Telangana
oi-Bomma Shivakumar
తెలంగాణలో
సంచలనం
సృష్టించిన
ఫోన్
ట్యాపింగ్
కేసులో
కీలక
పరిణామం
చోటుచేసుకుంది.
బీఆర్ఎస్
నేత,
మాజీ
మంత్రి
హరీష్
రావుకు
సిట్
నోటీసులు
జారీ
చేసింది.
డిసెంబర్
20(మంగళవారం)
ఉదయం
11
గంటలకు
జూబ్లీహిల్స్
పీఎస్
లో
విచారణకు
రావాలని
అందులో
పేర్కొంది.
హరీష్
రావు
పాత్రపై
ఓ
ప్రైవేట్
ఛానెల్
ఎండీ
ఇచ్చిన
స్టేట్
మెంట్
ఆధారంగా
హరీష్
రావుకు
నోటీసులు
ఇచ్చినట్లు
తెలుస్తోంది.
ఈ
క్రమంలో
రాష్ట్రంలో
ప్రకంపనలు
సృష్టించిన
ఫోన్
ట్యాపింగ్
కేసులో
BRS
కీలక
నేతకు
నోటీసులు
రావడం
సంచలనంగా
మారింది.
మరి
హరీష్
రావు
విచారణకు
హాజరవుతారా..?
లేదా..?
అనేది
ఆసక్తిగా
మారింది.
తెలంగాణ
రాజకీయాల్లో
ప్రకంపనలు
సృష్టించిన
ఫోన్
ట్యాపింగ్
కేసులో
మరో
సంచలన
పరిణామం
చోటుచేసుకుంది.
ఈ
కేసులో
బీఆర్ఎస్
కీలక
నేత,
మాజీ
మంత్రి
హరీష్
రావుకు
సిట్
అధికారులు
నోటీసులు
ఇచ్చారు.
ఈ
మేరకు
జూబ్లీహిల్స్
పోలీస్
స్టేషన్
లో
డిసెంబర్
20
న
ఉదయం
11
గంటలకు
విచారణకు
హాజరు
కావాలని
నోటీసుల్లో
స్పష్టం
చేశారు.
ఇక
ఫోన్
ట్యాపింగ్
కేసులో
సిట్
దూకుడు
పెంచింది.
ముఖ్యంగా
సీపీ
సజ్జనార్
నేతృత్వంలో
సిట్
ఏర్పాటు
అయినప్పటి
నుంచి
దర్యాప్తు
వేగం
పెరిగింది.
ఇందులో
భాగంగానే
గతంలో
ట్యాపింగ్
బాధితులుగా
ఉన్న
618
స్టేట్
మెంట్స్
ను
పరిశీలిస్తుంది.
అలాగే
కొందరిని
మరో
సారి
పిలిచి
మరీ
స్టేట్
మెంట్
రికార్డ్
చేస్తోంది.
ఇక
రాజకీయ
ప్రకంపనలు
సృష్టించిన
ఈ
ఫోన్
ట్యాపింగ్
కేసులో
ఇప్పటికే
నలుగురు
పోలీసు
అధికారులను
అరెస్ట్
చేయగా
ప్రభాకర్
రావును
సైతం
పలు
మార్లు
విచారించిన
విషయం
తెలిసిందే.


