చంపాలనుకుంటే రండి.. నేను రెడీ!: దువ్వాడ శ్రీనివాస్ హల్చల్ (వీడియో)

Date:


Andhra Pradesh

oi-Jakki Mahesh

శ్రీకాకుళం
జిల్లా
రాజకీయాల్లో
అర్ధరాత్రి
పూట
హైడ్రామా
చోటుచేసుకుంది.
జిల్లాలోని
టెక్కలి
నియోజకవర్గంలో
రాజకీయ
సెగలు
రాజుకున్నాయి.
అర్ధరాత్రి
సమయంలో
నిమ్మాడ
జంక్షన్
వద్ద
వైసీపీ
సీనియర్
నాయకుడు,
మాజీ
ఎమ్మెల్సీ
దువ్వాడ
శ్రీనివాస్
ప్రత్యక్షమై
ప్రత్యర్థులకు
పదునైన
సవాళ్లు
విసిరారు.
దువ్వాడ
శ్రీనివాస్
రాష్ట్ర
మంత్రులకు,
ప్రత్యర్థులకు
బహిరంగ
సవాల్
విసరడం
ఇప్పుడు
జిల్లావ్యాప్తంగా
పెను
సంచలనం
సృష్టిస్తోంది.
రాష్ట్ర
మంత్రి
అచ్చెన్నాయుడు,
మాజీ
మంత్రి
ధర్మాన
కృష్ణదాస్‌లను
ఉద్దేశించి
ఆయన
చేసిన
వ్యాఖ్యలు
రాజకీయ
వర్గాల్లో
కలకలం
రేపుతున్నాయి.


“చంపాలనుకుంటే
రండి..
నేను
రెడీ!”

నిమ్మాడ
జంక్షన్
వేదికగా
దువ్వాడ
శ్రీనివాస్
మాట్లాడుతూ,
తనను
చంపేస్తామంటూ
బెదిరింపులు
వస్తున్నాయని
ఆరోపించారు.
“నన్ను
చంపాలనుకుంటే
నేను
ఇక్కడే
ఉన్నాను,
దమ్ముంటే
రండి.
నేను
హైదరాబాద్
నుంచి
ఇప్పుడే
వచ్చాను,
దేనికైనా
సిద్ధం”
అంటూ
తీవ్రస్థాయిలో
మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో
ఎదుటివారిని
ప్రశ్నిస్తే
చంపేస్తారా?
అని
ఆయన
నిలదీశారు.
రాజకీయాల్లో
ప్రశ్నించే
గొంతుకను
నొక్కేయడం
సరైన
పద్ధతి
కాదని
హితవు
పలికారు.


“కేడీ
బ్రదర్స్
రాజకీయాన్ని
భ్రష్టు
పట్టించారు”

మంత్రి
అచ్చెన్నాయుడు,
ధర్మాన
కృష్ణదాస్‌లను
‘కేడీ
బ్రదర్స్’గా
అభివర్ణించిన
దువ్వాడ,
వారిద్దరూ
కలిసి
జిల్లా
రాజకీయాలను
దిగజార్చారని
విమర్శించారు.
ఒకరు
అధికార
పార్టీలో,
మరొకరు
విపక్షంలో
ఉన్నప్పటికీ
ఇద్దరూ
కలిసి
రాజకీయాన్ని
భ్రష్టు
పట్టించారని
ఆరోపించారు.
అర్ధరాత్రి
సమయంలో
దువ్వాడ
శ్రీనివాస్
ఒక్కసారిగా
రోడ్డుపైకి
వచ్చి
సవాళ్లు
విసరడంతో
నిమ్మాడ
జంక్షన్
ప్రాంతంలో
కాసేపు
ఉద్రిక్తత
నెలకొంది.
తన
ప్రాణాలకు
ముప్పు
ఉందని
చెబుతూనే,
భయపడే
ప్రసక్తే
లేదని
ఆయన
స్పష్టం
చేశారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related