నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టులో రేపు విచారణ.. సీఎం రేవంత్ ప్లాన్ అదేనా.. !

Date:


Telangana

oi-Bomma Shivakumar

గోదావరిపై
ఏపీ
తలపెట్టిన
పోలవరం
నల్లమల
సాగర్
ప్రాజెక్టును
అడ్డుకునేందుకు
తెలంగాణ
ప్రభుత్వం
సీనియర్
న్యాయ
నిపుణులతో
చర్చలు
జరిపింది.

ప్రాజెక్టుకు
వ్యతిరేకంగా
రాష్ట్ర
ప్రభుత్వం
ఇటీవలే
సుప్రీంకోర్టును
ఆశ్రయించింది.
ప్రభుత్వం
వేసిన
రిట్
పిటిషన్
సోమవారం
(జనవరి
5)
సుప్రీంకోర్టు
లో
విచారణకు
రానుంది.


నేపథ్యంలో
ముఖ్యమంత్రి
రేవంత్
రెడ్డి,
నీటి
పారుదల
శాఖ
మంత్రి
ఉత్తమ్​
కుమార్​
రెడ్డి
ఆదివారం
ముంబైలో
సుప్రీంకోర్టు
సీనియర్
న్యాయవాది
అభిషేక్
సింఘ్వి
తో
ప్రత్యేకంగా
సమావేశమయ్యారు.
ప్రభుత్వం
తరఫున
సమర్థమైన
వాదనలు
వినిపించాలని
న్యాయ
నిపుణులకు
సూచించారు.
అవసరమైన
అన్ని
ఆధారాలను
సిద్ధంగా
ఉంచుకోవాలని
ఇరిగేషన్
అధికారులను
అప్రమత్తం
చేశారు.

అనుమతులు
లేకుండా
పోలవరం
నుంచి
బనకచర్ల
లేదా
నల్లమలసాగర్
కు
లింక్
చేసేందుకు
ఏపీ
ప్రభుత్వం
చేపడుతున్న
విస్తరణ
పనులను
నిలిపివేయాలని
కోరుతూ
ఇటీవలే
తెలంగాణ
ప్రభుత్వం
సుప్రీంకోర్టులో
రిట్
పిటిషన్
దాఖలు
చేసింది.
తక్షణమే
పోలవరం
ప్రాజెక్టు
అథారిటీ

పనులు
ఆపేలా
సుప్రీంకోర్టు
ఆదేశించాలని
పలు
అంశాలను
ప్రస్తావించింది.

మొదట్లో
ఆమోదించిన
మేరకు
పోలవరం
ప్రాజెక్టు
పనుల
స్వరూపం
ఉండాలని,
విస్తరణ
పనులు
చేపట్టడం
చట్టబద్ధం
కావని

పిటిషన్
లో
స్పష్టం
చేసింది.
తెలంగాణ
అభ్యంతరాలను
పరిగణనలోకి
తీసుకోకుండా
నల్లమలసాగర్
ప్రాజెక్టు
ప్రీ
ఫిజిబులిటీ
రిపోర్టులను
కేంద్ర
ప్రభుత్వం
పరిశీలించటం
సమంజసం
కాదని
అభ్యంతరం
తెలిపింది.
అందుకు
సంబంధించి
కేంద్ర
జల
సంఘం,
కేంద్ర
జల
మంత్రిత్వ
శాఖ,
గోదావరి
నీటి
యాజమాన్య
బోర్డులకు
స్పష్టమైన
ఆదేశాలివ్వాలని
కోరింది.

కేంద్ర
జల
సంఘం
మార్గదర్శకాలకు
విరుద్ధంగా
ఏపీ
ప్రభుత్వం
డీపీఆర్
తయారీకి
సిద్ధపడుతోందని,
వెంటనే

చర్యలను
ఆపాలని
కోరింది.
ఏపీ
తలపెడుతున్న

విస్తరణ
ప్రాజెక్టులకు
పర్యావరణ
అనుమతులు
ఇవ్వకుండా,
కేంద్రం
నుంచి
ఎలాంటి
ఆర్థిక
సాయం
అందించకుండా
తగిన
ఆదేశాలు
ఇవ్వాలని
పిటిషన్
లో
ప్రస్తావించింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related