Telangana
oi-Bomma Shivakumar
సైబర్
నేరగాళ్ల
ఆగడాలకు
హద్దూ
అదుపూ
లేకుండా
పోతుంది.
రాష్ట్రంలో
సైబర్
మోసాలు
రోజురోజుకూ
పెరిగిపోతున్నాయి.
సైబర్
ముఠా
రోజుకో
వేషంతో
ప్రజల
సొమ్మును
కాజేస్తున్నారు.
సైబర్
మోసాలపట్ల
ప్రజలు
అప్రమత్తంగా
ఉండాలని
ప్రజలకు
పోలీసులు
అవగాహన
కల్పిస్తున్నప్పటికీ
ఇలాంటి
ఘటనలు
జరుగుతూనే
ఉన్నాయి.
తాజాగా
హైదరాబాద్
లో
ఓ
వైద్యుడు..
సైబర్
నేరగాళ్ల
చేతిలో
మోసపోయాడు.
ఓ
కిలేడీ..
ఆ
వైద్యుడిని
మాయ
చేసి
ఏకంగా
రూ.
14
కోట్లు
కాజేసింది.
స్టాక్
మార్కెట్
లో
పెట్టుబడుల
పేరుతో
ఓ
మహిళ..
ఓ
వైద్యుడిని
బురిడీ
కొట్టింది.
కిలేడీ
మాయమాటలు
నమ్మిన
ఆ
వైద్యుడు
ఏకంగా
తన
సొంత
ఇంటిని
అమ్మి
రూ.
14
కోట్లు
అందజేశాడు.
చివరకు
తాను
మోసపోయానని
తెలుసుకున్న
వైద్యుడు..
పోలీసులను
ఆశ్రయించాడు.
ఈ
ఘటనపై
కేసు
నమోదు
చేసుకున్న
పోలీసులు
పూర్తి
స్థాయిలో
దర్యాప్తు
చేపట్టి
నలుగురిని
అరెస్టు
చేశారు.
ఈ
ఘటన
హైదరాబాద్లో
వెలుగు
చూసింది.
హైదరాబాద్
కు
చెందిన
ఓ
డాక్టర్
ను
అందమైన
అమ్మాయి
ఫోటోలతో
ట్రాప్
లోకి
లాగారు
సైబర్
నేరగాళ్లు.
రంగంలోకి
దిగిన
ఆ
కిలేడీ
వైద్యుడికి
మెసేజ్
లు
పెట్టి
దగ్గరైంది.
తాను
ఒంటరి
మహిళను
అని
స్టాక్
మార్కెట్
కు
సంబంధించిన
కంపెనీలో
వర్కింగ్
అని
మాయమాటలు
చెప్పింది.
స్టాక్
మార్కెట్
లో
పెట్టుబడులు
పెడితే
అధిక
లాభాలు
వస్తాయని
నమ్మించింది.
ఆ
యువతి
మాయమాటలు
నమ్మిన
వైద్యుడు..
అత్యాశకు
పోయాడు.
సొంత
ఇల్లును
అమ్మి
మరీ
రూ.14
కోట్లు
పెట్టుబడి
పెట్టాడు.
ఆ
తర్వాత
తాను
మోసపోయానని
గుర్తించిన
వైద్యుడు
సైబర్
అధికారులకు
ఫిర్యాదు
చేశాడు.
ఈ
వ్యవహారంపై
కేసు
నమోదు
చేసిన
పోలీసులు..
విచారణ
జరిపి
నలుగురిని
అరెస్ట్
చేశారు.
అనంతరం
ఈ
దర్యాప్తు
పై
పోలీసులు
వివరించారు.
సైబర్
నేరగాళ్లు
కాంబోడియా
నుంచి
వైద్యుడిపై
ట్రాప్
చేశారని
తెలిపారు.
కాంబోడియాలోని
చైనా
దేశస్థులు
ఈ
వ్యవహారం
వెనుక
ఉన్నట్లు
తేలిందని
చెప్పారు.
ఈ
కేసులో
భాగంగా
కాంబోడియాలో
ఉన్న
సైబర్
నేరగాళ్లకు
mule
అకౌంట్స్
అందించిన
నలుగురిని
అరెస్టు
చేసినట్లు
తెలిపారు.


