చంద్రబాబు నిర్ణయంతో కేసీఆర్ సైతం, బిగ్ డెసిషన్..!!

Date:


Telangana

oi-Sai Chaitanya

మాజీ ముఖ్యమంత్రి…బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మొయినా బాద్ ఫామ్ హౌస్ కేసులో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో పట్టుబడి అరెస్ట్ అయిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్- బీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ వ్వవహారం పైన పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. రాజకీయంగా ఈ అంశం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో పైలెట్ రోహిత్ రెడ్డి పైన మాజీ సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ .. బీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి పైన రాజకీయంగా విమర్శలు తీవ్ర స్థాయి లో మొదలయ్యాయి. ఈ క్రమంలో ఎంపీ పుట్టా మహేష్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. ఈ వ్యవహారం తేలే వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తేల్చి చెప్పారు. దీంతో, ఇక ఇప్పుడు బీఆర్ఎస్ సైతం ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ షోకాజు నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్‌ వినియోగం ఆరోపణలపై షోకాజు నోటీసులు పంపింది. ఏడురోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విచారణ పూర్తయ్యేంత వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసులో పేర్కొంది.

గత శనివారం మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరికొందరు డ్రగ్స్ తీసుకుని దొరకడమే కాకుండా పోలీసులపై కాల్పులు జరిగిన ఘటనలో బీఆర్ఎస్ ఈ వివరణ కోరింది. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లోగా మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై స్పష్టంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. షోకాజ్ నోటీసుకు గడువులోపు వివరణ సమర్పించడంలో విఫలమైతే పార్టీ నియమావళి ప్రకారం వేటు వేసేందుకు కూడా వెనుకాడబోమని లేఖలో హెచ్చరికలు పంపారు. ఆ పార్టీలో ఉన్న ఐదుగురికి నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ అని తేలింది. పోలీసులు లోపలికి ప్రవేశించగానే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఆ గన్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డిది కాగా, లైసెన్స్ ఉన్నప్పటికీ మరొకరు కాల్పులు జరపడం తీవ్ర ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related