జాగ్రత్త.. ఇకపై ఆ రైళ్లలో టికెట్స్ కాన్సల్ చేస్తే డబ్బులు రిఫండ్ ఉండదు

Date:


India

oi-Chandrasekhar Rao

వందే
భారత్
స్లీపర్,
అమృత్
భారత్
ఎక్స్‌ప్రెస్
రైళ్ల
టికెట్ల
బుకింగ్
లో
కొత్త
మార్పులు
చోటు
చేసుకున్నాయి.
ఇందులో
వసూలు
చేసే
ఛార్జీలు,
టికెటింగ్
నిబంధనలను
రైల్వే
బోర్డు
తాజాగా
వెల్లడించింది.
సుదూర
ప్రయాణాల్లో
అందుబాటులో
ఉండేలా
ధరలు,
పారదర్శకత,
మెరుగైన
ప్రయాణీకుల
అనుభవాన్ని
అందించడమే

మార్పుల
ముఖ్య
ఉద్దేశ్యం.
సంప్రదాయ
ఛార్జీల
విధానాన్ని
కొనసాగిస్తూనే
అదనంగా
మరికొన్ని
ప్రయోజనాలను
చేకూర్చాలని
రైల్వే
లక్ష్యంగా
పెట్టుకుంది.

స్లీపర్
క్లాస్‌కు
ఆర్ఏసీ
బెర్తులు
జారీ
చేయరు..

అమృత్
భారత్
ఎక్స్‌ప్రెస్
సర్వీసులకు
సంబంధించి
స్లీపర్
క్లాస్‌లో
RAC
(రిజర్వేషన్
ఎగైనెస్ట్
క్యాన్సిలేషన్)
టిక్కెట్లు
రద్దయ్యాయి.
ఇందులో
ఆర్ఏసీ
ఉండదు.
సవరించిన
నిబంధనల
ప్రకారం
స్లీపర్
క్లాస్‌కు
ఆర్ఏసీ
బెర్తులు
జారీ
చేయరు.
అడ్వాన్స్
రిజర్వేషన్
పీరియడ్
(ARP)
మొదలైనప్పటి
నుంచే
అందుబాటులో
ఉన్న
అన్ని
బెర్త్‌లు
ప్రయాణీకులకు
కన్ఫర్మ్
అవుతాయి.
మహిళలు,
వికలాంగులు,
సీనియర్
సిటిజన్
కోటాలు
యథావిధిగా
కొనసాగుతాయి
గానీ..
స్లీపర్
క్లాస్‌లో
అదనపు
రిజర్వేషన్
కోటాలు
ఉండవు.

ఎనిమిది
గంటలలోపు
కన్ఫర్మ్డ్
టికెట్లను
రద్దు
చేసుకుంటే..

వందే
భారత్
స్లీపర్,
అమృత్
భారత్
వంటి
ప్రీమియం
రైళ్లు
బయలుదేరాల్సిన
గడువు
సమయానికి
ఎనిమిది
గంటలలోపు
కన్ఫర్మ్డ్
టికెట్లను
రద్దు
చేసుకునే
ప్రయాణికులు
ఇకపై
పూర్తి
ధరను
కోల్పోతారు.
చివరి
నిమిషం
రద్దులను
తగ్గించి,
సీట్ల
వినియోగాన్ని
మెరుగుపరచడమే
దీని
లక్ష్యం.
ఎనిమిది
గంటలకు
ముందుగా
టికెట్లను
రద్దు
చేసుకోవాల్సిన
పరిస్థితి
ఎదురైతే
ప్రస్తుతం
అమలులో
ఉన్న
క్యాన్సెలేషన్
నిబంధనలు
వర్తిస్తాయి.
ఎనిమిది
గంటలు
దాటితే
జీరో
రీఫండ్
ఉంటుంది.

ప్రీమియం
రైళ్లకు
మాత్రమే

నిబంధనలు..

రైల్వే
ప్రయాణీకుల
(టికెట్
రద్దు-
ఛార్జీల
రీఫండ్)
నియమాలు,
2015లో

మేరకు
సవరణలను
చేశారు.
వంద
శాతం
కన్ఫర్మ్డ్
బెర్త్
విధానంతో
నడిచే
ప్రీమియం
రైళ్లకు
మాత్రమే

నిబంధనలు
వర్తిస్తాయి.
వందే
భారత్
స్లీపర్,
అమృత్
భారత్
రైళ్లకు
రద్దు
ఛార్జీలు
గతంలో
కంటే
కఠినం.
రైలు
బయలుదేరడానికి
72
గంటల
ముందు
రద్దు
చేస్తే
25
శాతం
ఛార్జీ,
72
నుండి
8
గంటల
మధ్య
రద్దు
చేసుకుంటే
50
శాతం
ఛార్జీ
విధిస్తారు.
ఎనిమిది
గంటలలోపు
రద్దు
చేస్తే
ఎలాంటి
రీఫండ్
లభించదు.

పాక్షిక
రీఫండ్
సౌకర్యం
వర్తించదు..

గతంలో
నాలుగు
గంటల
ముందు
రద్దు
చేసినా
పాక్షిక
రీఫండ్
పొందే
సౌకర్యం

ప్రీమియం
రైళ్లకు
ఇప్పుడు
వర్తించదు.
ప్రయాణ
ప్రణాళికలలోని
అనిశ్చితి
వల్ల
టికెట్
రద్దు
ఆలస్యం
అయితే
ఆర్థిక
నష్టం
తప్పదు.
సీనియర్
రైల్వే
అధికారుల
ప్రకారం-
కన్ఫర్మ్
అయిన
బెర్త్‌లతో
నడిచే

రైళ్లలో
చివరి
నిమిషం
రద్దుల
వల్ల
అవి
ఖాళీ
అవుతున్నాయి.

అర్ధాంతరంగా
ఇటా
కన్ఫర్మ్డ్
టికెట్లు
రద్దు
కావడం
వల్ల..

అర్ధాంతరంగా
ఇటా
కన్ఫర్మ్డ్
టికెట్లు
రద్దు
కావడం
వల్ల
బెర్తులు
ఖాళీగా
ఉంటోన్నాయని,
రైల్వేలకు
ఆదాయ
నష్టం,
సామర్థ్యం
వృథా
అవుతోందని,
వీటిని
అరికట్టడానికి

నిబంధనలను
ప్రవేశపెట్టాల్సి
వచ్చిందని
అధికారులు
చెబుతున్నారు.

నేపథ్యంలో
టికెట్
బుక్
చేసేటప్పుడు
ప్రయాణీకులు
అప్రమత్తంగా
ఉండక
తప్పదు.
తమ
ప్రణాళికలను
ముందుగానే
ఖరారు
చేసుకొని,
అవసరమైతే
టిక్కెట్లను
చాలా
ముందుగానే
రద్దు
చేసుకోవాలని
రైల్వేలు
సూచిస్తున్నాయి.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Chinese New Year menu | Good Food

Lunar New Year's Day is often regarded as an...

The hope for peace to prevail

On a wintry day in January, when the sun...

Harry Styles on Pope Leo XIV Conclave Election Appearance

5. Pussycat DollAnne was the one who ended up...

Five Anti-ICE Songs You Can Listen to Right Now

ICE killed another American citizen on Saturday, so here’s...