International
-Bomma Shivakumar
భారత్-
రష్యా
సంబంధాలపై
విదేశాంగ
మంత్రి
జై
శంకర్
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
గత
70-80
ఏళ్లుగా
భారత్-
రష్యా
భాగస్వామ్యం
దృఢంగా
కొనసాగుతూ
వస్తోందని
తెలిపారు.
విదేశీ
పాలసీ
విధానంలో
వ్యూహాత్మకంగా
ముందుకెళ్తున్నట్లు
స్పష్టం
చేశారు.
మరోవైపు
రష్యా
అధ్యక్షుడు
వ్లాదిమిర్
పుతిన్
భారత్
పర్యటన
నేపథ్యంలో..
అమెరికాతో
వాణిజ్య
చర్చలపై
ప్రభావం
చూపుతుందనే
అభిప్రాయాలను
ఆయన
తోసిపుచ్చారు.
భారత్-
రష్యాల
మధ్య
బంధం
ఎప్పటికీ
నిలకడగానే
ఉంటుందని
ఆశాభావం
వ్యక్తం
చేశారు.
హిందుస్తాన్
టైమ్స్
నాయకత్వ
సదస్సులో
తాజాగా
విదేశాంగ
మంత్రి
జై
శంకర్
పాల్గొన్నారు.
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
రష్యా
అధ్యక్షుడు
పుతిన్
పర్యటన
నేపథ్యంలో..
అమెరికాతో
ద్వైపాక్షిక
వాణిజ్య
ఒప్పందంపై
భారత్
చర్చలను
క్లిష్టతరం
చేస్తుందనే
అభిప్రాయాలను
ఆయన
ఖండించారు.
ప్రపంచంలోని
అన్ని
ప్రధాన
దేశాలతో
భారత్
కు
సంబంధాలు
ఉన్నాయని
అందరికీ
తెలుసని
అన్నారు.
భారత్-
రష్యా
మధ్య
80
ఏళ్ల
నుంచి
స్థిరమైన,
దృఢమైన
సంబంధాలు
నెలకొని
ఉన్నాయని
స్పష్టం
చేశారు.
భారత్
వస్తువులపై,
రష్యా
ముడి
చమురు
కొనుగోళ్లపై
25
శాతం
పన్నులతో
సహా
50
శాతం
భారీ
సుంకాన్ని
విధించిన
తర్వాత,
గత
రెండు
దశాబ్దాలలో
భారత్-
అమెరికా
సంబంధాలు
అత్యంత
క్లిష్టమైన
దశలో
నడుస్తున్నాయి.
ఈ
రెండు
దేశాలు
ప్రస్తుతం
ప్రతిపాదిత
వాణిజ్య
ఒప్పందం
కోసం
చర్చలు
జరుపుతున్నాయి.
‘మా
వాణిజ్య
ప్రయోజనాలకు
ఒక
ఉమ్మడి
పరిష్కారం
ఉంటుందని
మేం
విశ్వసిస్తున్నాం.
ఈ
దేశంలో
జీవనోపాధిపై
ప్రభావం
చూపే
అంశం
కాబట్టి
దీనిని
కచ్చితంగా
చర్చించాలి’
అని
ఆయన
అన్నారు.
‘ముఖ్యంగా,
కార్మికులు,
రైతులు,
చిన్న
వ్యాపారాలు,
మధ్యతరగతి
ప్రజల
ప్రయోజనాలు
మాకు
ముఖ్యం.
అమెరికా
లాంటి
దేశంతో
వాణిజ్య
ఒప్పందాన్ని
పరిశీలించినప్పుడు,
మీ
స్థానం,
మీరు
ప్రెజెంట్
చేసే
విషయాల
గురించి
చాలా
వివేకంతో
ఉండాలి’
అని
జైశంకర్
సూచించారు.
ఇక
పాకిస్థాన్
ఆర్మీ
చీఫ్
ఫీల్డ్
మార్షల్
అసిమ్
మునీర్
గురించి
అడిగిన
ప్రశ్నకు..
భారత్
కు
ఉన్న
సమస్యలలో
చాలావరకు
ఆ
దేశ
సైన్యం
నుండే
ఉత్పన్నమవుతాయని
జైశంకర్
పునరుద్ఘాటించారు.
పాక్
సైన్యం
ఉగ్రవాద
సంస్థలకు
మద్దతు
ఇవ్వడాన్ని
ఆయన
ప్రస్తావించారు.
అలాగే
మాజీ
బంగ్లాదేశ్
ప్రధాని
షేక్
హసీనా
భారత్
లోనే
ఉంటారా..?
అని
అడిగినప్పుడు..
‘ఆమె
ఒక
నిర్దిష్ట
పరిస్థితిలో
ఇక్కడికి
వచ్చారు,
ఆ
పరిస్థితి
స్పష్టంగా
ఆమె
భవితవ్యాన్ని
ప్రభావితం
చేస్తుంది.
అయితే,
ఆమె
స్వయంగా
నిర్ణయం
తీసుకోవాలి’
అని
జై
శంకర్
జవాబిచ్చారు.


