Telangana
oi-Bomma Shivakumar
తెలంగాణలో
సంచలనం
సృష్టించిన
ఫోన్
ట్యాపింగ్
కేసులో
మరో
కీలక
పరిణామం
చోటుచేసుకుంది.
ఈ
కేసు
విచారణలో
భాగంగా
బీఆర్ఎస్
మాజీ
ఎంపీ
సంతోష్
రావుకు
సిట్
నోటీసులు
జారీ
చేసింది.
రేపు(జనవరి
27)
మధ్యాహ్నం
3
గంటలకు
విచారణకు
రావాలని
సంతోష్రావు
కు
ఆదేశాలు
ఇచ్చింది.
ఇక
ఫోన్
ట్యాపింగ్
కేసులో
ఇప్పటికే
కేటీఆర్,
హరీష్రావులను
సిట్
అధికారులు
విచారించిన
విషయం
తెలిసిందే.
తెలంగాణలో
సంచలనం
రేపుతున్న
ఫోన్
ట్యాపింగ్
కేసులో
సిట్
అధికారులు
విచారణను
వేగవంతం
చేశారు.
ఇప్పటికే
బీఆర్ఎస్
పార్టీకి
చెందిన
కీలక
నేతలు
కేటీఆర్,
హరీష్
రావులను
సిట్
అధికారులు
విచారించిన
విషయం
తెలిసిందే.
అయితే
తాజాగా
ఫోన్
ట్యాపింగ్
కేసులో
బీఆర్ఎస్
మాజీ
ఎంపీ
సంతోష్రావుకు
సిట్
నోటీసులు
జారీ
చేసింది.
ఈ
మేరకు
జనవరి
27
మధ్యాహ్నం
3
గంటలకు
జూబ్లీహిల్స్
లోని
సిట్
కార్యాలయంలో
హాజరుకావాలని
సంతోష్
ను
ఆదేశించింది.
ఇదే
విషయాన్ని
జుబ్లీహిల్స్
విభాగం
అసిస్టెంట్
కమిషనర్
ఆఫ్
పోలీస్
పి.
వెంకటగిరి
స్పష్టం
చేశారు.
అయితే
బీఆర్ఎస్
మాజీ
ఎంపీ
సంతోష్రావుకు
నోటీసులు
జారీ
చేయడం
రాష్ట్ర
రాజకీయ
వర్గాల్లో
పెను
కలకలం
రేపుతోంది.
ఈ
విచారణలో
సిట్
అధికారులు
సంతోష్
రావు
నుండి
ఎటువంటి
సమాచారాన్ని
రాబడతారనే
అంశం
ఇప్పుడు
హాట్
టాపిక్
గా
మారింది.
ఇక
ఐటీ
చట్టం,
ప్రభుత్వ
ఆస్తుల
నష్టం
నిరోధక
చట్టం
వంటి
కఠిన
సెక్షన్ల
కింద
సిట్
అధికారులు
విచారణ
జరుపుతున్నారు.
ఇక
ఫోన్
ట్యాపింగ్
కేసులో
మాజీ
మంత్రి
కేటీఆర్
ను
జనవరి
23
న
సిట్
అధికారులు
సుదీర్ఘంగా
విచారించారు.
జనవరి
23
శుక్రవారం
ఉదయం
11
గంటల
నుంచి
సాయంత్రం
6.30
గంటల
వరకు
విచారణ
కొనసాగింది.
ప్రధానంగా
బీఆర్ఎస్
కు
సమకూరిన
ఆర్థిక
లావాదేవీల
గురించి
పార్టీ
కార్యనిర్వాహక
అధ్యక్షుడి
హోదాలో
ఉన్న
ఆయనను
విచారించినట్లు
సమాచారం.
మరోవైపు
ఫోన్
ట్యాపింగ్
కేసులో
సిట్
దర్యాప్తు
చట్టాలకు
అనుగుణంగా,
నిష్పక్షపాతంగా
జరుగుతుందని
సీపీ
సజ్జనార్
తెలిపారు.
భద్రతా
కారణాల
దృష్ట్యా
మాత్రమే
ఫోన్
ట్యాపింగ్
జరిగిందని..
అందులో
ఎలాంటి
చట్టవిరుద్ధ
కార్యకలాపాలు
లేవని
వస్తున్న
వార్తలను
ఆయన
ఖండించారు.
అలాంటి
తప్పుడు
కథనాలతో
దర్యాప్తు
సంస్థకు
ఎలాంటి
సంబంధాలు
లేవని
సజ్జనార్
స్పష్టం
చేశారు.


