కొత్త ఏడాదిలో కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్..! 8వ వేతన సంఘంపై..!

Date:


కేంద్రం నియమించిన 8వ వేతన సంఘం నివేదిక 18 నెలల్లో అంటే 2027 మధ్యలో వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ 18 నెలల తర్వాత పెరిగే జీతాలు, పెన్షన్లను 2026 జనవరి 1 నుంచి వర్తింపచేయబోతున్నట్లు తెలుస్తోంది.

India

-Syed Ahmed

దేశవ్యాప్తంగా
వివిధ
రాష్ట్రాలు,
కేంద్ర
పాలిత
ప్రాంతాల్లో
పనిచేస్తున్న
ఉద్యోగులకు
కేంద్రం
గుడ్
న్యూస్
చెప్పబోతోంది.
7వ
వేతన
సంఘం
పదవీకాలం

నెల
31తో
ముగియనున్న
నేపథ్యంలో
కేంద్ర
ప్రభుత్వ
ఉద్యోగులు,
పెన్షనర్ల
కోసం
8వ
వేతన
సంఘాన్ని
(8th
Pay
Commission)
నవంబర్
లోనే
నియమించారు.
అలాగే
సిఫార్సుల
కోసం
18
నెలల
గడువు
కూడా
ఇచ్చారు.
అయితే
దీనిపై
ముందే
ప్రకటన
రాబోతున్నట్లు
తెలుస్తోంది.

కేంద్రం
నియమించిన
8వ
వేతన
సంఘం
నివేదిక
18
నెలల్లో
అంటే
2027
మధ్యలో
వెలువడే
అవకాశం
ఉంది.
అయితే

18
నెలల
తర్వాత
పెరిగే
జీతాలు,
పెన్షన్లను
2026
జనవరి
1
నుంచి
వర్తింపచేయబోతున్నట్లు
తెలుస్తోంది.
దీనిపై
కేంద్రం
అధికారికంగా
ప్రకటన
చేయబోతున్నట్లు
సమాచారం.

లెక్కన
ఉద్యోగులకు
పెరిగిన
వాస్తవ
జీతాల
చెల్లింపులు
ఆలస్యమైనా,
బకాయిలు
మాత్రం

అమలు
తేదీ
నుంచే
లెక్కించి
అకౌంట్లలో
జమ
చేస్తారు.

గతంలో
2016
జనవరి
నుంచి
జీతాలు
సవరించగా..
జూన్
లో
కేబినెట్
ఆమోదం
తర్వాత
బకాయిలతో
కలిపి
చెల్లించారు.
ఈసారి
కూడా
అలాగే
ముందుగానే
జీతాల
పెంపుపై
ప్రకటన
వస్తుందని
భావిస్తున్నారు.
అనంతరం
కేబినెట్
ఆమోదం,
ఇతర
లాంఛనాలు
పూర్తి
చేసి
2027లో
బకాయిలతో
కలిపి
చెల్లించే
అవకాశముంది.
ఉద్యోగులు
2026-27
ఆర్థిక
సంవత్సరంలో
జీతాల
పెంపు
ఆశించవచ్చని
నిపుణులు
చెప్తున్నారు.

అలాగే
గతాన్ని
గమనిస్తే
6వ
వేతన
సంఘం
సగటున
40%
జీతాలు
పెంచింది.
7వ
వేతన
సంఘం
2.57
ఫిట్‌మెంట్
ఫ్యాక్టర్‌తో
23-25%
పెంపుకు
సిఫార్సు
చేసింది.ఇప్పుడు
8వ
వేతన
సంఘం
20%
నుండి
35%
వరకు
జీతాల
పెంపు
సిఫార్సు
చేస్తుందని
అంచనా.
ఫిట్‌మెంట్
ఫ్యాక్టర్
2.4
నుండి
3.0
మధ్య
ఉండవచ్చని
భావిస్తున్నారు.
దీంతో
ఎంట్రీ-లెవల్
ఉద్యోగులకు
మూల
వేతనాల
పెంపు
ఎక్కువగా
ఉండే
అవకాశం
ఉంది.
మిగతా
ఉద్యోగులకు
కూడా
మంచి
పెంపు
ఉంటుందనే
అంచనాలున్నాయి.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related