకి
దిగటం
ఖాయంగా
కనిపిస్తోంది.
దీంతో..
ఈ
ఎన్నిక
ప్రభుత్వానికి
ప్రతిష్ఠాత్మకంగా
మారుతోంది.
శాసనమండలి
సభ్యత్వానికి
తెలంగాణ
జాగృతి
అధ్యక్షురాలు
కల్వకుంట్ల
కవిత
రాజీనామాను
శాసనమండలి
చైర్మన్
గుత్తా
సుఖేందర్రెడ్డి
ఆమోదించారు.
2021లో
నిజామాబాద్
స్థానిక
సంస్థల
స్థానం
నుంచి
శాసనమండలికి
కవిత
సభ్యురాలిగా
ఎన్నికయ్యారు.
బీఆర్ఎస్
పార్టీకి,
ఎమ్మెల్సీ
పదవికి
సెప్టెంబర్
3న
ఆమె
రాజీనామా
చేశారు.
తాజాగా
మండలిలో
ప్రసంగించి
కవిత..
తన
రాజీనామాను
ఆమోదించాలని
చైర్మన్ను
మరోసారి
విజ్ఞప్తి
చేశారు.
కవిత
రాజీనామాతో
నిజామాబాద్
స్థానిక
సంస్థల
కోటా
ఎమ్మెల్సీ
స్థానం
ఖాళీ
అయినట్టు
లెజిస్లేటివ్
సెక్రటరీ
నరసింహాచార్యులు
మంగళవారం
నోటిఫికేషన్
జారీచేశారు.
ఈ
రాజీనామా,
ఖాళీ
ఏర్పడిన
వివరాలను
కేంద్ర
ఎన్నికల
సంఘం,
రాష్ట్ర
ప్రభుత్వ
ప్రధాన
కార్యదర్శి,
రాష్ట్ర
ప్రధాన
ఎన్నికల
అధికారికి
అధికారికంగా
పంపారు.
దీంతో..
త్వరలోనే
నిజామాబాద్
స్థానిక
సంస్థల
కోటా
ఎమ్మెల్సీ
స్థానానికి
ఉప
ఎన్నిక
జరగనుంది.
ఈ
ఉప
ఎన్నికలో
ప్రస్తుత
మంత్రి
అజారుద్దీన్
పోటీ
చేసే
అవకాశం
కనిపిస్తోంది.
అజారుద్దీన్
ను
గవర్నర్
కోటాలో
ఎంపిక
చేస్తూ
ప్రభుత్వం
నిర్ణయం
తీసుకున్నా…
సప్రీంకోర్టులో
కేసు
కారణంగా
ఇంకా
ఆమోదం
లభించలేదు.
జూబ్లీహిల్స్
ఎన్నిక
సమయంలో
ఏ
సభలోనూ
సభ్యుడు
కాక
పోయినా..అజారుద్దీన్
మంత్రి
అయ్యారు.
ఆరు
నెలల్లోగా
చట్ట
సభకు
ఎంపిక
కావాల్సి
ఉంది.
కాగా,
ఇప్పటికే
రెండు
నెలల
సమయం
పూర్తయింది.
దీంతో..
ఇప్పుడు
కవిత
రాజీనామా
ఆమోదంతో
ఈ
స్థానం
నుంచి
అజారుద్దీన్
పోటీ
చేయటం
ఖాయంగా
కనిపిస్తోంది.
కాంగ్రెస్
కు
స్థానిక
సంస్థల్లో
నిజామాబాద్
జిల్లాలో
ఉన్న
బలం
ఆధారంగా
దీని
పైన
తుది
నిర్ణయం
తీసుకునే
అవకాశం
కనిపిస్తోంది.
ఇక..
కవిత
వచ్చే
శాసన
సభ
ఎన్నికల్లో
పోటీ
చేయటం
ద్వారానే
మరోసారి
చట్ట
సభకు
వచ్చే
అవకాశం
కనిపిస్తోంది.
దీంతో..
రానున్న
రోజుల్లో
కవిత
నిర్ణయాల
పైన
రాజకీయంగా
ఉత్కంఠ
కొనసాగుతోంది.


