India
oi-Chandrasekhar Rao
జమ్మూకశ్మీర్లోని
ఉధంపూర్
జిల్లాలో
భారీ
ఎన్
కౌంటర్
చోటు
చేసుకుంది.
ఈ
ఎదురు
కాల్పుల్లో
కరడుగట్టిన
ఉగ్రవాద
సంస్థ
జైషే
మహమ్మద్
కు
చెందిన
ఇద్దరు
టెర్రరిస్టులను
భద్రతా
దళాలు
హతమార్చాయి.
జిల్లాలోని
రామ్నగర్
సమీపంలో
గల
జాఫర్
అటవీ
ప్రాంతంలోని
మజల్తా
వద్ద
పోలీసులు,
సైన్యం
సంయుక్తంగా
నిర్వహించిన
గాలింపు
ఆపరేషన్
సందర్భంగా
ఈ
కాల్పులు
చోటుచేసుకున్నాయి.
కొన్ని
గంటల
పాటు
ఈ
ఎన్
కౌంటర్
కొనసాగింది.
ఈ
కాల్పులు
హతమైన
ఇద్దరు
ఉగ్రవాదులను
కూడా
ఆర్మీ
అధికారులు
గుర్తించారు.
వారి
వివరాలను
వెల్లడించారు.
హతమైన
వారిలో
ఒకరు
పాకిస్తాన్
జాతీయుడు.
మరొకరు
జైషె
మహ్మద్
కు
చెందిన
లోకల్
ఆపరేటర్.
ఇద్దరు
లేదా
ముగ్గురు
జైషె
మహ్మద్
ఉగ్రవాదులు
మాటు
వేసినట్లు
పక్కా
సమాచారం
అందడంతో
జవాన్లు,
స్థానిక
పోలీసులు
మంగళవారం
సాయంత్రం
జాఫర్
అటవీ
ప్రాంతంలో
కూంబింగ్
చేపట్టారు.
ఈ
సందర్భంగా
వారికి
ఉగ్రవాదులు
ఎదురుపడటంతో
ఎన్కౌంటర్
మొదలైంది.
ఈ
ఘటనలో
ఇద్దరు
ఉగ్రవాదులు
మరణించారు.
చాలా
కాలంగా
ఈ
ప్రాంతంలో
క్రియాశీలకంగా
ఉన్న
జేఈఎం
టాప్
కమాండర్
రుబానీ
అలియాస్
అబూ
మావియా
కూడా
ఉన్నాడని
అధికారులు
తెలిపారు.
జాఫర్
అటవీ
ప్రాంతంలో
20
గంటలకు
పైగా
ఈ
ఆపరేషన్
సాగింది.
జమ్మూ
కాశ్మీర్
పోలీసులు,
ఇండియన్
ఆర్మీలోని
వైట్
నైట్
కోర్ప్స్
కౌంటర్
ఇంటెలిజెన్స్
ఫోర్స్
డెల్టా,
సీఆర్పీఎఫ్
బలగాలు
ఇందులో
పాల్గొన్నాయి.
తొలుత
కాల్పుల్లో
ఓ
ఉగ్రవాది
గాయపడగా
అతను
ఓ
గుహలో
దాక్కున్నాడు.
అతనికి
సహాయాన్ని
అందించడానికి
లోకల్
టెర్రర్
ఆపరేటర్
సంఘటన
స్థలానికి
వెళ్లాడు.
దీని
ఆధారంగా
జవాన్లు
ఆ
ఉగ్రవాది
ఆచూకీని
గుర్తించారు.
పారాట్రూపర్లు,
డాగ్
స్క్వాడ్లతో
సహా
బలగాలను
వెంటనే
తరలించి
భద్రతా
వలయాన్ని
పటిష్టం
చేశారు.
గుహ
ప్రవేశ
ద్వారం
వద్ద
రాకెట్
ప్రొపెల్డ్
గ్రెనేడ్లను
ప్రయోగించి
ఇద్దరు
ఉగ్రవాదులను
హతమార్చాయి.
ఉగ్రవాదులను
గుర్తించడానికి
కెమెరాల
స్నిఫర్
డాగ్స్,
డ్రోన్లను
తుది
దాడికి
ముందు
వాడారు.
ఒక
మృతదేహం
గుహ
వద్ద,
మరొకటి
లోపల
దొరికాయి.
సంఘటన
స్థలం
నుంచి
పెద్ద
ఎత్తున
మారణాయుధాలను
స్వాధీనం
చేసుకున్నారు.
వీటిలో
ఎం4
కార్బైన్,
ఏసీ
అస్సాల్ట్
రైఫిల్తో
సహా
పెద్ద
మొత్తంలో
మందుగుండు
సామగ్రిని
స్వాధీనం
చేసుకున్నట్లు
అధికారులు
తెలిపారు.


