Telangana
oi-Bomma Shivakumar
ఇటీవలి
కాలంలో
సైబర్
నేరాలు
భారీగా
పెరిగిపోతున్నాయి.
విద్యావంతులు,
ఉద్యోగులు
కూడా
సైబర్
కేటుగాళ్ల
మాయలో
పడి
రూ.
కోట్లు
పోగొట్టుకుంటున్నారు.
గతేడాది
కేవలం
8
నెలల్లోనే
సైబర్
నేరగాళ్లు
ఏకంగా
రూ.372
కోట్లు
కాజేసినట్లు
ఇటీవల
పోలీసులు
తెలిపారు.
సైబర్
మోసాల
పట్ల
అప్రమత్తంగా
ఉండాలని
ఎప్పటి
కప్పుడు
సూచనలు
ఇస్తూ
ఉన్నారు.
అయినా
కూడా
కేటుగాళ్ల
మాయలో
పడి
చాలా
మంది
మోసపోతూనే
ఉన్నారు.
తాజాగా
ఖమ్మం
జిల్లాలో
భారీ
సైబర్
క్రైమ్
కేసును
పోలీసులు
ఛేదించారు.
ఈ
కేసుకు
సంబంధించి
ఆరుగురు
ప్రధాన
నిందితులను
అరెస్ట్
చేశారు.
సైబర్
క్రైమ్
ద్వారా
వీళ్లంతా
రూ.
547
కోట్ల
రూపాయలను
అక్రమంగా
సంపాదించినట్లు
తేల్చారు.
కాల్
సెంటర్లు
నిర్వహిస్తూ
అలాగే..
మాట్రిమోని,
రివార్డ్
పాయింట్లు,
గేమింగ్,
బెట్టింగ్,
షేర్
మార్కెట్
లో
పెట్టుబడులు,
క్రిప్టో
కరెన్సీ
ట్రేడింగ్..
ఇలా
పలు
రకాలుగా
బాధితుల
నుంచి
ఈ
డబ్బును
కొల్లగొట్టినట్టు
స్పష్టం
అవుతోంది.
గతేడాది
డిసెంబర్
లో
వి
ఎం
బంజర్
పోలీస్
స్టేషన్
లో
సాయికిరణ్
అనే
వ్యక్తి
..
తాను
సైబర్
మాయగాళ్ల
చేతిలో
మోసపోయినట్లు
ఫిర్యాదు
చేశాడు.
దాంతో
వీరి
ఉదంతం
వెలుగులోకి
వచ్చింది.
ఈ
మేరకు
పోట్రు
మనోజ్
కళ్యాణ్,
ఉడతనేని
వికాస్
చౌదరి,
పోట్రు
ప్రవీణ్,
మేడ
భానుప్రియ,
మేడ
సతీష్,
మోరంపూడి
చెన్నకేశవ
అనే
ఆరుగురు
నిందితులను
పోలీసులు
అరెస్ట్
చేశారు.
నిందితులు
సత్తుపల్లి
ప్రాంతానికి
చెందినవారుగా
పోలీసుల
విచారణలో
తేలింది.
అలాగే
నిందితులకు
బ్యాంక్
ఖాతాలు
ఇచ్చిన
మరో
17
మందిపై
కేసులు
నమోదు
చేశారు.
వీళ్లంతా
అంతర్జాతీయ
సైబర్
నేరస్తులతో
జతకట్టి
సైబర్
నేరాలకు
పాల్పడుతున్నట్లు
పోలీసులు
ప్రాథమికంగా
నిర్థారించారు.
ఇక
ఇటీవల
హైదరాబాద్
లో
మాజీ
ఐపీఎస్
భార్యకు
సైబర్
నేరగాళ్ల
టోకరా
వేసిన
సంగతి
తెలిసిందే.
స్టాక్
మార్కెట్లో
పెట్టుబడి
పేరుతో
కేవలం
పది
రోజుల్లోనే
ఆమె
నుంచి
ఏకంగా
రూ.2.58
కోట్లు
కొట్టేశారు
సైబర్
కేటుగాళ్లు.


