International
oi-Bomma Shivakumar
జనవరి
3
న
అమెరికా
సైన్యం
జరిపిన
వైమానిక
దాడుల్లో
వెనిజులా
అట్టుడుకిపోయిన
విషయం
తెలిసిందే.
అమెరికాకు
చెందిన
డెల్టా
ఫోర్స్..
వెనిజులా
రాజధాని
కరాకస్
పరిసర
ప్రాంతాల్లోని
ఏడు
చోట్ల
భారీ
పేలుళ్లు
జరిపింది.
ఆ
దేశ
అధ్యక్షుడు
నికోలస్
మదురో,
అతని
భార్య
సిలియా
ఫ్లోర్స్
ను
కస్టడీలోకి
తీసుకుంది.
అయితే
అమెరికా
చర్యలను
తాజాగా
చైనా
ఖండించింది.
వెనిజులాపై
దాడి
అంతర్జాతీయ
చట్టాలు,
యూఎన్
చార్టర్
కు
వ్యతిరేకం
అని
పేర్కొంది.
వెనిజులాపై
అమెరికా
దాడి
చేసి
ఆ
దేశ
అధ్యక్షుడు
నికోలస్
మదురో
అతని
భార్య
సిలియా
ఫ్లోర్స్
ను
కస్టడీలోకి
తీసుకోవడాన్ని
చైనా
ఖండించింది.
మదురో,
అతని
భార్యను
తక్షణమే
రిలీజ్
చేయాలని
డిమాండ్
చేసింది.
ఈ
మేరకు
చైనా
విదేశాంగ
మంత్రిత్వ
శాఖ
ఓ
ప్రకటన
రిలీజ్
చేసింది.
ఈ
ఘటనపై
చైనా
ఆందోళన
వ్యక్తం
చేస్తుందని
పేర్కొంది.
మదురో,
అతని
భార్య
వ్యక్తిగత
భద్రతను
దృష్టిలో
ఉంచుకుని
అమెరికా
తక్షణమే
వారిని
విడుదల
చేయాలని
డిమాండ్
చేసింది.
అమెరికా,
వెనిజులా
మధ్య
ఏమైనా
సమస్యలు
ఉంటే
చర్యలు,
సంప్రదింపులు
ద్వారా
తేల్చుకోవాలని
సూచనలు
చేసింది.
అమెరికా
ఇలాంటి
దుందుడుకు
చర్యలకు
పాల్పడడం
సరైన
పద్దతి
కాదని
వివరించింది.
అమెరికా
చర్యలు
అంతర్జాతీయ
చట్టాలు,
యూఎన్
చార్టర్
నిబంధనలను
ఉల్లంఘించినట్లే
అవుతుందని
పేర్కొంది.
అంతర్జాతీయ
సంబంధాల్లోని
కనీస
విలువలను
కూడా
అమెరికా
పాటించడం
లేదని
చైనా
విదేశాంగ
మంత్రిత్వ
శాఖ
స్పష్టం
చేసింది.
నికోలస్
మదురో
అమెరికాలో
మత్తు
పదార్థాల
అక్రమ
రవాణా
చేస్తున్నారని
ట్రంప్
సర్కార్
చాలా
రోజుల
నుంచి
ఆరోపణలు
చేస్తోంది.
ఈ
క్రమంలోనే
వెనిజులాపై
అమెరికా
దాడులకు
పాల్పడింది.
దాడి
అనంతరం
ప్రెస్
మీట్
లో
ట్రంప్
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
వెనిజులాపై
దాడులు
చేసిన
అమెరికా
సైన్యాన్ని
పొగడ్తలతో
ముంచెత్తారు.
యూఎస్
సైన్యం..
స్పీడ్,
చురుకుదనం,
నాణ్యతతో
దాడులు
చేసిందని
తెలిపారు.
అమెరికన్
మిలిటరీ
సేఫ్
అని..
ఎవరూ
మృతి
చెందలేదని
స్పష్టం
చేశారు.
అంతేకాక
ప్రస్తుతం
వెనిజులాను
మా
అధీనంలో
నడుపుతామని
క్లారిటీ
ఇచ్చారు.
ఇక
వెనిజులాపై
అమెరికా
దాడిని
చాలా
దేశాలు
ఖండించాయి.
ఈ
ఘటనపై
భారత్
కూడా
స్పందించింది.
వెనిజులాలో
జరుగుతున్న
పరిణామాలు
తీవ్ర
ఆందోళన
కలిగిస్తున్నాయని
భారత్
పేర్కొంది.
అమెరికా
దాడులు,
తదితర
పరిణామాలను
నిశితంగా
పరిశీలిస్తున్నామని
స్పష్టం
చేసింది.
వెనిజులా
ప్రజల
శ్రేయస్సు,
భద్రతకు
భారత్
తన
మద్దతును
కొనసాగిస్తుందని
వివరించింది.
ఈ
మేరకు
భారత
విదేశాంగ
మంత్రిత్వ
శాఖ
ఓ
ప్రకటన
విడుదల
చేసింది.
మరోవైపు
వెనిజులాకు
ప్రయాణం
చేయోద్దని
భారత
పౌరులను
విదేశాంగ
శాఖ
కోరింది.
ఇక
ఇప్పటికే
అక్కడ
ఉన్న
భారతీయులు
జాగ్రత్తగా
ఉండాలని
సూచనలు
చేసింది.


