International
oi-Syed Ahmed
బంగ్లాదేశ్
లో
విద్యార్థి
నాయకుడి
హత్య
తర్వాత
హిందువులపై
మొదలైన
దాడులు
రోజురోజుకీ
తీవ్రమవుతున్నాయి.
ముఖ్యంగా
విద్యార్థి
నేత
ఉస్మాన్
హాదీ
హత్య
తర్వాత
అక్కడి
తాత్కాలిక
ప్రభుత్వాన్ని
కూడా
లెక్కచేయకుండా
అల్లరిమూకలు
రెచ్చిపోతున్నాయి.
ఈ
నేపథ్యంలో
హిందువులపై
మొదలైన
దాడులకు
కొనసాగింపుగా
తాజాగా
ఖోంకన్
దాస్
అనే
మరో
హిందువుపై
దాడి
చేసి
నిప్పంటించారు.
నిన్న
షరియత్పూర్
జిల్లాలో
మెడికల్
షాప్
నిర్వహిస్తున్న
50
ఏళ్ల
ఖోంకన్
దాస్
ఇంటికి
వెళ్తుండగా..
ఓ
గుంపు
అతన్ని
అడ్డగించింది.
అతని
కడుపు
దిగువ
భాగంలో
పొడిచి,
కొట్టి,
పెట్రోల్
పోసి
నిప్పంటించింది.
అయితే
అతను
సమీపంలోని
చెరువులోకి
దూకి
ప్రాణాలు
కాపాడుకున్నాడు.
దాస్
తన
మెడికల్
షాపు
మూసివేసి
ఇంటికి
తిరిగి
వస్తుండగా
దాడి
జరిగిందని
అతని
భార్య
తెలిపింది.
ఇది
ఎవరు
చేశారో
తనకు
తెలియదని,
కానీ
తమకు
న్యాయం
కావాలని
ఆమె
వేడుకుంది.
తన
భర్త
ఒక
సాధారణ
వ్యక్తి
అని,
అతను
ఎవరికీ
హాని
చేయలేదని,
ఎవరినీ
బాధపెట్టలేదని
తెలిపింది.
రెండు
వారాల్లో
బంగ్లాదేశ్లో
హిందువుపై
జరిగిన
నాల్గవ
దాడి
ఇది.
డిసెంబర్
18న
మైమెన్సింగ్లోని
భలుకా
ఉపజిల్లాలోని
తన
ఫ్యాక్టరీలో
ఒక
ముస్లిం
సహోద్యోగిపై
తప్పుడు
దైవదూషణ
ఆరోపణలపై
25
ఏళ్ల
హిందూ
యువకుడు
దీపు
చంద్ర
దాస్ను
మూక
దాడి
చేసి
దారుణంగా
హత్య
చేశారు.
ఆ
గుంపు
దాస్ను
హత్య
చేసి,
ఆపై
అతని
మృతదేహాన్ని
చెట్టుకు
వేలాడదీసి
నిప్పంటించింది.
తర్వాత
డిసెంబర్
24న
బంగ్లాదేశ్లోని
కలిమోహర్
యూనియన్లోని
హోస్సైన్డంగా
ప్రాంతంలో
29
ఏళ్ల
అమృత్
మండల్
అనే
మరో
హిందూ
యువకుడిని
ఒక
గుంపు
కొట్టి
చంపిందని
ఆరోపణలు
ఉన్నాయి.
బంగ్లాదేశ్
లో
హిందువులపై
జరుగుతున్న
మూకదాడులు,
హత్యలపై
భారత్
ఇప్పటికే
ఆగ్రహం
వ్యక్తం
చేసింది.
మైనార్టీలపై
దాడులు
సరికాదని
తెలిపింది.
అయితే
బంగ్లాదేశ్
మాత్రం
భారత్
ఆందోళనలను
పట్టించుకోకపోవడంతో
పరిస్ధితులు
మరింత
దిగజారుతున్నట్లు
తెలుస్తోంది.
మరోవైపు
ఈ
దాడులపై
స్పందిస్తూ..
బంగ్లాదేశ్
బహిష్కృత
ప్రధాన
మంత్రి
షేక్
హసీనా..
అక్కడి
యూనుస్
ప్రభుత్వం
మతపరమైన
మైనారిటీలను
రక్షించడంలో
విఫలమైందని
ఆరోపించారు.
తీవ్రవాదులు
విదేశాంగ
విధానాన్ని
నిర్దేశించడానికి
అనుమతిస్తున్నారని
విమర్శించారు.


