భారీగా పెరిగిన బాలయ్య పారితోషికం | nandamuri Balakrishna remuneration increased significantly

Date:


Entertainment

oi-Garikapati Rajesh

నందమూరి
బాలకృష్ణ
ప్రస్తుతం
ఫుల్
ఫాంలో
ఉన్నారు.
అలాగే
ఫుల్
జోష్
మీద
కూడా
ఉన్నారు.
తన
తోటి
అగ్ర
కథానాయకులైన
చిరంజీవి,
నాగార్జున,
వెంకటేష్
కన్నా
ఎంతో
ముందున్నారని
చెప్పొచ్చు.
అఖండ
నుంచి
వరుసగా
హిట్లు
కొడుతున్నారు.
అఖండ,
వీరసింహారెడ్డి,
భగవంత్
కేసరి,
డాకూ
మహారాజ్
సినిమాలతో
వరుసగా
సూపర్
హిట్లు
ఇచ్చారు.
బోయపాటి
శ్రీనుతో
చేసిన
అఖండ2
డిసెంబరు
5వ
తేదీన
విడుదల
కాబోతోంది.
దీని
తర్వాత
గోపీచంద్
మలినేని
దర్శకత్వంలో
పీరియాడికల్
డ్రామా
చేయనున్నారు.

సినిమాతో
బాలయ్య
డబుల్
హ్యాట్రిక్
కొడతాడనే
నమ్మకంతో
నందమూరి
అభిమానులున్నారు.


ఏనాడూ
డిమాండ్
చేయలేదు

వాస్తవానికి
బాలయ్య
పారితోషికం
విషయంలో
ఎప్పుడూ
డిమాండ్
చేయరు.
ఆయన
నిర్మాతల
గురించి,
సినిమాకు
అవుతున్న
బడ్జెట్
గురించి
ఆలోచిస్తారు.
నిర్మాతలు
ఎంతిస్తే
అంతే
తీసుకుంటారు.

విషయంలో
ఆయనపై
ఎప్పుడూ
ఒక్క
ఫిర్యాదు
కూడా
రాలేదు.
అందుకే
నిర్మాతలంతా
బాలయ్యతో
సినిమా
తీయాలని
కోరుకుంటుంటారు.
అయితే
అఖండ
సినిమాతోపాటు
తర్వాత
చేసిన
సినిమాలకు
కూడా
ఆయన
తనకు
ఇంత
కావాలి
అడగలేదు.
కానీ
నిర్మాతలే
బాలయ్య
పారితోషికాన్ని
పైపైకి
పెంచుకుంటూ
వెళ్లారు.
దీంతో
ఆయన
కాదనలేక
తీసుకుంటున్నారు.
తాజాగా
గోపీచంద్
మలినేని
దర్శకత్వంలో
చేయబోతున్న
సినిమాకు
రూ.45
కోట్లను
పారితోషికంగా
తీసుకుంటున్నట్లు
తెలుస్తోంది.

nandamuri Balakrishna remuneration increased significantly


తేజస్వినికి
అభినందనలు

బాలయ్య

సినిమా
చేయాలి?
ఎటువంటి
కథలను
ఎంచుకోవాలి?
ఆయన
మేకప్,
కాస్ట్యూమ్స్
ఎలా
ఉండాలనే
విషయాన్ని
బాలకృష్ణ
చిన్న
కుమార్తె
తేజస్విని
చూసుకుంటున్నారు.
ఆమె
దగ్గరుండి
చూసుకుంటుండటంతో
బాలయ్యకు
వరుసగా
బ్లాక్
బస్టర్లు
పడుతున్నాయని
చెప్పొచ్చు.
అలాగే
అఖండ2తో
నిర్మాతగా
మారారు.

సినిమాకు
సమర్పకురాలిగా
వ్యవహరిస్తున్నారు.
బాలయ్య
రూ.45
కోట్లను
పారితోషికంగా
తీసుకుంటుండటంపై
నందమూరి
అభిమానులంతా
సంతోషం
వ్యక్తం
చేస్తున్నారు.
బాలయ్య
ఇమేజ్
ను
పెంచడంలో,
పారితోషికాన్ని
పెంచడంలో,
క్రేజ్
ను
పెంచడంలో
తేజస్విని
కీలక
పాత్ర
పోషిస్తోందంటూ
అభినందనలు
వస్తున్నాయి.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related