Telangana
oi-Dr Veena Srinivas
ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ
రాష్ట్రాలలో
సోషల్
మీడియాలో
ఇన్ఫ్లుయెన్స్
చేస్తున్నవారు
ఇటీవల
కాలంలో
మతపరమైన
వ్యాఖ్యలు
చేయడం
ప్రధానంగా
కనిపిస్తుంది.
ఇప్పటికే
శివాజీ
చేసిన
వ్యాఖ్యల
పైన
అన్వేష్
హిందూ
దేవుళ్లను,
మహిళలను
టార్గెట్
చేస్తూ
విమర్శలు
చేయగా,
తాజాగా
సినీ
నటి
మాధవి
లత
షిరిడి
సాయిబాబా
పైన
తీవ్ర
వ్యాఖ్యలు
చేశారు.
సాయిబాబాపై
భక్తుల
మనోభావాలను
దెబ్బ
తీసేలా
మాధవీలత
వ్యాఖ్యలు
సాయిబాబా
దేవుడు
కాదంటూ
ఆమె
సోషల్
మీడియా
వేదికగా
చేసిన
పోస్టులు
భక్తుల
మనోభావాలను
దెబ్బతీశాయని
ఆరోపిస్తూ
కొందరు
హైదరాబాద్
సరూర్
నగర్
పోలీస్
స్టేషన్లో
ఫిర్యాదు
చేశారు.
దీంతో
మాధవి
లత
పై
కేసు
నమోదు
చేశారు
పోలీసులు.
సామాజిక,
రాజకీయ
అంశాల
పైన
తరచూ
స్పందించే
మాధవి
లత
సాయిబాబాను
ఆరాధించే
లక్షలాది
మంది
భక్తుల
మనోభావాలను
దెబ్బతీసేలా
మాట్లాడారు.
మాధవీలతపై
పోలీస్
స్టేషన్
లో
ఫిర్యాదు
మాధవీ
లతపైన
చట్టపరమైన
చర్యలు
తీసుకోవాలని
డిమాండ్
చేస్తూ
సాయిబాబా
భక్తులు
ఫిర్యాదు
చేశారు.
దీంతో
కేసు
నమోదు
చేసిన
పోలీసులు
దీనికి
సంబంధించి
డిజిటల్
ఆధారాలను
పోలీసులు
సేకరిస్తున్నారు
మాధవి
లత
కు
మాత్రమే
కాకుండా
ఆమె
వ్యాఖ్యలకు
మద్దతుగా
ఇంటర్వ్యూలు
నిర్వహించి
వాటిని
వైరల్
చేసిన
కొన్ని
యూట్యూబ్
చానల్స్
కు
సోషల్
మీడియాకు
కూడా
పోలీసులు
కేసులు
నమోదు
చేసి
షాక్
ఇచ్చారు
ఈ
వ్యవహారంలో
వారంతా
రేపు
పోలీసుల
ముందు
విచారణకు
హాజరు
కావాలని
పేర్కొన్నారు.
మతపరమైన
వ్యాఖ్యలు
చేసేవారికి
పోలీసుల
హెచ్చరిక
భారతదేశంలో
మతపరమైన
విశ్వాసాలు
అత్యంత
సున్నితమైన
అంశాలని
గుర్తు
చేసిన
అధికారులు
భావ
ప్రకటన
స్వేచ్ఛ
పేరుతో
ఇతరుల
నమ్మకాలను
అవమానించడం
చట్టప్రకారం
నేరమంటూ
పేర్కొంటున్నారు.
సున్నితమైన
మత
పరమైన
వ్యాఖ్యలు
చేయకుండా
ఉంటేనే
మంచిదని
హెచ్చరిస్తున్నారు.
ఇక
సోషల్
మీడియాలో
అభ్యంతరకరమైన
పోస్టులు
చేసే
వారి
పైన
ఐటీ
చట్టాల
కింద
కేసులు
నమోదు
చేస్తామన్నారు.
మాధవీలత
పోలీసులకు
ఏం
వివరణ
ఇస్తారో?
ఈ
కేసులో
మాధవి
లత
పోలీసులకు
ఎటువంటి
వివరణ
ఇస్తారు
అనేది
ప్రస్తుతం
ఆసక్తికరంగా
మారింది.
భారతదేశంలో
మతపరమైన
విశ్వాసాలు
అత్యంత
సున్నితమైన
అంశాలని
అధికారులు
గుర్తు
చేస్తున్నారు.
భావప్రకటన
స్వేచ్ఛ
పేరుతో
ఇతరుల
నమ్మకాలను
అవమానించడం
చట్టరీత్యా
నేరమని
స్పష్టం
చేశారు.
ముఖ్యంగా
ప్రముఖులు
తమ
వ్యాఖ్యల
విషయంలో
మరింత
బాధ్యతగా
వ్యవహరించాల్సిన
అవసరం
ఉందని
హెచ్చరిస్తున్నారు.
సోషల్
మీడియాలో
అభ్యంతరకర
పోస్టులు
చేస్తే
చర్యలు
పోలీసులు
ఇప్పటికే
ఎఫ్ఐఆర్
నమోదు
చేసి
డిజిటల్
ఆధారాలను
సేకరిస్తున్నారు.
సోషల్
మీడియాలో
అభ్యంతరకర
పోస్టులు
చేసిన
వారిపై
ఐటీ
చట్టాల
కింద
కూడా
చర్యలు
తీసుకుంటామని
తెలిపారు.
ఈ
కేసులో
మాధవీలత
ఇచ్చే
వివరణపై
ఇప్పుడు
అందరి
దృష్టి
నెలకొంది.


