Telangana
oi-Chandrasekhar Rao
తిరుమలలో
వైకుంఠ
ఏకాదశి
ఏర్పాట్లు
చురుగ్గా
సాగుతున్నాయి.
ఈ
నెల
30వ
తేదీన
వైకుంఠ
ఏకాదశిని
పురస్కరించుకుని
ప్రారంభం
అయ్యే
వైకుంఠ
ద్వార
దర్శనాలు
జనవరి
8వ
తేదీ
వరకు
కొనసాగనున్నాయి.
ఈ
సందర్భంగా
లక్షలాదిమంది
భక్తులు
శ్రీవారిని
దర్శించుకునే
అవకాశం
ఉందని
టీటీడీ
అంచనా
వేస్తోంది.
దీనికి
అనుగుణంగా
చర్యలు
చేపట్టింది.
ఇప్పటికే
తొలి
మూడు
రోజుల
కోసం
మొత్తం
1,76,000
మంది
భక్తులను
ఎలక్ట్రానిక్
డిప్
ద్వారా
ఎంపిక
చేశారు.
ఈ
పరిస్థితుల
మధ్య
తిరుమల
కాలినడక
శుభ్రతపై
వివాదం
తలెత్తింది.
పెద్దపల్లి
లోక్
సభ
సభ్యుడు
గడ్డం
వంశీ
స్వయానా
అసంతృప్తి
వ్యక్తం
చేశారు.
కాకా
(ఆయన
తండ్రి
జీ
వెంకటస్వామి)
వర్ధంతిని
పురస్కరించుకొని,
కుటుంబంతో
కలిసి
తిరుమల
శ్రీ
వేంకటేశ్వరస్వామి
దర్శనార్థం
కాలినడకన
తిరుమలకు
వెళ్లానని,
మార్గమధ్యలో
నెలకొన్న
పరిస్థితులు
తనను
తీవ్ర
ఆందోళన
కలిగించాయని
అన్నారు.
దీనిపై
తన
అధికారిక
ఎక్స్
అకౌంట్
లో
ఓ
వీడియో
పోస్ట్
చేశారు.
నడక
మార్గం
ప్రమాదకరమైన
స్థాయికి
దిగజారిందని
జీ
వంశీ
ఆవేదన
వ్యక్తం
చేశారు.
మంత్రి
నారా
లోకేష్కు
ఆయన
ఒక
సవాల్
విసిరారు.
ఒక్కసారైనా
ఏడుకొండల
నడక
మార్గంలో
కాలినడకన
వెళ్లి,
ఈ
దుస్థితిని
స్వయంగా
గమనించాలని
అని
కోరారు.
నడక
మార్గంలో
ప్లాస్టిక్
వ్యర్ధాలు,
నిర్మాణ
శిథిలాలు
విపరీతంగా
చెల్లాచెదురుగా
పడి
ఉన్నాయని
వివరించారు.
మరుగుదొడ్ల
కమోడ్లు,
మెట్ల
మధ్య
బిగించిన
స్టీల్
ట్రేలు
నడకను
ప్రమాదకరంగా
మార్చాయని
తెలిపారు.
On
the
occasion
of
Kaka’s
death
anniversary,
I
visited
Tirupati
along
with
my
family
to
seek
the
blessings
of
Lord
Venkateswara
of
the
Seven
Hills.
While
climbing
the
hills
with
devotion,
the
conditions
we
witnessed
were
deeply
distressing.I
am
throwing
an
open
challenge
to…
pic.twitter.com/bxn4uKPGji—
Vamsi
Gaddam
(@vkgaddam)
December
23,
2025
అవి
భక్తులకు
కాలి
గాయాల
ప్రమాదాన్ని
పెంచుతున్నాయని
వంశీ
హెచ్చరించారు.
అందుబాటులో
కనీసం
ప్రథమ
చికిత్సా
కేంద్రాలు
కూడా
అందుబాటులో
లేవని
ఆయన
ఎత్తిచూపారు.
భక్తులు
వేగంగా
దూసుకుపోతున్న
బస్సులు,
కార్ల
మధ్య
ప్రాణాలను
పణంగా
పెట్టి
రోడ్డు
దాటాల్సి
వస్తుందని
ఆందోళన
వ్యక్తం
చేశారు.
భక్తుల
భద్రతను
పూర్తిగా
నిర్లక్ష్యం
చేశారా
అని
ప్రశ్నించారు.
ఈ
పరిస్థితిపై
నారా
లోకేష్
తక్షణమే
స్పందించాలని
డిమాండ్
చేశారు.
అవసరమైతే,
ఈ
విషయాన్ని
ప్రధాని
నరేంద్ర
మోదీ
దృష్టికి
తీసుకెళ్లి,
తిరుమల
నడక
మార్గంలో
మెరుగైన
సౌకర్యాలను
తక్షణమే
కల్పించాలని
విజ్ఞప్తి
చేశారు.


