India
oi-Bomma Shivakumar
2024-25
ఆర్థిక
సంవత్సరానికి
సంబంధించి
దేశంలోని
రాజకీయ
పార్టీలకు
కార్పొరేట్
సంస్థలు
అందించే
విరాళాలు
మూడింతలు
పెరిగాయి.
రూ.
3,811
కోట్లకు
చేరాయి.
సుప్రీంకోర్టు
వివాదాస్పద
ఎలక్టోరల్
బాండ్స్
ను
రద్దు
చేసిన
తర్వాత
రాజకీయ
పార్టీలకు
కార్పొరేట్
విరాళాలు
పెరిగినట్లు
స్పష్టం
అవుతోంది.
ఇక
గతేడాది
వివిధ
రాజకీయ
పార్టీలకు
ట్రస్టుల
ద్వారా
అందిన
విరాళాలు
రూ.
1,218
కోట్లుగా
ఉన్నాయి.
భారత
ఎన్నికల
సంఘం
నివేదిక
ప్రకారం
9
ఎలక్టోరల్
ట్రస్టులు
మొత్తం
రూ.
3,811.37
కోట్లు
విరాళాలు
వచ్చినట్లు
స్పష్టం
అవుతోంది.
వీటిలో
బీజేపీ
పార్టీ
మాత్రమే
కేవలం
రూ.
3,112.50
కోట్లు
విరాళాలు
సాధించింది.
మొత్తం
విరాళాల్లో
ఇవి
82
శాతంగా
ఉండటం
గమనార్హం.
అలాగే
కాంగ్రెస్
పార్టీకి
రూ.
298.77
కోట్లు
విరాళంగా
లభించాయి.
ఇది
మొత్తం
విరాళంలో
8
శాతంగా
ఉంది.
అలాగే
దేశంలోని
మిగతా
పార్టీలు
అన్ని
కలిపి
రూ.
400
కోట్ల
వరకు
విరాళాలు
వచ్చినట్లు
స్పష్టం
అవుతోంది.
వివాదాస్పద
ఎలక్టోరల్
బాండ్స్
రాజ్యాంగ
విరుద్ధం
అని
గతంలో
సుప్రీంకోర్టు
రద్దు
చేసిన
నేపథ్యంలో
తర్వాత
రాజకీయ
పార్టీలకు
కార్పొరేట్
విరాళాలు
పెరిగినట్లు
తెలుస్తోంది.
ఇక
గతేడాది(2023-24)లో
వివిధ
రాజకీయ
పార్టీలకు
ట్రస్టుల
ద్వారా
అందిన
విరాళాలు
రూ.
1,218
కోట్లుగా
ఉన్నాయి.
విరాళాల్లో
విరాళాలలో
ప్రూడెంట్
ఎలక్టోరల్
ట్రస్ట్
రూ.
2,668.46
కోట్లు
విరాళాలు
ఇచ్చి
అగ్రస్థానంలో
నిలిచింది.
వీటిలో
రూ.
2,180.71
కోట్లు
కేవలం
బీజేపీ
పార్టీకే
వెళ్లాయి.
అలాగే
టాటా
గ్రూప్
కంపెనీల
నుండి
నిధులు
సేకరించిన
ప్రోగ్రెసివ్
ఎలక్టోరల్
ట్రస్ట్
రూ.
914.97
కోట్లు
విరాళంగా
ఇచ్చింది.
దీనిలో
81
శాతం
బీజేపీకి
వెళ్లినట్లు
స్పష్టం
అవుతోంది.
అలాగే
మహీంద్రా
గ్రూప్..
న్యూ
డెమోక్రటిక్
ఎలక్టోరల్
ట్రస్ట్
రూ.
160
కోట్లు
విరాళంగా
ఇచ్చింది.
ఇందులో
రూ.
150
కోట్లు
బీజేపీకి
విరాళంగా
ఇచ్చింది.


