బ్రేక్ దర్శనాలకు.. బ్రేక్ | VIP Break Darshans Cancelled for Tirumala Festivals in December 2025 and January 2026

Date:


Andhra Pradesh

oi-Chandrasekhar Rao

తిరుమలలో
వైకుంఠ
ఏకాదశి
ఏర్పాట్లు
చురుగ్గా
సాగుతున్నాయి.

నెల
30వ
తేదీన
వైకుంఠ
ఏకాదశిని
పురస్కరించుకుని
ప్రారంభం
అయ్యే
వైకుంఠ
ద్వార
దర్శనాలు
జనవరి
8వ
తేదీ
వరకు
కొనసాగనున్నాయి.

సందర్భంగా
లక్షలాదిమంది
భక్తులు
శ్రీవారిని
దర్శించుకునే
అవకాశం
ఉందని
టీటీడీ
అంచనా
వేస్తోంది.
దీనికి
అనుగుణంగా
చర్యలు
చేపట్టింది.
ఇప్పటికే
తొలి
మూడు
రోజుల
కోసం
మొత్తం
1,76,000
మంది
భక్తులను
ఈ-
డిప్
ద్వారా
ఎంపిక
చేశారు.

182
గంట‌ల
ద‌ర్శ‌న
స‌మ‌యంలో
164
గంట‌లు
సామాన్య
భ‌క్తుల‌కే
కేటాయించింది
టీటీడీ.
మొదటి
మూడు
రోజులు
కూడా
ప్రత్యేక
ప్రవేశం,
శ్రీవాణి
దర్శనాలు
రద్దయ్యాయి.
మిగిలిన
ఏడు
రోజుల
కోసం

ఉదయం
10
గంటలకు
శ్రీవాణి,
మధ్యాహ్నం
3
గంటలకు
ప్రత్యేక
ప్రవేశ
దర్శనం
టికెట్లను
ఆన్
లైన్
లో
విడుదల
అయ్యాయి.
రోజుకు
శ్రీవాణి-
1,000,
ప్రత్యేక
ప్రవేశం-
15,000
టికెట్లు
జారీ
చేశారు
టీటీడీ
అధికారులు.

VIP Break Darshans Cancelled for Tirumala Festivals in December 2025 and January 2026

వైకుంఠ
ఏకాదశి
సహా
తిరుమలలో
జరిగే
వివిధ
సందర్భాలు,
విశేష
పర్వదినాల
నేపథ్యంలో
15
రోజుల
వరకు
వీఐపీ
బ్రేక్
దర్శనాలకు
బ్రేకులు
పడ్డాయి.
వీటికి
సంబంధించిన
వివరాలను
టీటీడీ
అధికారులు
విడుదల
చేశారు.
2026
జనవరి
వరకు
ఇది
కొనసాగుతుంది.
శ్రీవారి
ఆలయంలో
నిర్వహించే
పలు
పర్వదినాల
వల్ల
వీఐపీ
బ్రేక్
దర్శనాలను
ఆయా
రోజుల్లో
రద్దు
చేశారు.

నెల
23వ
తేదీన
మంగళవారం
నాడు
శ్రీవారి
ఆలయంలో
కోయిల్
ఆళ్వార్
తిరుమంజనం
కార్యక్రమం
జరుగనుంది.


రోజున
వీఐపీ
బ్రేక్
దర్శనాలు
ఉండవు.
వైకుంఠ
ఏకాదశి
ముందు
రోజైన
29
కలుపుకొని,
30వ
తేదీ
నుండి
జనవరి
8వ
తేది
వరకు
అంటే
వైకుంఠ
ఏకాదశి
ద్వార
దర్శనాలు
ముగిసేంత
వరకూ
వీఐపీ
బ్రేక్
దర్శనాలు
అందుబాటులో
ఉండవు.

తర్వాత
దీన్ని
పునరుద్ధరిస్తారు.
అదే
నెల
25వ
తేదీన
రథ
సప్తమి.

పండుగ
కారణంగా
ప్రోటోకాల్
ప్రముఖులకు
మినహా
వీఐపీ
బ్రేక్
దర్శనాలు
రద్దు
అయ్యాయి.
ఆయా
తేదీలకు
ముందురోజు
వీఐపీ
దర్శనాలకు
సంబంధించిన
సిఫారసు
లేఖలను
కూడా
టీటీడీ
స్వీకరించదు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related