India
oi-Chandrasekhar Rao
నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి.
విజయ్ ఎంట్రీ ఇస్తోండటంతో ..
ఈ పరిణామాల మధ్య అసెంబ్లీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై సర్వేలు వెలుగులోకి వస్తోన్నాయి. వివిధ ప్రీపోల్ సంస్థలు తమ అంచనా వెల్లడిస్తోన్నాయి. ప్రత్యేకించి ఈ ఎన్నికల్లో మాస్ హీరో విజయ్ ఎంట్రీ ఇస్తోండటంతో అంచనాలు మారిపోతున్నాయి. తలకిందులు అవుతున్నాయి. స్టాలిన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందంటూ ఇదివరకే ఒకట్రెండు సర్వేలు సూచించిన నేపథ్యంలో ఆయా నివేదికలన్నీ కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటోన్నాయి.
డీఎంకే వరుసగా రెండోసారి..
తాజాగా సివిక్ పోల్ అనాలసిస్ కమిటీ (సీప్యాక్) తాజాగా తమిళనాడు అసెంబ్లీపై తన అంచనాలను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం చూస్తే మొత్తం 234 మంది సభ్యులు ఉన్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజన కనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమైంది. తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటుంది. 2021లో జరిగిన ఎన్నికల మాదిరిగానే పట్టును నిలుపుకొంటుంది.
డీఎంకే కూటమికి మొత్తంగా 128..
నాటి ఎన్నికల్లో డీఎంకే- కాంగ్రెస్ కూటమి స్వీపింగ్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. డీఎంకే సొంతంగా 133 సీట్లు సాధించింది. మొత్తంగా కూటమి 159 సీట్లు గెలుచుకుని స్టాలిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అప్పట్లో. ఇప్పుడు కూడా అదే స్థాయిలో సీట్లను డీఎంకే కూటమి దక్కించుకుంటుందని సీప్యాక్ అంచనావేసింది. డీఎంకే కూటమికి మొత్తంగా 128 సీట్లు లభిస్తాయని పేర్కొంది.
ఎన్నికల అవసరాల కోసం పొత్తు..
మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో ఏఐఏడీఎంకే ఈ ఎన్నికలతో ఉనికిని కోల్పోయే అవకాశాలు లేకపోలేదు. సీప్యాక్ అంచనాల ప్రకారం అన్నాడీఎంకే- బీజేపీ కూటమి కనీసం డబుల్ డిజిట్లు కూడా దక్కవు. ఎనిమిది సీట్లకే పరిమితం కాబోతోంది. 2021 ఎన్నికల్లో కలిసి పోటీ చేసి, ఆ తర్వాత విడిపోయిన పార్టీలివి. మళ్లీ ఎన్నికల అవసరాల కోసం పొత్తు పెట్టుకోవడాన్ని తమిళనాడు ఓటర్లు స్వాగతించట్లేదు. పైగా భాషాపరమైన వివాదాల కారణంగా తమిళనాడులో బీజేపీకి ఇప్పటికే వ్యతిరేకతను మూటగట్టుకుంది. దాని ప్రభావం అన్నాడీఎంకే పైనా పడొచ్చు.
ఏఐఏడీఎంకే ఓటు బ్యాంక్..
ఏఐఏడీఎంకే ఓట్లన్నింటినీ కూడా విజయ్ తన్నుకుపోయే అవకాశాలు ఉన్నట్లు సీప్యాక్ అభిప్రాయపడింది. ఏకంగా టీవీకే 98 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడంతో పాటు ఏఐఏడీఎంకే ఓటు బ్యాంక్ ను కూడా టీవీకే తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యతిరేక ఓటు అన్నాడీఎంకేకు బదులుగా టీవీకే వైపు మొగ్గు చూపడం ఈ సర్వేలో హైలైట్ గా చెప్పుకోవచ్చు.
డీఎంకే అద్భుతమైన మెజారిటీ..
రీజియన్లవారీగా చూస్తే.. మెజారిటీ ప్రాంతాల్లో టీవీకే హవా వీస్తుంది. చెన్నై, కోయంబత్తూరు రీజియన్లల్లో టీవీకే బలంగా ఉంది. తమిళనాడు కోస్తా, మధ్య- ఉత్తర ప్రాంతంలో డీఎంకే బలీయమైన శక్తిగా అవతరించింది. మధురై రీజియన్ తో పాటు కోస్టల్ బెల్ట్ మొత్తంలో డీఎంకే అనుకూలంగా ఓటు పడే అవకాశం ఉందని, ఆయా చోట్ల డీఎంకే అద్భుతమైన మెజారిటీతో దూసుకుపోతుందని సీప్యాక్ స్పష్టం చేసింది. వీటిల్లో వాస్తవం ఏమిటనేది మే 4వ తేదీన తేలుతుంది.
-
విజయ్-త్రిష పెళ్లి? తమిళనాడు ఎన్నికల వేళ అదిరే ట్విస్ట్!
-
Vijay Karur case:’జననాయగన్’-కరూర్ తొక్కిసలాటకు లింకు,అక్కడే అడ్డంగా దొరికేసిన విజయ్..!?
-
చిరంజీవి మార్గమా? పవన్ వ్యూహమా? విజయ్ ముందున్న అసలు సవాల్ ఇదే!
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు..
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..!
-
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..!
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక…!?
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!


