బీఆర్ఎస్ ను ప్రజలు బండకేసి కొడుతుంది ఆయన వల్లే! | cm revanth reddy slams kcr and ktr, made sensational comments

Date:


Telangana

oi-Dr Veena Srinivas

తెలంగాణను
దేశంలోనే
అగ్రగామిగా
నిలిపామని,
వరి
ఉత్పత్తిలో,
శాంతి
భద్రతల
పరిరక్షణలో,
గంజాయి
నిర్మూలనలో
రాష్ట్రం
అగ్రస్థానంలో
ఉందని
తెలంగాణ
సీఎం
రేవంత్
రెడ్డి
అన్నారు.
తెలంగాణ
రాష్ట్రంలో
విద్య,
వైద్య
రంగాలలో
కూడా
అగ్రస్థానాన్ని
చేరుకుంటామని
ధీమా
వ్యక్తం
చేశారు.
అభివృద్ధి,
సంక్షేమం
రెండు
కళ్లుగా
తమ
ప్రభుత్వం
ముందుకు
సాగుతోందని
ముఖ్యమంత్రి
రేవంత్
రెడ్డి
అన్నారు.


3.10
కోట్ల
మందికి
సన్నబియ్యం
పంపిణీ:
సీఎం
రేవంత్
రెడ్డి

పేదవాడి
సంక్షేమానికి
కట్టుబడిన
తమ
ప్రభుత్వం
రాష్ట్రంలో
3.10
కోట్ల
మందికి
సన్నబియ్యం
పంపిణీ
చేస్తోందని..
దేశంలో
రేషన్
కార్డుపై
సన్నబియ్యం
పంపిణీ
చేస్తున్న
ఏకైక
రాష్ట్రం
తెలంగాణ
అని
ఆయన
అన్నారు.
ప్రజాపాలన
విజయోత్సవాల్లో
భాగంగా
ఆయన
నిన్న
నల్గొండ
జిల్లా
దేవరకొండలో
బహిరంగ
సభలో
ప్రసంగించారు.
ఎన్నికల
హామీల
మేరకు
తాము
అధికారంలోకి
వచ్చిన
వెంటనే
కొత్తగా
పెద్ద
సంఖ్యలో
రేషన్
కార్డులు
ఇచ్చినట్లు
చెప్పారు.

cm revanth reddy slams kcr and ktr made sensational comments


SLBC
ప్రాజెక్టును
పూర్తి
చేస్తాం

తాము
అధికారంలోకి
వచ్చిన
ఏడాదిలోపే
25
లక్షల
మంది
రైతులకు
రుణమాఫీ
చేసినట్లు
చెప్పారు.
గతంలో
కాంగ్రెస్
ప్రభుత్వం
మంజూరు
చేసిన
SLBC
ప్రాజెక్టును
బీఆర్ఎస్
ప్రభుత్వం
పదేళ్ల
పాటు
పట్టించుకోలేదని
ఆరోపించారు.

ప్రాజెక్టును
తమ
ప్రభుత్వమే
పూర్తి
చేసి
నల్గొండ
జిల్లాకు
నీళ్లందిస్తుందని
ముఖ్యమంత్రి
స్పష్టం
చేశారు.


కేటీఆర్,
కేసీఆర్
లపై
తీవ్ర
వ్యాఖ్యలు

కెసిఆర్,
కేటీఆర్

పైన,
బిఆర్ఎస్
పార్టీ
పైన
తీవ్ర
వ్యాఖ్యలు
చేసిన
సీఎం
రేవంత్
రెడ్డి
పదేళ్ల
పాలనలో
కేసీఆర్
కుటుంబం
రాష్ట్రాన్ని
ఎనిమిది
లక్షల
కోట్ల
రూపాయల
అప్పులపాలు
చేసిందని
అన్నారు
.తండ్రి,
కొడుకు,
కూతురు,
అల్లుడు
రాష్ట్రాన్ని
దోచుకున్నారని
ఆరోపించారు.
బీఆర్ఎస్
పార్టీకి
కేటీఆర్

పెద్ద
గుదిబండ
అని,
ఆయన
ఉన్నంతకాలం
ప్రజలు

పార్టీని
బండకేసి
కొడుతూనే
ఉంటారని
రేవంత్
రెడ్డి
వ్యాఖ్యానించారు.


బీఆర్ఎస్
కు
రేవంత్
సవాల్

గతంలో
ఎప్పుడూ
మంత్రులను
కూడా
ఇంట్లోకి
రానివ్వని
కేసీఆర్,
ఇప్పుడు
సర్పంచ్
లను
పక్కన
పెట్టుకొని
మంచి
రోజులు
వస్తాయని
చెప్పడం
హాస్యాస్పదంగా
ఉందన్నారు.
డబుల్
బెడ్
రూమ్
ఇళ్ల
విషయంలో
బిఆర్ఎస్
కు
సవాల్
విసిరిన
రేవంత్
రెడ్డి
తాము
ఇందిరమ్మ
ఇళ్ళు
ఇచ్చిన
గ్రామాలలో
ఓట్లు
అడుగుతామని,
బీఆర్ఎస్
డబుల్
బెడ్
రూమ్
ఇల్లు
కట్టిన
చోట్ల
మాత్రమే
ఓట్లు
అడగాలని
సవాల్
విసిరారు.


దేవరకొండలో
అభివృద్ధి
పనులకు
సీఎం
శంకుస్థాపన

తమ
ప్రభుత్వం
22,500
కోట్లతో
నాలుగు
లక్షల
50
వేల
ఇందిరమ్మ
ఇళ్ళను
నిర్మిస్తోంది
అని
రేవంత్
రెడ్డి
తెలిపారు.
అంతకముందు
దేవరకొండ
నియోజకవర్గంలో
23
కోట్ల
రూపాయలతో
చేపట్టే
అభివృద్ధి
పనులకు
ముఖ్యమంత్రి
శంకుస్థాపన
చేశారు.
మహిళా
సంఘాలకు
సుమారు
11.34
కోట్ల
రూపాయల
విలువగల
బ్యాంకు
లింకేజీ
చెక్కులను
అందజేశారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related