భక్తులకు టీటీడీ చక్కటి అవకాశం- ఈ ఒక్కరోజే..తిరుపతిలో

Date:


Andhra Pradesh

oi-Chandrasekhar Rao

ప్రఖ్యాత
పుణ్యక్షేత్రం
తిరుమలలో
భక్తుల
రద్దీ
నెలకొంది.
బుధవారం
నాడు
76,289
మంది
భక్తులు
శ్రీవారి
దర్శించుకున్నారు.
వారిలో
27,586
మంది
తలనీలాలు
సమర్పించారు.
తమ
మొక్కులు
చెల్లించుకున్నారు.

ఒక్కరోజే
హుండీ
ద్వారా
3.84
కోట్ల
రూపాయల
ఆదాయం
తిరుమల
తిరుపతి
దేవస్థానానికి
అందింది.
వైకుంఠం
క్యూ
కాంప్లెక్స్‌‌లో
అన్ని
కంపార్ట్‌మెంట్లు
భక్తులతో
నిండిపోయాయి.
కృష్ణతేజ
గెస్ట్
హౌస్
వరకు
క్యూలైన్
ఏర్పడింది.
టోకెన్
లేని
సర్వదర్శనం
భక్తులకు
స్వామివారి
దర్శనానికి
14
నుంచి
16
గంటల
సమయం
పట్టింది.

నేడు
కనుమ
పండుగ
సందర్భంగా
టీటీడీ
ఆధ్వర్యంలో
గోపూజ
మహోత్సవం
ఘనంగా
జరుగనుంది.
తిరుపతిలోని
శ్రీవేంకటేశ్వర
గోశాలలో

కార్యక్రమం
ఏర్పాటైంది.
తెల్లవారు
జామున
5
గంటలకు
గోపూజ
ఉత్సవాలు
ఆరంభంం
అయ్యాయి.
మధ్యాహ్నం
వరకు
కొనసాగనున్నాయి.
ఇందులో
భాగంగా
ఉదయం
10:30
గంంటల
వరకు
శ్రీవేణుగోపాలస్వామివారికి
అభిషేకం,
పూజ,
హారతి
కార్యక్రమాన్ని
నిర్వహిస్తారు.

ఉదయం
10:30
గంంటల
నుండి
11:15
నిమిషాల
వరకు
గోపూజ
ఉత్సవం
ఆరంభమౌతుంది.
గోపూజ,
కటమ,
అశ్వ,
వృషభ,
గజపూజ
జరుగనుంది.
అనంతరం
టీటీడీ
దాస
సాహిత్య
ప్రాజెక్టు
కళాకారులతో
భజన,
కోలాటాలు,
అన్నమాచార్య
ప్రాజెక్టు
కళాకారులతో
సంకీర్తన
కార్యక్రమాలు
నిర్వహిస్తారు.
మధ్యాహ్నం
12
గంటల
నుండి
శ్రీవేణుగోపాలస్వామివారి
దర్శనం,
ప్రసాదం
పంపిణీ
చేస్తారు.
గోపూజ
మహోత్సవం
రోజున
గోవులకు
బెల్లం,
బియ్యం,
గ్రాసం
భక్తులు
స్వయంగా
తినిపించే
అవకాశాన్ని
టీటీడీ
కల్పిస్తోంది.

అవకాశాన్ని
భక్తులు
వినియోగించుకోవాలని,
గోమాత,
వేణుగోపాలస్వామివారి
కృపకు
పాత్రులు
కావాలని
టీటీడీ
సూచించింది.

మరోవంక-
తిరుపతిలోని
టీటీడీ
పరిపాలన
భవనం
గ్రౌండ్స్
లో
గురువారం
రాత్రి
కన్నుల
పండువగా
గోదా
కల్యాణం
జరిగింది.
ముందుగా
శ్రీకృష్ణస్వామి,
శ్రీ
ఆండాళ్
అమ్మవారి
ఉత్సవమూర్తులను
విశేషంగా
అలంకరించి
అర్చకస్వాములు
కల్యాణ
వేదిక
మీద
వేంచేపు
చేశారు.
అనంతరం
తిరుమల
శ్రీవారి
ఆలయ
అర్చకులు
శ్రీవిష్వక్సేన
పూజ,
పుణ్యాహవాచనం,
అంకురార్పణం,
రక్షాబంధనం
అగ్నిప్రతిష్ఠ
కార్యక్రమాలు
నిర్వహించారు.

దీని
తర్వాత
మహా
సంకల్పం,
స్వామి,
అమ్మవార్ల
ప్రవరలు,
మాంగల్యపూజ,
మాంగల్య
ధారణ
కార్యక్రమాలు
నిర్వహించారు.
అనంతరం
ప్రధాన
హోమం,
పూర్ణాహుతి
కార్యక్రమాలు
జరిపారు.
వారణమాయిరం,
మాలా
పరివర్తనం,
అక్షతారోపణం
జరిపి
చివరగా
నివేదన,
మంగళ
హారతులు
నిర్వహించారు.
గోవింద
నామ
సంకీర్తనలతో
గోదా
కల్యాణం
కార్యక్రమం
ముగిసింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related