ఢిల్లీకి కొత్త సీఎం? ఎల్జీ లేఖతో మొదలైన పొలిటికల్ హీట్!

Date:


India

oi-Jakki Mahesh

దేశ
రాజధాని
ఢిల్లీలో
కాలుష్యం
ఎంతలా
పెరిగిపోయిందో..
రాజకీయ
సెగలు
కూడా
అంతే
స్థాయిలో
ఎగిసిపడుతున్నాయి.
తాజాగా
ఢిల్లీ
లెఫ్టినెంట్
గవర్నర్
వీకే
సక్సేనా
రాసిన
లేఖకు
ఆమ్
ఆద్మీ
పార్టీ
ఘాటుగా
స్పందించింది.
ఢిల్లీకి
త్వరలోనే
కొత్త
ముఖ్యమంత్రి
రాబోతున్నారని
ఆప్
నేత
సౌరభ్
భరద్వాజ్
చేసిన
వ్యాఖ్యలు
ఇప్పుడు
రాజకీయ
వర్గాల్లో
సంచలనంగా
మారాయి.


ఎల్జీ
లేఖ:
కేజ్రీవాల్‌పై
విమర్శల
వర్షం

మంగళవారం
(డిసెంబర్
23,
2025)
ఎల్జీ
వీకే
సక్సేనా,
ఆప్
అధినేత
అరవింద్
కేజ్రీవాల్‌కు
15
పేజీల
సుదీర్ఘ
లేఖ
రాశారు.
ఢిల్లీని
పీడిస్తున్న
వాయు
కాలుష్యానికి
ఆమ్
ఆద్మీ
పార్టీ
గత
11
ఏళ్ల
నిర్లక్ష్యమే
కారణమని
ఆయన
ఆరోపించారు.
“కాలుష్యం
అనేది
వార్షిక
సంఘటన
అని,
కొన్ని
రోజులు
మీడియా,
కోర్టులు
సందడి
చేసి
మర్చిపోతాయని”
కేజ్రీవాల్
గతంలో
వ్యాఖ్యానించారని
ఎల్జీ
విమర్శించారు.
ప్రస్తుత
బీజేపీ
ప్రభుత్వం
(రేఖా
గుప్తా
నేతృత్వంలో)
గత
తప్పిదాలను
సరిదిద్దుతుంటే,
ఆప్
అడ్డుకుంటోందని
ఆయన
మండిపడ్డారు.


సౌరభ్
భరద్వాజ్
కౌంటర్:
కొత్త
సీఎం
రాబోతున్నారు!

ఎల్జీ
లేఖపై
ఆప్
నేత
సౌరభ్
భరద్వాజ్
బుధవారం
‘ఎక్స్’
వేదికగా
సంచలన
వీడియో
విడుదల
చేశారు.
ఎల్జీ
లేఖను
ఆయన
కొత్త
ముఖ్యమంత్రి
కోసం
చేస్తున్న
‘రీ-లాంచ్’గా
అభివర్ణించారు.
ఢిల్లీలో
ప్రస్తుతం
ఉన్న
రేఖా
గుప్తా
ప్రభుత్వం
విఫలమైందని,
ఆమెను
మార్చేందుకు
అమిత్
షా
నివాసంలో
చర్చలు
జరుగుతున్నాయని
సౌరభ్
భరద్వాజ్
ఆరోపించారు.
పది
నెలలుగా
సైలెంట్‌గా
ఉన్న
ఎల్జీని
కేంద్రం
మళ్లీ
యాక్టివ్
చేసిందని,
కొత్త
సీఎం
వచ్చే
వరకు
ఆయనే
పాలన
సాగిస్తారని
ఎద్దేవా
చేశారు.”వచ్చే
కొద్ది
రోజుల్లోనే
ఢిల్లీకి
కొత్త
ముఖ్యమంత్రి
వస్తారు,
అందుకే
ఎల్జీ
మళ్లీ
లెటర్లు
రాయడం
మొదలుపెట్టారు”
అని
ఆయన
వ్యాఖ్యానించారు.


ఢిల్లీ
రాజకీయాల్లో
మారుతున్న
సమీకరణాలు

గత
పది
నెలల
నుంచి
ఢిల్లీలో
బీజేపీ
ప్రభుత్వం
అధికారంలో
ఉంది.
కాలుష్యం,
రోడ్ల
దుస్థితిపై
ఆప్,
బీజేపీ
మధ్య
నిత్యం
పోరు
జరుగుతోంది.
నిన్నటి
ఎల్జీ
లేఖ,
దానికి
ప్రతిగా
ఆప్
చేస్తున్న
‘కొత్త
సీఎం’
వాదన
ఢిల్లీ
రాజకీయాలను
మరింత
వేడెక్కించాయి.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related