Andhra Pradesh
oi-Dr Veena Srinivas
తెలుగు
వారు
జరుపుకునే
పెద్ద
పండుగ
సంక్రాంతి
పండుగ.
ఈ
సంక్రాంతి
పండుగ
సందర్భంగా
తెలుగు
రాష్ట్రాల్లో
ప్రజలు
తమ
స్వగ్రామాలకు
చేరుకొని
కుటుంబంతో
సంతోషంగా
గడుపుతారు.
అటువంటి
వారంతా
తమ
సొంత
ఊరికి
వెళ్లేందుకు
ఇప్పటికే
టికెట్లు
రిజర్వ్
చేసుకుంటున్నారు.
అయితే
ప్రయాణికుల
రద్దీ
నేపధ్యంలో
ప్రైవేట్
బస్సుల
ఛార్జీల
పెంపు
పండుగ
వేళ
భారంగా
మారుతుందని,
విపరీతంగా
చార్జీలు
పెంచుతున్నారు
అన్న
ఆందోళన
కనిపిస్తుంది.
ఇష్టారాజ్యంగా
ఛార్జీలు
పెంచేస్తున్న
ప్రైవేట్
బస్సు
ఆపరేటర్లు
సంక్రాంతి
పండుగ
సమీపిస్తున్న
నేపథ్యంలో
ఆంధ్రప్రదేశ్లో
ప్రయాణికుల
రద్దీ
భారీగా
పెరగనుంది
అని
అంచనా.
పండుగ
వేళ
స్వగ్రామాలకు
వెళ్లే
వారి
సంఖ్య
ఎక్కువగా
ఉండటంతో
రవాణా
వ్యవస్థపై
ఒత్తిడి
పెరుగుతోంది.
ఈ
పరిస్థితిని
ఆసరాగా
చేసుకుని
కొందరు
ప్రైవేట్
బస్సు
ఆపరేటర్లు
ఇష్టారాజ్యంగా
ఛార్జీలు
పెంచే
ప్రయత్నాలు
చేస్తున్నారు.
ఈ
క్రమంలో
వారిపై
ఫిర్యాదులు
అందుతున్న
నేపథ్యంలో
రాష్ట్ర
ప్రభుత్వం
కఠిన
హెచ్చరికలు
జారీ
చేసింది.
ఏపీ
ట్రాన్స్పోర్ట్
కమీషనర్
సీరియస్
వార్నింగ్
రాష్ట్ర
ట్రాన్స్పోర్ట్
కమిషనర్
మనీశ్
కుమార్
పండుగ
పేరుతో
ప్రయాణికులపై
అదనపు
భారం
మోపేలా
అధిక
ఛార్జీలు
వసూలు
చేస్తే
ఎట్టి
పరిస్థితుల్లోనూ
సహించబోమని
స్పష్టం
చేశారు.
ప్రభుత్వం
నిర్ణయించిన
ఛార్జీలకు
మించి
టికెట్
ధరలు
వసూలు
చేసినట్లు
గుర్తిస్తే,
సంబంధిత
ప్రైవేట్
బస్సులపై
కఠిన
చర్యలు
తీసుకుంటామని
తెలిపారు.
అవసరమైతే
ఆ
బస్సులను
సీజ్
చేసి,
నిర్వాహకులపై
చట్టపరమైన
చర్యలు
చేపడతామని
ఆయన
హెచ్చరించారు.
బస్సుల
చార్జీలపై
ప్రత్యేక
తనిఖీలు
పండుగ
సమయంలో
ప్రయాణికుల
భద్రత,
సౌకర్యం
ప్రభుత్వానికి
అత్యంత
ముఖ్యమని
కమిషనర్
మనీశ్
కుమార్
పేర్కొన్నారు.
అందుకే
రవాణా
శాఖ
అధికారులు,
ఎన్ఫోర్స్మెంట్
సిబ్బంది
ప్రత్యేక
తనిఖీలు
చేపట్టాలని
ఆదేశాలు
జారీ
చేసినట్టు
చెప్పారు.
బస్టాండ్లు,
ప్రధాన
రహదారులు,
టోల్
ప్లాజాల
వద్ద
ప్రత్యేక
నిఘా
ఏర్పాటు
చేసి,
ఛార్జీల
వివరాలను
పరిశీలించనున్నట్టు
వెల్లడించారు.
రవాణా
శాఖకు
ఫిర్యాదు
చెయ్యొచ్చు
అదే
సమయంలో
ప్రయాణికులు
కూడా
అప్రమత్తంగా
ఉండాలని
అధికారులు
సూచించారు.
అధిక
ఛార్జీలు
వసూలు
చేసిన
సందర్భాల్లో
సంబంధిత
వివరాలతో
పాటు
టికెట్
ప్రతులను
భద్రపరచుకుని,
ట్రాన్స్పోర్ట్
శాఖకు
ఫిర్యాదు
చేయాలని
ఆయన
కోరారు.
సంక్రాంతి
పండుగను
అందరూ
ఆనందంగా
జరుపుకునేలా,
ప్రయాణికులకు
ఎలాంటి
ఇబ్బందులు
కలగకుండా
చర్యలు
తీసుకుంటామని
ట్రాన్స్పోర్ట్
కమిషనర్
మనీశ్
కుమార్
భరోసా
ఇచ్చారు.
ఇక
మరి
ఈ
హెచ్చరికలు
ప్రైవేట్
ట్రావెల్స్
బస్సు
నిర్వాహకులపై
ఏ
మాత్రం
ప్రభావం
చూపిస్తాయో
తెలియాల్సి
ఉంది.


