Telangana
oi-Bomma Shivakumar
నాంపల్లిలోని
ఫర్నిచర్
దుకాణంలో
సంభవించిన
అగ్నిప్రమాదం
నేపథ్యంలో
హైదరాబాద్
పోలీస్
కమిషనర్
సజ్జనార్
ప్రజలకు
ముఖ్య
సూచనలు
చేశారు.
నగర
ప్రజలు
నుమాయిష్
పర్యటనను
ఈ
రోజుకు
వాయిదా
వేసుకోవాలని
ఆయన
విజ్ఞప్తి
చేశారు.
ఫర్నిచర్
దుకాణంలో
భారీ
అగ్నిప్రమాదం
సంభవించిన
కారణంగా
ట్రాఫిక్
రద్దీని
దృష్టిలో
ఉంచుకుని
ప్రజలు
సహకరించాలని
కోరారు.
ఫర్నీచర్
షాపులో
అగ్నిప్రమాదం
నాంపల్లిలోని
ఓ
ఫర్నీచర్
షాపులో
అగ్నిప్రమాదం
సంభవించింది.
ఈ
నేపథ్యంలో
హైదరాబాద్
పోలీస్
కమిషనర్
సీపీ
సజ్జనార్
కీలక
ప్రకటన
చేశారు.
నగర
ప్రజలు
నుమాయిష్
పర్యటనను
ఈ
రోజుకు
వాయిదా
వేసుకోవాలని
ఆయన
విజ్ఞప్తి
చేశారు.
ఫర్నీచర్
షాపులో
భారీ
అగ్నిప్రమాదం
సంభవించిన
కారణంగా
ట్రాఫిక్
రద్దీని
దృష్టిలో
ఉంచుకుని
ప్రజలు
సహకరించాలని
కోరారు.
మరోవైపు
దట్టమైన
పొగలు
అలుముకోవడంతో
భవనంలోకి
రెస్క్యూ
టీం
వెళ్లలేకపోతోందని
సజ్జనార్
పేర్కొన్నారు.
వాహనాల
దారి
మళ్లింపు
అలాగే
అగ్నిప్రమాదం
కారణంగా
పరిసర
ప్రాంతాల్లోని
వాహనాలను
దారి
మళ్లిస్తున్నట్లు
సజ్జనార్
తెలిపారు.
అగ్ని
ప్రమాదం
జరిగినట్లు
సమాచారం
అందిన
వెంటనే
అగ్నిమాపక
సిబ్బంది,
డీ
ఆర్
ఎఫ్
బృందాలు,
పోలీసులు
వెంటనే
సంఘటన
స్థలానికి
చేరుకున్నారని
సజ్జనార్
వివరించారు.
ఫర్నీచర్
దుకాణంలో
మంటలు
పూర్తిగా
అదుపులోకి
వచ్చాయని..
అయితే
దట్టమైన
పొగలు
వ్యాపించి
ఉండటంతో
రెస్క్యూ
టీమ్
భవనంలోకి
వెళ్లలేక
పోతోందన్నారు.
ఇక
నాంపల్లిలోని
బచ్చా
క్రిస్టల్
ఫర్నిచర్
దుకాణంలో
మధ్యాహ్న
సమయంలో
ఒక్కసారిగా
మంటలు
చెలరేగాయి.
మంటలు
ఒక్కసారిగా
నాలుగంతస్థులు
ఉన్న
ఈ
భవనంలోని
అన్ని
ఫ్లోర్లకు
వ్యాప్తి
చెందాయి.
వెంటనే
సమాచారం
అందుకున్న
పోలీసులు
హైడ్రా,
విపత్తు
నిర్వహణ
బృందం
ఘటనాస్థలికి
చేరుకుని
సహాయక
చర్యలు
చేపట్టింది.
ఈ
మేరకు
అగ్ని
మాపక
సిబ్బంది
4
ఫైర్
ఇంజిన్
వాహనాలు,
స్కైలిఫ్ట్
క్రేన్
సహాయంతో
మంటలు
ఆర్పుతున్నారు.
ప్రస్తుతం
సహాయక
చర్యలు
ముమ్మరంగా
కొనసాగుతున్నాయి.


