Andhra Pradesh
oi-Korivi Jayakumar
తిరుమల
శ్రీవారి
లడ్డు
ప్రసాదం
నెయ్యి
కల్తీ
ఆరోపణలకు
సంబంధించి
సిట్
(SIT)
దాఖలు
చేసిన
చార్జిషీట్లోని
సంచలన
నిజాలు
వెలుగులోకి
వచ్చాయి.
నెయ్యిలో
జంతువుల
కొవ్వు
ఏమాత్రం
లేదని
సీబీఐ
స్పష్టంగా
తేల్చింది.
గత
కొంతకాలంగా
దేశవ్యాప్తంగా
తీవ్ర
చర్చకు
దారి
తీసిన
ఈ
వ్యవహారంపై
తాజా
నివేదికతో
పూర్తిస్థాయి
స్పష్టత
వచ్చింది.
దీంతో
ఈ
వ్యవహారం
తెలుగు
రాష్ట్రాల్లో
హాట్
టాపిక్
గా
మారింది.
నెయ్యి
నాణ్యతపై
వచ్చిన
ఆరోపణలతో
విచారణ..
కాగా
టీటీడీకి
సరఫరా
చేసిన
నెయ్యి
నాణ్యతపై
అనుమానాలు
వ్యక్తమవడంతో..
ఈ
అంశం
రాజకీయంగా,
సామాజికంగా
తీవ్ర
దుమారం
రేపింది.
భక్తుల
మనోభావాలు
దెబ్బతినే
అవకాశం
ఉండటంతో,
ప్రభుత్వం
ఈ
వ్యవహారాన్ని
సీరియస్గా
తీసుకుని
సీబీఐకి
అప్పగించింది.
సీబీఐ
లోతైన
స్థాయిలో
దర్యాప్తు
చేపట్టి
నిజానిజాలను
వెలికి
తీసే
ప్రయత్నం
చేసింది.
విచారణలో
భాగంగా
సీబీఐ
గుజరాత్లోని
నేషనల్
డెయిరీ
డెవలప్మెంట్
బోర్డు
(NDDB)ను
ఆశ్రయించింది.
2025
జనవరి
8న
NDDBకి
అధికారిక
లేఖ
రాసి,
లడ్డూ
తయారీలో
ఉపయోగించిన
నెయ్యి
నమూనాలను
తిరిగి
పరీక్షించాలని
కోరింది.
అంతర్జాతీయ
ప్రమాణాలకు
అనుగుణంగా
ఈ
పరీక్షలు
నిర్వహించాలని
సూచించింది.
సీబీఐ
అభ్యర్థన
మేరకు
NDDB
ఆధునిక
ల్యాబ్లలో
నెయ్యి
నమూనాలపై
విస్తృత
పరీక్షలు
నిర్వహించింది.
అనంతరం
2025
మార్చి
27న
సీబీఐకి
నివేదిక
సమర్పించింది.
ఆ
నివేదికలో
నెయ్యి
పూర్తిగా
స్వచ్ఛమైనదని,
జంతు
కొవ్వు
లేదా
ఇతర
కల్తీ
పదార్థాల
ఆనవాళ్లు
లేవని
స్పష్టంగా
పేర్కొంది.
ఈ
నివేదికతో
తిరుమల
శ్రీవారి
లడ్డూ
నెయ్యిపై
వచ్చిన
కల్తీ
ఆరోపణలకు
పూర్తిగా
తెరపడింది.
భక్తుల్లో
నెలకొన్న
అనుమానాలు,
ఆందోళనలు
నివృత్తి
అయ్యాయని
అధికారులు
తెలిపారు.
శ్రీవారి
ప్రసాదం
నాణ్యత
విషయంలో
ఎలాంటి
రాజీ
లేదని,
భవిష్యత్తులోనూ
మరింత
కఠిన
ప్రమాణాలు
పాటిస్తామని
టీటీడీ
వర్గాలు
స్పష్టం
చేశాయి.
సీబీఐ
నివేదికతో
తిరుమల
దేవస్థానం
ప్రతిష్టకు
భంగం
లేదని
స్పష్టమైంది.
లడ్డూ
ప్రసాదం
స్వచ్ఛతపై
భక్తులు
ఎలాంటి
సందేహాలు
పెట్టుకోవాల్సిన
అవసరం
లేదని
అధికారులు
పేర్కొన్నారు.
ఈ
అంశంపై
తప్పుడు
ప్రచారాలకు
కూడా
ఇకపై
చెక్
పడినట్టేనని
భావిస్తున్నారు.


