India
oi-Bomma Shivakumar
బాలీవుడ్
స్టార్
హీరో
రణ్
వీర్
సింగ్
ఇటీవల
ధురంధర్
మూవీతో
ఇండస్ట్రీ
హిట్
కొట్టాడు.
ఈ
మూవీ
ఇండియన్
బాక్సాఫీస్
వద్ద
దాదాపు
రూ.
1200
కోట్లకుపైగా
కలెక్షన్స్
రాబట్టింది.
ఇక
ఈ
మూవీ
జనవరి
30న
ఓటీటీలో
స్ట్రీమింగ్
కానుంది.
అయితే
రణ్
వీర్
సింగ్
పై
తాజాగా
ఎఫ్ఐఆర్
నమోదైంది.
కన్నడ
బ్లాక్
బస్టర్
మూవీ
‘కాంతార’లోని
పవిత్రమైన
దైవ
కోల
సన్నివేశాన్ని
రణ్
వీర్
సింగ్
స్టేజీపై
ఎగతాళి
చేస్తూ
ఇమిటేట్
చేశాడని,
దాంతో
హిందువుల
మనోభావాలను
దెబ్బతీశారనే
ఆరోపణల
నేపథ్యంలో
బెంగళూరులోని
ది
హై
గ్రౌండ్
పోలీసులు
ఆయనపై
కేసు
నమోదు
చేశారు.
బాలీవుడ్
స్టార్
హీరో
రణ్
వీర్
సింగ్
కు
బిగ్
షాక్
తగిలింది.
తాజాగా
అతడిపై
బెంగళూరు
పోలీసులు
ఎఫ్ఐఆర్
నమోదు
చేశారు.
కన్నడ
బ్లాక్
బస్టర్
మూవీ
కాంతార
లోని
పవిత్రమైన
సీన్లను
రణ్
వీర్
సింగ్
ఎగతాళి
చేశాడని
ఆరోపణలు
వచ్చాయి.
అయితే
బెంగళూరుకు
చెందిన
న్యాయవాది
ప్రశాంత్
మేతల్..
రణ్
వీర్
సింగ్
చర్యలు
కోట్లాది
మంది
హిందువుల,
ముఖ్యంగా
కర్ణాటకలోని
తుళు
మాట్లాడే
ప్రజల
సెంటిమెంట్లను
గాయపరిచాయని
కోర్టులో
ప్రైవేట్
పిటిషన్
దాఖలు
చేశారు.
ఆ
పిటిషన్
పై
విచారణ
చేపట్టిన
బెంగళూరులోని
మేజిస్ట్రేట్
కోర్టు,
పోలీసులకు
కేసు
నమోదు
చేయాలని
ఆదేశించింది.
ఈ
మేరకు
బెంగళూరులోని
ది
హై
గ్రౌండ్
పోలీసులు
ఆయనపై
కేసు
నమోదు
చేశారు.
గతేడాది
నవంబర్
28న
గోవాలో
జరిగిన
ఇంటర్నేషనల్
ఫిల్మ్
ఫెస్టివల్
ఆఫ్
ఇండియా
(IFFI)
వేడుకల్లో
రణ్వీర్
సింగ్
పాల్గొన్నారు.
అయితే
వేదికపై
కాంతార
సినిమా,
రిషబ్
శెట్టి
నటనను
ప్రశంసించే
నేపథ్యంలో
రణ్
వీర్
సింగ్
కాంతార
చిత్రంలోని
దైవకోల
సన్నివేశాన్ని
ఇమిటేట్
చేశారు.
దీంతో
తుళు
సంస్కృతిని
అనుసరించే
భక్తులు,
హిందూ
సంఘాలు
రణ్
వీర్
సింగ్
పై
ఆగ్రహం
వ్యక్తం
చేశాయి.
ఈ
క్రమంలోనే
రణ్
వీర్
సింగ్
పై
తాజాగా
ఎఫ్ఐఆర్
నమోదైంది.


