ఖమేనీ మరణంపై భారత్ ఎందుకు సంతాపం తెలపడం లేదు?

Date:


International

oi-Jakki Mahesh

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన నేపథ్యంలో భారత సర్కారు అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కోరుతుండగా.. మోదీ ప్రభుత్వం మాత్రం వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది.

శాంతి మంత్రం పఠిస్తున్న ప్రధాని మోదీ
నేడు కెనడా ప్రధాని మార్క్ కార్నీతో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమాసియా పరిస్థితులపై స్పందించారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భారత్ ఎప్పుడూ శాంతి, స్థిరత్వాలకే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఏవైనా వివాదాలు ఉంటే చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

భారత్ ఎందుకు సంతాపం తెలపడం లేదు?
ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏ జీ7 (G7) ప్రజాస్వామ్య దేశం కూడా ఖమేనీ మృతికి సంతాపం తెలపలేదు. భారత్ కూడా అదే బాటలో పయనించడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. గతంలో ఖమేనీ కాశ్మీర్ అంశంపై, అలాగే భారత్‌లోని ముస్లింల పరిస్థితిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకున్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ (MEA) పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు భారత్‌కు కీలకమైన ఆర్థిక, ఇంధన భాగస్వాములు. ప్రస్తుతం ఇరాన్ దాడుల వల్ల ఈ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖమేనీని ‘క్రూరమైన వ్యక్తి’గా అభివర్ణించగా.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దీనిని ‘న్యాయం జరిగింది’ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశాలన్నీ ఇదే తరహాలో ఉన్నందున భారత్ కూడా తటస్థంగా ఉంది.

భారతీయుల భద్రతే ప్రథమ ప్రాధాన్యత
యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై కేంద్రం దృష్టి సారించింది. యుద్ధం కారణంగా ప్రయాణాలు ఆగిపోయిన విదేశీయులకు వీసా పొడిగింపు కోసం ఎఫ్ఆర్ఆర్ఓ (FRRO) ద్వారా సహాయం అందిస్తోంది. కర్ణాటకలోని అలీపుర్ వంటి ప్రాంతాల ప్రజలు గల్ఫ్‌లో ఉన్న తమ వారి కోసం ఆందోళన చెందుతుండటంతో, ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది.

జాతీయ ప్రయోజనాలకే మొగ్గు
గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా ఇరాన్ అణు కార్యక్రమాల విషయంలో ఐఏఈఏ (IAEA) లో వ్యతిరేక ఓటు వేసింది. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కూడా జాతీయ ప్రయోజనాలను, అంతర్జాతీయ సంబంధాలను బేరీజు వేసుకుని మౌనంగా ఉండటమే మేలని భావిస్తోంది. శాంతిని కోరుకుంటూనే, తనపై విమర్శలు చేసిన నాయకుడి విషయంలో భారత్ తనదైన శైలిలో స్పందిస్తోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Big Little Lies Season 3 Plot Revealed, Big Little Truths

“When a strange man begins lurking around the school...

క్యూలైన్ నిర్వహణలో ఇకపై..

Andhra Pradesh oi-Chandrasekhar Rao...

Trump invokes Pearl Harbor in front of Japanese prime minister to defend Iran attack secrecy

Prime Minister of Japan Sanae Takaichi (L) meets with U.S. President...