Andhra Pradesh
oi-Korivi Jayakumar
వివాహేతర
సంబంధాలు
పచ్చని
సంసారంలో
చిచ్చుపెడుతున్నాయి.
కట్టుకున్న
భార్యను
కడతేర్చుతున్న
మృగాళ్లు
ఓ
పక్కన
ఉంటే..
మరోవైపు
ఇప్పుడు
కొత్తగా
ప్రియుడి
మోజులో
పడి
భర్తను
కాటికి
పంపుతున్నారు
కొందరు
మహిళలు.
ఈ
తంతుకు
బ్రేక్స్
మాత్రం
పడడం
లేదు.
ఇప్పుడు
లేటెస్ట్
గా
అలాంటి
ఘటనే
గుంటూరు
జిల్లా
దుగ్గిరాల
మండలం
చిలువూరులో
జరిగింది.
ప్రియుడితో
కలిసి
భర్తను
చంపి
ఆపై
గుండెపోటుగా
చిత్రీకరించే
ప్రయత్నం
చేసి
పోలీసులకు
దొరికిపోయింది
ఓ
కిలేడీ.
అసలేం
జరిగిందంటే..
చిలువూరుకు
చెందిన
శివనాగరాజు(45),
లక్ష్మీ
మాధురికి
2007లో
వివాహం
జరిగింది.
శివనాగరాజు
ఉల్లిపాయల
వ్యాపారం
చేసేవాడు.
విజయవాడలోని
ఓ
సినిమా
థియేటర్లో
మాధురి
కొన్ని
రోజులు
పనిచేసింది.
ఆ
సమయంలో
సత్తెనపల్లికి
చెందిన
గోపి
అనే
వ్యక్తితో
పరిచయం
ఏర్పడింది.
ఆ
పరిచయం
వివాహేతర
సంబంధానికి
దారితీసింది.
కాగా
హైదరాబాద్లో
ట్రావెల్స్
బిజినెస్
చేసే
గోపి..
శివనాగరాజుకి
డ్రైవింగ్
రావడంతో
తన
వద్దే
డ్రైవర్గా
ఉద్యోగం
ఇచ్చాడు.
దీంతో
కాపురాన్ని
హైదరాబాద్కి
మార్చారు.
ఒకరోజు
గోపి,
మాధురి
ఒంటరిగా
గడపడం
శివనాగరాజు
కంటపడింది.
వెంటనే
భార్యతో
కలిసి
తిరిగి
చిలువూరికి
వెళ్లాడు.
గోపితో
మాట్లాడొద్దని
గట్టిగా
హెచ్చరించాడు.
కానీ
గోపితో
ఆమె
వివాహేతర
సంబంధం
కొనసాగించింది.
దీంతో
భార్యాభర్తల
మధ్య
గొడవలు
జరిగాయి.
శివనాగరాజుది
ఉల్లిపాయల
వ్యాపారం
కావడంతో
ఇంటి
వద్దే
ఉండేవాడు.
తమ
అక్రమ
సంబంధానికి
భర్త
అడ్డు
వస్తున్నాడని
భావించిన
మాధురి
తన
ప్రియుడు
గోపితో
కలిసి
దారుణమైన
ప్లాన్
వేసింది.
జనవరి
18న
శివనాగరాజు
చేసే
భోజనంలో
నిద్రమాత్రలు
కలిపి
పెట్టింది.
గాఢ
నిద్రలోకి
జారుకున్న
భర్తను
తన
ప్రియుడు
గోపితో
కలిసి
హత్య
చేసింది.
రాత్రంతా
నీలి
చిత్రాలు
చూస్తూ..
ప్రియుడు
అక్కడ
నుంచి
వెళ్లిపోయాక
రాత్రి
మొత్తం
నీలి
చిత్రాలు
చూస్తూ
గడిపింది.
ఉదయం
ఏమీ
తెలియనట్టు
తన
భర్త
గుండెపోటుతో
చనిపోయాడని
నాటకం
మొదలు
పెట్టింది.
మాధురి
వ్యవహారం
కుటుంబసభ్యులు,
చుట్టుపక్కల
వారికి
తెలియడంతో
అనుమానాలు
వచ్చాయి.
అలాగే
శివనాగరాజు
ఒంటిపై
గాయాలు
కనిపించడంతో
మృతుడి
తండ్రి
పోలీసులకు
ఫిర్యాదు
చేశాడు.
అనుమానాస్పద
మృతిగా
కేసు
నమోదు
చేసుకొని
దర్యాప్తు
ప్రారంభించారు.
విచారణలో
తన
ప్రియుడితో
కలిసి
హత్య
చేసినట్లు
వెల్లడించింది
మాధురి.
నిందితుడు
గోపి
పరారీలో
ఉండగా
అతని
కోసం
గాలింపు
చేపట్టారు.


