India
oi-Chandrasekhar Rao
దేశంలో
అతిపెద్ద
పౌర
విమానయాన
సంస్థ
ఇండిగో
ఫ్లైట్లు
నేడు
కూడా
రద్దయ్యాయి.
20
ఏళ్ల
చరిత్రలో
ఎన్నడూ
లేని
విధంగా
ఒకే
రోజు
550కి
పైగా
విమానాలను
రద్దు
చేసింది.
దీనివల్ల
దేశవ్యాప్తంగా
విమానాశ్రయాల్లో
తీవ్ర
గందరగోళం
నెలకొంది.
ఈ
అంతరాయం
వేలాది
మంది
ప్రయాణికులను
గంటల
తరబడి
ఎయిర్
పోర్టుల్లో
పడిగాపులు
పడేలా
చేసింది.
అక్కడే
చిక్కుకుపోయేలా
చేసింది.
ఇండిగో
విమాన
ప్రయాణికులు
నరకం
చవి
చూస్తోన్నారు.
ఈ
పరిణామాలతో
రైళ్లకు
ప్రయాణికుల
రద్దీ
గణనీయంగా
పెరిగింది.
ఈ
నేపథ్యంలో
దేశవ్యాప్తంగా
ప్రయాణ
సౌకర్యాలను
మెరుగుపరచడానికి
రైల్వే
జోన్లు
విస్తృత
చర్యలు
తీసుకున్నాయి.
మొత్తం
37
రైళ్లకు
116
అదనపు
కోచ్లను
జోడించాయి.
114
అదనపు
ట్రిప్పులను
అందుబాటులోకి
తీసుకొచ్చాయి.
-
దక్షిణ
మధ్య
రైల్వే
పరిధిలో
రెండు
ప్రత్యేక
రైళ్లు
అందుబాటులోకి
వచ్చాయి.
హైదరాబాద్-
లోకమాన్య
తిలక్
టెర్మినస్
ముంబై,
చెన్నై
ఎగ్మూర్-
చర్లపల్లి
మధ్య
ఇవి
రాకపోకలు
సాగిస్తాయి.
నంబర్
07150
ప్రత్యేక
రైలు
నేటి
రాత్రి
8:25
నిమిషాలకు
హైదరాబాద్
నుంచి
బయలుదేరి
వెళ్తుంది.
ఆదివారం
మధ్యాహ్నం
3
గంటలకు
ముంబై
ఎల్టీటీ
చేరుకుంటుంది.
-
నేటి
రాత్రి
11:55
నిమిషాలకు
చెన్నై
ఎగ్మూర్
నుంచి
బయలుదేరే
నంబర్
06019
ప్రత్యేక
రైలు
ఆదివారం
సాయంత్రం
చర్లపల్లికి
చేరుకుంటుంది.
ఆదివారం
రాత్రి
11:38
నిమిషాలకు
బయలుదేరే
నంబర్
06020
ప్రత్యేక
రైలు
మరుసటి
చెన్నై
ఎగ్మూర్
చేరుకుంటుంది.
-
ఇందులో
దక్షిణ
రైల్వే
అగ్రస్థానంలో
నిలిచింది.
మొత్తం
18
రైళ్లలో
చైర్
కార్,
స్లీపర్
క్లాస్
కోచ్లను
అదనంగా
చేర్చింది.
-
నార్తరన్
రైల్వేలో
ఎనిమిది
రైళ్లకు
3-
ఏసీ,
చైర్
కార్
కోచ్లు
అమర్చారు.
-
పశ్చిమ
రైల్వే
పరిధిలో
నాలుగు
అత్యంత
రద్దీగల
రైళ్లకు
3-
ఏసీ,
2-ఏసీ
కోచ్లను
అదనంగా
ఏర్పాటు
చేశారు.
-
తూర్పు
మధ్య
రైల్వే
పరిధిలో
నంబర్
12309
రాజేంద్రనగర్-
న్యూఢిల్లీ
ఎక్స్
ప్రెస్
కు
అదనపు
2ఏసీ
కోచ్లను
కేటాయించారు.
నేటి
నుంచి
10వ
తేదీ
వరకు
అయిదు
ట్రిప్పుల
పాటు
ఈ
అదనపు
కోచ్లు
ప్రయాణికులకు
అందుబాటులో
ఉంటాయి.
-
ఈస్ట్
కోస్ట్
జోన్
పరిధిలోని
నంబర్
20817/20811/20823
భువనేశ్వర్-న్యూఢిల్లీ
మధ్య
నడిచే
రైళ్లకు
అయిదు
ట్రిప్పుల
కోసం
2ఏసీ
కోచ్లను
అధికారులు
అందుబాటులోకి
తీసుకొచ్చారు.
-
తూర్పు
రైల్వేలో
మూడు
రైళ్లకు
స్లీపర్
క్లాస్
కోచ్లను
అదనంగా
అమర్చారు.
ఈ
నెల
7,
8
తేదీల్లో
ఆరు
ట్రిప్పుల
పాటు
అదనపు
బోగీలు
అందుబాటులో
ఉంటాయి.
-
నార్త్
ఈస్ట్
ఫ్రాంటియర్
రైల్వే
రెండు
రైళ్లకు
3ఏసీ,
స్లీపర్
కోచ్లను
జోడించారు.
ఈ
నెల
6
నుంచి
13వ
తేదీ
వరకు
ఎనిమిది
ట్రిప్పుల
పాటు
నడుస్తుంది.
ప్రత్యేక
రైళ్లు
ఇవీ..
అదనపు
బోగీలను
అమర్చడంతో
పాటు
వివిధ
రద్దీ
మార్గాల్లో
నాలుగు
ప్రత్యేక
రైళ్లను
కూడా
ఆయా
జోన్లు
అందుబాటులోకి
తీసుకొచ్చాయి.
వీటిలో
05591/05592
గోరఖ్పూర్-
ఆనంద్
విహార్
టెర్మినల్
ప్రత్యేక
రైలు
ఈ
నెల
7
నుంచి
9వ
తేదీ
వరకు
నాలుగు
ట్రిప్పుల
మేర
రాకపోకలు
సాగిస్తుంది.
అలాగే..
న్యూఢిల్లీ
–
కేప్టెన్
తుషార్
మహాజన్
ఉధంపూర్
మధ్య
02439/02440
వందే
భారత్
స్పెషల్
రైలు
అందుబాటులోకి
వచ్చింది.
నేడు
04002/04001
న్యూఢిల్లీ-
ముంబై
సెంట్రల్
సూపర్ఫాస్ట్
స్పెషల్
నేడు,
రేపు
రాకపోకలు
సాగిస్తుంది.
04080
హజ్రత్
నిజాముద్దీన్-
తిరువనంతపురం
సెంట్రల్
సూపర్ఫాస్ట్
ప్రత్యేక
రైలు
రాకపోకలు
సాగిస్తుంది.


