మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలి: Padi Kaushik Reddy

Date:


Telangana

oi-Lingareddy Gajjala

వీణవంక
సమ్మక్క-సారలమ్మ
జాతరలో
జరిగిన
సంఘటన,
కరీంనగర్
రాజకీయాల్లో
ఒక్కసారిగా
ఉద్రిక్తతలను
రాజేసింది.
పోలీసుల
వ్యవహారంపై
బీఆర్‌ఎస్
ఎమ్మెల్యే
పాడి
కౌశిక్‌రెడ్డి
(Padi
Kaushik
Reddy)
చేసిన
వ్యాఖ్యలు
తీవ్ర
దుమారం
రేపగా,

వివాదం
క్రమంగా
చట్టపరమైన
చర్యలు,
అధికారుల
సంఘాల
హెచ్చరికల
దాకా
చేరింది.
పరిస్థితి
ముదిరిన
వేళ,
కౌశిక్
రెడ్డి
వెనక్కి
తగ్గారు.

పోలీసుల
మనోభావాలు
దెబ్బతిని
ఉంటే
క్షమించాలని
కౌశిక్‌రెడ్డి
బహిరంగ
ప్రకటన
చేశారు.
తాను
కావాలని
ఎవరినీ
కించపరిచే
ఉద్దేశంతో
మాట్లాడలేదని
ఎమ్మెల్యే
స్పష్టం
చేశారు.
జాతర
సందర్భంగా
ఏర్పడిన
ఒత్తిడి,
ఉద్రిక్త
పరిస్థితులే
తన
మాటల్లో
తీవ్రతకు
కారణమయ్యాయని
తెలిపారు.
పోలీసులంటే
తనకు
గౌరవమేనని,
ఉద్దేశపూర్వక
వ్యాఖ్యలు
కాదని
చెప్పారు.
అయితే,

ఘటనను
రాజకీయంగా
వాడుకుని
తనపై,
తన
కుటుంబంపై
కక్ష
సాధిస్తున్నారని
కూడా
ఆరోపించారు.

జాతర
గద్దె
వద్ద
మొదలైన
ఉద్రిక్తత

సమ్మక్క-సారలమ్మ
జాతరలో
తొలి
కొబ్బరికాయ
కొట్టే
విషయంలో
దళిత
మహిళా
సర్పంచికి
అవమానం
జరుగుతోందన్న
ఆరోపణలతో
కౌశిక్‌రెడ్డి
కుటుంబసభ్యులతో
కలిసి
నిరసనకు
దిగారు.
సమ్మక్క
గద్దె
వద్దకు
చేరిన
అనంతరం,
మొదటి
కొబ్బరికాయ
తామే
కొడతామని
పట్టుబట్టారు.

అంశంపై
ఎస్సీ,
ఎస్టీ
కమిషన్‌ను
ఆశ్రయిస్తామని
ప్రకటించారు.

భక్తులకు
అంతరాయం
కలుగుతుందని
పోలీసులు
అక్కడి
నుంచి
వెళ్లాలని
సూచించినా,
ఆయన
వెనక్కి
తగ్గలేదు.
దీంతో
పరిస్థితి
ఉద్రిక్తంగా
మారి,
పోలీసులు
ఆయనను,
ఆయన
సతీమణిని
గద్దె
ప్రాంతం
నుంచి
బయటకు
తీసుకెళ్లాల్సి
వచ్చింది.

సమయంలో
ఇరువర్గాల
మధ్య
తోపులాట
చోటుచేసుకుంది.

వివాదాస్పద
వ్యాఖ్యలు…
పోలీస్
స్టేషన్
వరకు


సంఘటన
అనంతరం,
ప్రజాప్రతినిధులను
ఉద్దేశపూర్వకంగా
అడ్డుకుంటున్నారని,
పోలీసు
అధికారులు
హద్దులు
దాటుతున్నారని
కౌశిక్‌రెడ్డి
ఆరోపణలు
చేశారు.
కొందరు
అధికారులపై
తీవ్రమైన
వ్యాఖ్యలు
చేయడంతో
విషయం
మరింత
ముదిరింది.
చివరకు
పోలీసులు
ఆయనను
సైదాపూర్
పోలీస్
స్టేషన్‌కు
తరలించారు.

అంతకుముందు
హుజూరాబాద్
నుంచి
వీణవంకకు
బయలుదేరిన
సమయంలోనూ
పోలీసులు
కౌశిక్‌రెడ్డిని
అడ్డుకున్నారు.
హైకోర్టు
మార్గదర్శకాల
ప్రకారం
పరిమిత
వాహనాలకే
అనుమతి
ఉంటుందని
అధికారులు
చెప్పగా,
ఆయన
వాగ్వాదానికి
దిగారు.
ఆపై
భార్య,
కుమార్తెతో
కలిసి
ప్రధాన
రహదారిపై
బైఠాయించి
నిరసన
వ్యక్తం
చేశారు.
ఉద్రిక్తత
పెరుగుతుండటంతో
చివరికి
నాలుగు
వాహనాలకు
అనుమతి
ఇవ్వగా,
ఆయన
వీణవంకకు
చేరుకున్నారు.

కేసులు
నమోదు…
ఐపీఎస్
సంఘం
ఘాటు
స్పందన

అనుమతి
లేకుండా
ఆందోళన
చేయడం,
విద్వేషాలు
రెచ్చగొట్టే
వ్యాఖ్యలు
చేసిన
ఆరోపణలపై
పాడి
కౌశిక్‌రెడ్డిపై
పలు
సెక్షన్ల
కింద
కేసులు
నమోదు
చేసినట్లు
పోలీసులు
తెలిపారు.
ఇదిలా
ఉండగా,

వ్యాఖ్యలపై
ఐపీఎస్
అధికారుల
సంఘం
తీవ్రంగా
స్పందించింది.
పోలీసు
అధికారులపై
చేసిన
ఆరోపణలు
అనుచితమని
పేర్కొంది.
కరీంనగర్
సీపీతో
పాటు
పోలీసులకు
ఎమ్మెల్యే
బహిరంగంగా
క్షమాపణలు
చెప్పాలని
డిమాండ్
చేసింది.
నిరాధార
ఆరోపణలు
చేస్తే
చట్టపరమైన
చర్యలు
తప్పవని
హెచ్చరించింది.

క్షమాపణలతో
ముగింపు…
కానీ
రాజకీయ
వేడి
తగ్గేదెప్పుడో?

వివాదం
తీవ్రరూపం
దాల్చిన
నేపథ్యంలో
కౌశిక్‌రెడ్డి
క్షమాపణలు
చెప్పడం
ద్వారా
కొంత
శాంతి
వాతావరణం
ఏర్పడినప్పటికీ,
రాజకీయంగా

అంశం
ఇంకా
చల్లబడలేదనే
అభిప్రాయం
వ్యక్తమవుతోంది.
భక్తి,
సంప్రదాయం,
రాజకీయాలు
కలిసిన

ఘటన
రానున్న
రోజుల్లో
ఎలాంటి
మలుపులు
తిరుగుతుందన్నది
ఆసక్తికరంగా
మారింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

LANCO Survives Bus Fire in Iowa: See Video & Photos

The members of country music group LANCO survived a...

British Airways cancels Dubai flights until summer

Unlock the Editor’s Digest for freeRoula Khalaf, Editor of...

How to Wear Feathers, Red Carpet Fashion Trend 2026

If last night’s red carpet felt especially glamorous, there’s...