Business
oi-Korivi Jayakumar
ప్రస్తుతం
మారుతున్న
కాలానుగుణంగా
ప్రైవేట్
ఉద్యోగాలు
అంటే..
ఎప్పుడు
ఉంటాయో..
ఎప్పుడు
ఊడతాయో
తెలియని
భయం
అందరికీ
ఉన్నదే.
దిగ్గజ
కంపెనీలు
సైతం
వందల
సంఖ్యలో
ఉద్యోగులను
తీసేస్తుంటే
చిన్నా
చితకా
కంపెనీలు
అయితే
ఏకంగా
దుకాణం
సర్దేస్తున్నాయి.
కానీ
అనూహ్యంగా
తమ
కంపెనీలో
ఉద్యోగానికి
డిగ్రీ
అక్కర్లేదంటూ
జోహో
సీఈఓ
శ్రీధర్
వెంబు
షాకింగ్
కామెంట్స్
చేశారు.
దీంతో
ఈ
వ్యవహారం
హాట్
టాపిక్
గా
మారింది.
జోహో
కార్పొరేషన్
సహ
వ్యవస్థాపకుడు
శ్రీధర్
వెంబు
తరచూ
సామాజిక
అంశాలపై
తన
అభిప్రాయాలను
వ్యక్తం
చేస్తుంటారు.
ఈ
క్రమంలోనే
డిగ్రీ
చదువుల
గురించి
మాట్లాడుతూ
డిగ్రీలు
చదవాలని
పిల్లలపై
తల్లిదండ్రులు
ఒత్తిడి
చేయొద్దు.
ఈ
మేరకు
ఎక్స్
(గతంలో
ట్విట్టర్)
వేదికగా
ఓ
పోస్ట్
ద్వారా
తన
అభిప్రాయాన్ని
పంచుకున్నారు.
అలానే
ప్రస్తుతం
అమెరికాలో
కొందరు
తెలివైన
విద్యార్థులు
కళాశాలకు
వెళ్లడం
మానేస్తున్నారని
చెప్పుకొచ్చారు.
అందుకే
ముందుచూపు
కలిగిన
సంస్థలు
వారికి
అవకాశం
ఇస్తున్నాయని
పేర్కొన్నారు.
ఒక
కాగితం
కంటే
ప్రతిభ,
ఉత్సుకత
చాలా
ముఖ్యమని
ప్రస్తావించారు.
డిగ్రీల
కోసం
అప్పులు
చేసే
బదులు
ఆచరణాత్మక
సామర్థ్యాలను
మెరుగుపర్చుకోవాలి.
దీనిద్వారా
యువత
ప్రపంచాన్ని
చూసే
విధానం
మారుతుంది.
ఈ
తరహా
మార్పును
తల్లిదండ్రులు
అర్థం
చేసుకొని,
పిల్లలు
ప్రత్యామ్నాయ
మార్గాలు
ఎంచుకునేలా
ప్రోత్సహించాలని
శ్రీధర్
వెంబు
స్పష్టం
చేశారు.
దీంతో
వెంబు
వ్యాఖ్యలపై
సోషల్
మీడియాలో
నెటిజన్లు
పలు
రకాలుగా
స్పందిస్తున్నారు.
భారత్లో
ఇలాంటి
ఆలోచనా
దృక్పథం
అవసరమని..
ఉద్యోగంలోనే
నేర్చుకునే
అవకాశాలను
జోహో
వంటి
సంస్థలు
అందిస్తున్నాయని
ఒక
నెటిజన్
వ్యాఖ్యానించారు.
కళాశాలకు
వెళ్లడం
కేవలం
సామాజిక
వినోదం
కోసమేనని
మరొకరు
అభిప్రాయపడ్డారు.
కాగా
జోహో
కార్పొరేషన్
మాజీ
సీఈఓ
శ్రీధర్
వెంబు
ప్రస్తుతం
కంపెనీ
చీఫ్
సైంటిస్ట్గా
పరిశోధన,
అభివృద్ధిపై
దృష్టి
సారించారు.
ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్
రంగంలో
వస్తున్న
మార్పులు..
సంస్థ
ఎదుర్కొంటున్న
సవాళ్లు,
అవకాశాల
నేపథ్యంలో
ఆయన
ఈ
బాధ్యతల్లో
నిమగ్నమయ్యారు.
మరి
ఆయన
చేసిన
ఈ
కామెంట్స్
పై
ఇతర
సంస్థల
యాజమాన్యం
ఎలా
రియాక్ట్
అవుతారో
చూడాలి.


