India
oi-Jakki Mahesh
బంగ్లాదేశ్లో
హిందువులపై
జరుగుతున్న
దాడులు,
అమానుష
హత్యలు
తీవ్ర
కలకలం
రేపుతున్నాయి.
ఇటీవల
30
ఏళ్ల
హిందూ
యువకుడు
దీపు
చంద్ర
దాస్ను
గుంపుగా
వచ్చి
అత్యంత
క్రూరంగా
కొట్టి..
చెట్టుకు
కట్టేసి
సజీవ
దహనం
చేసిన
ఘటనపై
భారతీయ
చలనచిత్ర
పరిశ్రమకు
చెందిన
ప్రముఖ
తారలు
తీవ్రంగా
స్పందించారు.
జాన్వీ
కపూర్
భావోద్వేగ
పోస్ట్
బాలీవుడ్
నటి
జాన్వీ
కపూర్
ఈ
ఘటనపై
ఇన్స్టాగ్రామ్లో
సుదీర్ఘ
పోస్ట్
చేశారు.
దీపు
చంద్ర
దాస్
హత్యను
‘అమానవీయం’,
‘కసాయి
చర్య’గా
ఆమె
అభివర్ణించారు.
“బంగ్లాదేశ్లో
జరుగుతున్నది
బహిరంగ
ఊచకోత.
ఈ
దారుణమైన
మాబ్
లించింగ్
వీడియో
చూసిన
తర్వాత
కూడా
మీకు
రక్తం
మరగకపోతే,
ఆ
కపటత్వమే
మనల్ని
నాశనం
చేస్తుంది.
ప్రపంచంలోని
ఏ
మూలనో
ఏదో
జరుగుతుందని
కన్నీళ్లు
పెట్టే
మనం..
మన
కళ్లముందే
మన
సోదరులను
సజీవ
దహనం
చేస్తుంటే
ఎందుకు
మౌనంగా
ఉంటున్నాం?”
అని
ఆమె
సూటిగా
ప్రశ్నించారు.
సీనియర్
నటి
జయప్రద
ఆవేదన
మాజీ
ఎంపీ,
సీనియర్
నటి
జయప్రద
ఈ
ఘటనపై
స్పందిస్తూ
కన్నీటిపర్యంతమయ్యారు.
“ఒక
మనిషిని
ఇంత
దారుణంగా
ఎలా
చంపగలరు?
ఇది
కేవలం
హింస
మాత్రమే
కాదు,
సనాతన
ధర్మం,
హిందుత్వంపై
జరుగుతున్న
దాడి.
మన
సోదరీమణుల
గౌరవంపై
దాడులు
జరుగుతున్నాయి,
దేవాలయాలు
కూల్చివేస్తున్నారు.
మనం
ఇంకా
ఎంతకాలం
మౌనంగా
ఉండాలి?”
అని
ఆమె
ప్రశ్నించారు.
VIDEO
|
Former
MP
and
actor
Jaya
Prada
(@realjayaprada)
says,
“Today
I
am
very
unhappy,
my
heart
is
bleeding,
thinking
how
such
kind
of
brutality
can
be
done
to
a
person,
in
Bangladesh,
an
innocent
Hindu
person
Dipu
Charan
Das
was
lynched
by
a
mob,
they
not
only
killed
him,
but…
pic.twitter.com/oBN3dNE1vx—
Press
Trust
of
India
(@PTI_News)
December
25,
2025
‘హిందువులారా
మేల్కొనండి’:
కాజల్
అగర్వాల్
పిలుపు
స్టార్
హీరోయిన్
కాజల్
అగర్వాల్
ఈ
క్రూరత్వాన్ని
ఖండిస్తూ
ఒక
పోస్టర్ను
షేర్
చేశారు.
“హిందువులారా
మేల్కొనండి..
మీ
మౌనం
మిమ్మల్ని
కాపాడదు”
అంటూ
ఆమె
హిందువుల
రక్షణపై
ఆందోళన
వ్యక్తం
చేశారు.
బాధితులకు
న్యాయం
జరగాలని
ఆమె
డిమాండ్
చేశారు.
మనోజ్
జోషి
ఘాటు
వ్యాఖ్యలు
ప్రముఖ
నటుడు
మనోజ్
జోషి
అంతర్జాతీయ
సమాజం,
సెలబ్రిటీల
ద్వంద్వ
వైఖరిని
ఎండగట్టారు.
“గాజా
లేదా
పాలస్తీనాలో
చిన్న
ఘటన
జరిగినా
అందరూ
ముందుకొస్తారు.
కానీ
బంగ్లాదేశ్లో
ఒక
హిందువును
దారుణంగా
చంపితే
ఎవరూ
నోరు
మెదపరు.
ఈ
మౌనం
చాలా
బాధాకరం”
అని
ఆయన
వ్యాఖ్యానించారు.
ఏమిటీ
ఘటన?
ఢాకాకు
సుమారు
100
కిలోమీటర్ల
దూరంలోని
మయమన్సింగ్లో
బట్టల
ఫ్యాక్టరీలో
పనిచేసే
దీపు
చంద్ర
దాస్ను
ఒక
గుంపు
విచక్షణారహితంగా
కొట్టింది.
అనంతరం
అతడిని
వివస్త్రను
చేసి
చెట్టుకు
కట్టేసి
నిప్పంటించారు.
ఆ
సమయంలో
అక్కడున్న
గుంపు
కేకలు
వేస్తూ
ఆనందాన్ని
వ్యక్తం
చేయడం
వీడియోలలో
రికార్డ్
అయింది.
ఇదిలా
ఉండగా..
బుధవారం
రాత్రి
అమృత్
మండల్
(29)
అనే
మరో
హిందూ
యువకుడిని
కూడా
గుంపుగా
వచ్చి
కొట్టి
చంపినట్లు
వార్తలు
వస్తున్నాయి.


