తిరుమలలో పోటెత్తిన భక్తులు, TTD బిగ్ అలర్ట్ – 3 రోజులు దర్శన టికెట్ల రద్దు..!!

Date:


Andhra Pradesh

oi-Sai Chaitanya

Tirumala:
తిరుమలలో
భక్తులు
పోటెత్తారు.
కొండంతా
భక్తులతో
నిండిపోయింది.
దర్శనం
కోసం
వచ్చిన
వారితో
క్యూ
లైన్లు
నిండి..
శిలాతోరణం
వరకు
భక్తులు
బారులు
తీరారు.
అలిపిరి
వద్ద
వేల
సంఖ్యల
వాహనాలు
క్యూలో
ఉన్నాయి.
వైకుంఠ
ఏకాదశి..
కొత్త
సంవత్సరం
కారణంగా
జనవరి
తొలి
వారం
వరకు
రద్దీ
ఇలాగే
కొనసాగే
అవకాశం
ఉందని
అంచనా
వేస్తున్నారు.
పెరుగుతున్న
భక్తుల
వేళ
టీటీడీ
పలు
నిర్ణయాలు
తీసుకుంది.
భక్తులకు
కీలక
సూచనలు
చేసింది.

వరుస
సెలవుల
నేపథ్యంలో
తిరుమలకు
భక్తులు
పోటెత్తారు.
శ్రీవారి
దర్శనానికి
సుమారు
30
గంటలు
పడుతుంది.
తిరుమలలో
అనూహ్యంగా
భక్తుల
రద్దీ
పెరగడంతో
టీటీడీ
కీలక
నిర్ణయం
తీసుకుంది.
సామాన్య
భక్తులకు
పెద్ద
పీట
వేసింది.
ఇందులో
భాగంగా
శ్రీ‌వాణి
ఆఫ్
లైన్
టికెట్ల‌
జారీ
ర‌ద్దు
చేసింది.
మూడు
రోజుల
పాటు
టికెట్ల
జారీని
క్యాన్సిల్
చేసింది.
తిరుమ‌ల‌లో
అనూహ్య
ర‌ద్దీ
నేపధ్యంలో

నెల
27,
28,
29వ‌
తేదీల‌కు
(శ‌ని,
ఆది,
సోమ‌వారం)
సంబంధించి
శ్రీ‌వాణి
ఆఫ్
లైన్
టికెట్ల
జారీని
ర‌ద్దు
చేసినట్లు
తిరుమల
తిరుపతి
దేవస్థానం
తెలిపింది.
తిరుమ‌ల
శ్రీవాణి
దర్శన
టికెట్ల
కౌంటర్
లో,
తిరుపతిలోని
రేణిగుంట
ఎయిర్
పోర్టులో
శ్రీ‌వాణి
ద‌ర్శ‌న
టికెట్ల
కౌంట‌ర్లలో
ఆఫ్
లైన్
టికెట్లు
జారీ
చేయ‌బ‌డ‌వని
స్పష్టం
చేసింది.
శ్రీవాణి
టికెట్ల
రద్దును
గుర్తించి
భక్తులు
తమ
దర్శన
ప్రణాళికలు
రూపొందించుకోవాలని
టీటీడీ
కోరింది.

అటు
తిరుమల
అలిపిరి
భూదేవి
కాంప్లెక్స్
వద్ద
దివ్య
దర్శనం
టోకెన్లకు
భక్తులు
పోటెత్తారు.
సర్వ
దర్శనం
టోకెన్లు
పూర్తి
కావడంతో
నడకదారి
భక్తుల
దివ్య
దర్శనం
టోకెన్లకు
భారీగా
ఎగబడ్డారు.
దాంతో
టీటీడీ
సెక్యూరిటీ,
పోలీసు
సిబ్బంది
అలర్ట్
అయ్యారు.
క్యూలైన్లలో
తోపులాటలు
జరగకుండా
పరిస్థితిని
అదుపు
చేశారు.
వైకుంఠం
క్యూ
కాంప్లెక్స్
లోని
అన్ని
కంపార్ట్
మెంట్లు
నిండిపోయి
క్యూలైన్లు
వెలుపలకు
వచ్చాయి.
శిలాతోరణం
వరకు
కూడా
సర్వ
దర్శనం
క్యూలైన్లు
ఉన్నాయి.
దీంతో
స్వామి
వారి
దర్శనానికి
30
గంటల
సమయం
పడుతోంది.
నారాయనగిరి
ఉద్యానవనంలోని
షెడ్లు
కూడా
నిండిపోయాయి.
నారాయణగిరి
దాటి
శిలాతోరణం
వరకు
క్యూ
లైన్
ఉంది.
ఇక్కడి
నుంచి
ఆక్టోపస్
భనవం
వరకు
దాదాపు
3
కిలోమీటర్ల
మేర
క్యూలైన్
ఉంది.
దీంతో,
భక్తుల
రద్దీకి
అనుగుణంగా
టీటీడీ
నిర్ణయాలు
తీసుకుంటోంది.

నెల
30వ
తేదీ
నుంచి
పది
రోజుల
పాటు
తిరుమలలో
వైకుంఠ
ఏకాదశి
వేళ
ఉత్తర
ద్వార
దర్శనం
ప్రారంభం
కానుంది.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related