Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీలో
కూటమి
సర్కార్
ఏడాదిన్నర
పాలన
పూర్తి
చేసుకుంటోంది.
ఈ
నేపథ్యంలో
రాష్ట్రంలో
ఉన్న
అన్ని
కుటుంబాల
వివరాలు
సేకరించి
ఓ
భారీ
డేటాబేస్
ఏర్పాటు
చేసేందుకు
ఏర్పాట్లు
చేస్తోంది.
ఈ
మేరకు
సీఎం
చంద్రబాబు
అధికారులకు
ఆదేశాలు
కూడా
ఇచ్చారు.
ఇందులో
భాగంగా
గ్రామ,
వార్డు
సచివాలయ
ఉద్యోగుల్ని
ఇంటింటికీ
పంపి
వివరాలు
సేకరించాలని
నిర్ణయించారు.
అయితే
దీనిపై
వారు
ట్విస్ట్
ఇచ్చారు.
రాష్ట్రంలో
గ్రామ,
వార్డు
సచివాలయ
ఉద్యోగుల
ద్వారా
చేపట్టనున్న
యూనిఫైడ్
ఫ్యామిలీ
సర్వేలో
ఏర్పడే
సమస్యలపై
ఉద్యోగులు
ఆందోళన
వ్యక్తం
చేస్తున్నారు.
ఈ
మేరకు
ఇవాళ
సీఎస్,
సచివాలయాలశాఖ
డైరెక్టర్,
కార్యదర్శి,
ఇతర
అధికారులకు
వినతిపత్రాలు
అందజేశారు.
ఈ
ఫ్యామిలీ
సర్వే
(UFS)
నిర్వహణలో
గ్రామ/వార్డు
సచివాలయ
ఉద్యోగులు
ఎదుర్కోబోయే
వాస్తవ
సమస్యలను
ప్రభుత్వం
దృష్టికి
తీసుకెళ్లినట్లు
వారు
తెలిపారు.
ప్రజలకు
సరైన
ప్రచారం,
అవగాహన
లేకుండా
సర్వే
ప్రారంభిస్తే
సచివాలయ
ఉద్యోగులపై
తీవ్ర
ఒత్తిడి
పెరుగుతుందని
వారు
ఆందోళన
వ్యక్తం
చేశారు.
అలాగే
సిబ్బంది
కొరత,
అధిక
పని
భారం,
మొబైల్
ఫోన్లు-సిమ్
కార్డులు-బయోమెట్రిక్
పరికరాల
లేమి,
పాత
మొబైల్
ఫోన్లలో
యాప్లు
సరిగా
పనిచేయకపోవడం,
సాంకేతికంగా
సర్వర్
సమస్యలు
వంటి
అంశాలు
సర్వే
నిర్వహణకు
అడ్డంకిగా
మారుతాయని
వారు
తెలిపారు.
సర్వే
కోసం
ఉద్యోగులు
ఇంటింటికీ
వెళ్ళే
క్రమంలో
సచివాలయాలలో
ప్రభుత్వ
సేవలు
కుంటుపడుతాయని,
అలాగేమీడియాలో
ఇప్పటికే
ఇంటింటి
సర్వేలకు
వెళ్లిన
ఉద్యోగుల
గురించి,
ఖాళీ
కుర్చీల
ఫోటోలు
వస్తున్నాయని
వారు
తెలిపారు.
అలాగే
ఏకకాలంలో
ఉద్యోగులు
వారి
మాతృశాఖల
పనులతో
పాటు,బూత్
లెవెల్
ఆఫీసర్
విధులు,
యూనిఫైడ్
ఫ్యామిలీ
సర్వే
నిర్వహణ
అత్యంత
భారంగా
మారడంతో
పాటు
తీవ్రమైన
వత్తిడి
పెంచే
ప్రమాదం
ఉందని,
పని
ఒత్తిడి
లేకుండా
నిర్ధిష్ట
ప్రణాళిక
ప్రకారం
ఈ
సర్వే
నిర్వహించాలని
కోరారు.
సర్వే
నిర్వహణకు
ముందు
ఉద్యోగులకు
పూర్తి
స్థాయి
శిక్షణ,
స్పష్టమైన
ప్రభుత్వ
ఉత్తర్వులు,
అవసరమైన
మౌలిక
సదుపాయాలు
కల్పించాలని
కోరారు.
ఈ
సమస్యలను
పరిష్కరించిన
తర్వాతే
యూనిఫైడ్
ఫ్యామిలీ
సర్వే
ప్రారంభించాలని
ప్రభుత్వాన్ని
కోరారు.


