Andhra Pradesh
oi-Dr Veena Srinivas
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
కూటమి
ప్రభుత్వం
అధికారంలోకి
వచ్చిన
నాటి
నుండి
రాజధాని
అమరావతిపై
ఫోకస్
చేస్తుంది.
గత
వైసీపీ
ప్రభుత్వ
హయాంలో
మూడు
రాజధానుల
నిర్ణయంతో
ఏపీ
రాజధాని
ప్రాంతాన్ని
నిర్లక్ష్యం
చేశారు.
రాజధాని
అమరావతిని
అభివృద్ధి
చేయలేదు.
దీంతో
రాజధాని
అమరావతిపై
నీలినీడలు
కమ్ముకున్నాయి.
అక్కడ
అంతకు
ముందు
జోరుగా
జరిగిన
నిర్మాణాలు
నిలిచిపోయాయి.
రియల్
ఎస్టేట్
మార్కెట్
ఒక్కసారిగా
కుప్పకూలింది.
విజయవాడ-గుంటూరులలో
మళ్ళీ
రియల్
బూమ్
ఎంతోమంది
కాంట్రాక్టర్లు,
రియల్టర్లు
తీవ్ర
నష్టాలలో
మునిగిపోయారు.
ఇక
తాజాగా
కూటమి
ప్రభుత్వం
వచ్చిన
నాటి
నుండి
ఆంధ్రప్రదేశ్
రాజధాని
అమరావతిలో
అభివృద్ధి
పనులు
ఊపందుకోవడంతో
మళ్ళీ
విజయవాడ,
గుంటూరు
ప్రాంతాలలో
రియల్
వ్యాపారం
కొత్త
ఊపిరి
పోసుకుంటుంది.
విజయవాడ-గుంటూరు
జాతీయ
రహదారి
ఇప్పుడు
రియల్
ఎస్టేట్
కేంద్రంగా
రూపుదిద్దుకుంటోంది.
2014
తర్వాత
గతంలో
టీడీపీ
పాలించిన
సమయంలో
కనిపించిన
ఉత్సాహం
మళ్లీ
ప్రస్తుతం
స్పష్టంగా
కనిపిస్తోంది.
వారం
రోజుల్లో
20కిపైగా
కొత్త
అపార్ట్మెంట్
ప్రాజెక్టులకు
భూమిపూజ
గత
వారం
రోజుల్లోనే
ఈ
కారిడార్లో
దాదాపు
20కిపైగా
కొత్త
అపార్ట్మెంట్
ప్రాజెక్టులకు
భూమిపూజ
జరగడం
మళ్ళీ
ఈ
ప్రాంతం
అభివృద్ధి
చెందుతుంది
అన్న
భావనకు
ఊపిరి
పోస్తుంది.రాజధాని
నిర్మాణ
పనుల
పునరుద్ధరణ,
మౌలిక
సదుపాయాల
కల్పనపై
ప్రభుత్వం
ప్రత్యేకదృష్టి
సారించడంతో
మళ్ళీ
రాజధాని
అమరావతి
ప్రాంతంపై
ప్రజల
దృష్టి
మళ్ళుతుంది.
సొంతింటి
కలను
నిజం
చేసుకోవాలనుకునే
మధ్యతరగతి
ప్రజలు,
సాఫ్ట్వేర్
ఉద్యోగులు
ఈ
ప్రాంతంవైపు
మొగ్గు
చూపుతున్నారు.
పెరిగిన
నిర్మాణాల
జోరు
ముఖ్యంగా
కాజ,
మంగళగిరి,
పెదకాకాని
పరిసరాల్లో
ఆధునిక
నిర్మాణాల
జోరు
అధికమైంది.
ఇక్కడ
కేవలం
సాధారణ
అపార్ట్మెంట్లే
కాకుండా,
అత్యాధునిక
సౌకర్యాలతో
కూడిన
గేటెడ్
కమ్యూనిటీ
ఫ్లాట్లకు
కూడా
డిమాండ్
విపరీతంగా
పెరిగింది.
హైవేకు
ఇరువైపులా
సర్వీస్
రోడ్ల
విస్తరణతో
పాటు,
మౌలిక
సదుపాయాల
ప్రాజెక్టుల
వేగం
పెరిగింది.
ఇన్వెస్టర్స్
పోటీ
అందుకే
ఏడాది
కాలంగా
స్తబ్దుగా
ఉన్న
మార్కెట్
ఒక్కసారిగా
పుంజుకుని,
కొనుగోలుదారుల
సందడితో
కళకళలాడుతోంది.
నివాస
ప్రాంతాలకే
కాకుండా
కమర్షియల్
స్పేస్కు
కూడా
ఇక్కడ
భారీగా
గిరాకీ
ఏర్పడింది.
మల్టీప్లెక్స్లు,
కార్పొరేట్
హాస్పిటల్స్,
ప్రధాన
బ్రాండెడ్
షోరూమ్లు
ఈ
హైవే
వెంట
పెట్టేందుకు
ఆసక్తి
చూపుతున్నాయి.
భూముల
ధరలు
అధికంగా
ఉన్నప్పటికీ,
భవిష్యత్తులో
ఈ
ప్రాంతం
ఒక
భారీ
మెట్రో
సిటీగా
అవతరిస్తుందన్న
భావనతో
ఇన్వెస్టర్లు
పోటీ
పడి
పెట్టుబడులు
పెడుతున్నారు.


