మద్యం ప్రియులకు బిగ్ షాక్ సిద్ధం చేస్తున్న సింగూరు ప్రాజెక్ట్!

Date:


Telangana

oi-Dr Veena Srinivas

తెలంగాణ
రాష్ట్రంలో
మద్యం
ప్రియులకు
షాక్
ఇచ్చే
విషయం
ఒకటి
ప్రస్తుతం
రాష్ట్రంలో
చర్చనీయాంసంగా
మారింది.
తెలంగాణ
రాష్ట్రంలో
మద్యం
అమ్మకాలు

సీజన్లో
అయినా
జోరుగానే
సాగుతాయి.
ముఖ్యంగా
ఎండాకాలంలో
అయితే
బీర్ల
వినియోగం
విపరీతంగా
ఉంటుంది.
ఎండ
వేడి
నుండి
ఉపశమనం
పొందడం
కోసం
చాలామంది
చల్లని
బీర్లు
తాగాలని
మద్యం
దుకాణాలు
వెంట
పరుగులు
పెడతారు.


సంగారెడ్డిలో
బేవరేజెస్
కంపెనీలకు
సింగూరు
ప్రాజెక్టు
నుండి
నీళ్లు

అయితే
ఈసారి
వేసవిలో
బీరు
ప్రియులకు
నిరాశ
తప్పదని
అంటున్నారు.
అసలు
ఎందుకు
తెలంగాణ
రాష్ట్రంలో
ఈసారి
ఎండాకాలం
బీర్ల
కొరత
వస్తుంది
అంటే..
సంగారెడ్డి
జిల్లాలో
నాలుగు
కీలకమైన
బేవరేజెస్
కంపెనీలు
ఉన్నాయి.

బీర్
మ్యానుఫ్యాక్చరింగ్
బేవరేజెస్
కంపెనీలకు
సింగూరు
ప్రాజెక్టు
నుండి
నీళ్లు
వెళ్తాయి.
సింగూరు
జలమండలి
నుంచి

బీరు
ఫ్యాక్టరీలకు
ప్రతిరోజు
44
లక్షల
లీటర్ల
నీరు
సరఫరా
అవుతుంది.


సింగూరు
ప్రాజెక్ట్
కు
మరమ్మత్తులు

ప్రస్తుతం
సింగూరు
ప్రాజెక్టుకు
మరమ్మత్తులు
చేపట్టనున్న
క్రమంలో,

బేవరేజెస్
ఫ్యాక్టరీలకు
నీటి
సరఫరా
నిలిచిపోనుంది.

నీటి
సరఫరా
నిలిచిపోతే
బీర్ల
ఉత్పత్తి
బాగా
తగ్గే
అవకాశం
ఉంది.
ఇక
నీటి
సరఫరా
లేకుంటే
పూర్తిగా
బీర్ల
ఉత్పత్తి
నిలిచిపోయే
ప్రమాదం
కూడా
ఉంది.
అంతేకాదు
దీనివల్ల
సంగారెడ్డి
పట్టణంలో
కూడా
తాగునీటి
సరఫరాకు
ఇబ్బంది
వచ్చే
ప్రమాదం
ఉంది.


దేశంలోని
11
రాష్ట్రాలకు
బీర్లు
సరఫరా
ఇక్కడ
నుండే

సింగూరు
డ్యాం
సేఫ్టీ
రివ్యూ
ప్యానల్
సిఫార్సులతో
ప్రాజెక్టులోని
నీటిని
పూర్తిగా
ఖాళీ
చేసి
మరమ్మత్తులు
చేయనున్న
క్రమంలో
బీర్లు
తయారు
చేసే

బేవరేజెస్
కంపెనీలకు
ఇబ్బంది
వచ్చే
ప్రమాదం
కనిపిస్తుంది.
సంగారెడ్డి
జిల్లాలోని
నాలుగు
బీర్
ఫ్యాక్టరీల
నుండి
దేశంలోని
11
రాష్ట్రాలకు
బీర్లు
సరఫరా
అవుతాయి.
ప్రస్తుతం

ఫ్యాక్టరీలకు
నామమాత్రపు
ధరకే
నీటిని
అందిస్తున్నారు.


బీర్ల
ధరలు
పెరిగే
ఛాన్స్..
బీర్ల
ఉత్పత్తిపై
ప్రభావం

ఇది
ఉత్పత్తి
వ్యయంలో
కీలకమైన
భాగంగా
ఉండగా,

ప్రాజెక్టు
మరమ్మతులు
పూర్తయిన
తర్వాత
నీటిసరఫరాకు
అధికచార్జీలు
వసూలు
చేసే
అవకాశం
కూడా
ఉందని
చెబుతున్నారు.
ఒకవేళ
అదే
జరిగితే
బీర్లధరలు
పెరిగే
అవకాశం
ఉంది.
ఒకవేళ
తెలంగాణ
రాష్ట్రంలో
ఉత్పత్తి
గణనీయంగా
ప్రభావం
అయితే,
ప్రభుత్వం
ఎక్కడైనా
ఇతర
రాష్ట్రాల
నుంచి
బీర్లు
దిగుమతి
చేసుకుంటే
రవాణాఖర్చులు
వాటితో
కలిపి
మరలా
బీర్ల
ధరలు
పెరిగే
అవకాశం
ఉంటుంది.


ప్రభుత్వ
ఆదాయానికి
గండి

ఏది
ఏమైనా
తాజాగా
సింగూరు
ప్రాజెక్టు
మరమ్మతు
పనులు
బేవరేజెస్
కంపెనీలకు
ఇబ్బంది
తెచ్చిపెట్టాయి.
బీర్ల
కంపెనీలకు
మాత్రమే
కాదు,
ఇది
ప్రభుత్వ
ఆదాయానికి
కూడా
గండి
కొడుతుంది.
మరి

సవాళ్లను
ప్రభుత్వం

విధంగా
ఎదుర్కొంటుంది.
ఎండాకాలంలో
బీర్ల
కొరత
లేకుండా
చూడడం
కోసం
ఎటువంటి
ప్రత్యామ్నాయ
ఏర్పాట్లు
చేస్తుంది
అనేది
తెలియాల్సి
ఉంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related