India
oi-Dr Veena Srinivas
రోడ్డు
ప్రమాదాలు
అనూహ్యంగా
జరుగుతుంటాయి.
ఒక్క
క్షణంలోనే
కుటుంబాల
జీవితాలను
తలకిందులు
చేసే
ప్రమాదాలు
ఎన్నో.
ఇలాంటి
పరిస్థితుల్లో
ప్రమాదానికి
గురైన
బాధితులు,
వారి
కుటుంబాలకు
ఆర్థిక
భరోసా
కల్పించేందుకు
కేంద్ర
ప్రభుత్వం
యాక్సిడెంట్
విక్టిమ్
కాంపెన్సేషన్
స్కీమ్
ను
అమలు
చేస్తుంది.
ఈ
పథకం
ముఖ్యంగా
రోడ్డు
ప్రమాదాల్లో
తీవ్రంగా
గాయపడిన
వారికి
తక్షణ
సహాయం
అందించడమే
లక్ష్యంగా
రూపొందించబడింది.
తీవ్ర
గాయాలైతే
వారికి
ఆర్థిక
సహాయం
ఈ
పథకం
ప్రకారం,
హిట్
అండ్
రన్
కేసుల్లో
బాధితులు
లేదా
వారి
కుటుంబ
సభ్యులకు
ప్రభుత్వమే
నేరుగా
పరిహారం
చెల్లిస్తుంది.
ప్రమాదంలో
వ్యక్తి
తీవ్ర
గాయాలైతే
వారికి
ఆర్థిక
సహాయం
అందజేస్తారు.
ముఖ్యంగా
ప్రమాదానికి
కారణమైన
వాహన
యజమాని
వివరాలు
తెలియని
సందర్భాల్లో
కూడా
ఈ
పథకం
ఎంతో
ఉపయోగపడుతుంది.
2025లో
ప్రారంభించబడిన
ఈ
పథకం
రోడ్డు
ప్రమాదంలో
గాయాలపాలైన
వారికి
నగదు
రహిత
చికిత్సను
అందిస్తుంది.
ఆసుపత్రులలో
ఉచిత
వైద్య
సంరక్షణను
పొందే
అవకాశం
రోడ్డు
రవాణా
మరియు
రహదారుల
మంత్రిత్వ
శాఖ
ఈ
పథకం
కోసం
ఎటువంటి
ఖర్చులు
చెల్లించాల్సిన
అవసరం
లేదు.
కేంద్ర,
రాష్ట్ర
ప్రభుత్వాల
ద్వారా
ఎంపానెల్
అయిన
ఆసుపత్రులలో
ఉచిత
వైద్య
సంరక్షణను
పొందే
అవకాశం
ఉంది.
ఈ
పథకం
కింద
బాధితులు
ఒక
లక్ష
యాభై
వేల
రూపాయల
వరకు
నగదు
రహిత
చికిత్సను
పొందుతారు.
ఆ
ఆసుపత్రులలోనే
ప్రమాద
బాధితులకు
తక్షణ
సహాయం
రోడ్డు
క్యాటగిరి
తో
సంబంధం
లేకుండా
ఏ
రకమైన
మోటారు
వాహనంతోనైనా
సంబంధం
ఉన్న
ఏ
రకమైన
రోడ్డు
ప్రమాదానికి
అయినా
సరే
ఈ
పథకం
వర్తిస్తుంది.
ఆయుష్మాన్
భారత్
మరియు
ప్రధానమంత్రి
జన్
ఆరోగ్య
యోజన
కింద
నమోదు
చేయబడిన
ఆసుపత్రులలో
ప్రమాద
బాధితులకు
తక్షణ
సహాయం
అందుతుంది.
దీనికోసం
ప్రమాదం
జరిగిన
మొదటి
ఏడు
రోజుల్లో
అయ్యే
వైద్య
ఖర్చులు
ఆర్థిక
కవరేజీలో
ఉంటాయి.
స్కీం
ద్వారా
సహాయం
అందుతుంది
ఇలా
ప్రమాద
బాధితుడికి
ఆధార్
కార్డు
లేదా
ఏదైనా
గుర్తింపు
కార్డు
ఉంటే
ఈ
స్కీం
కవరేజ్
కు
ఉపయోగపడుతుంది.
ప్రమాదం
జరిగిన
వెంటనే
సమీప
పోలీస్
స్టేషన్లో
కేసు
నమోదు
చేయాలి.
అనంతరం
ఆసుపత్రి
నివేదికలు,
గుర్తింపు
పత్రాలు
సమర్పించి
దరఖాస్తు
చేయాలి.
సంబంధిత
జిల్లా
కలెక్టర్
లేదా
మోటార్
యాక్సిడెంట్
క్లెయిమ్స్
ట్రిబ్యునల్
ద్వారా
దరఖాస్తులను
పరిశీలించి
పరిహారం
మంజూరు
చేస్తారు.
ఈ
హెల్ప్
లైన్
నెంబర్..
మీకు
లైఫ్
లైన్
ఈ
పథకం
వల్ల
పేద,
మధ్యతరగతి
కుటుంబాలలో
రోడ్డు
ప్రమాదాల
బారినపడి
తీవ్ర
గాయాలపాలై
ఆసుపత్రులలో
చికిత్స
పొందే
వారికి
లక్ష
యాభై
వేల
రూపాయల
వరకు
క్యాష్
లెస్
ట్రీట్మెంట్
అందుతుంది.
చాలామంది
ఈ
పథకం
పైన
అవగాహన
లేకపోవడం
వల్ల
ప్రయోజనాన్ని
పొందలేకపోతున్నారు.
అయితే
రోడ్డు
ప్రమాదాలలో
గాయపడిన
వారికి
ఈ
పథకం
వర్తించాలి
అంటే
నేషనల్
హెల్త్
ఏజెన్సీ
హెల్ప్
లైన్
నెంబర్
14555కు
కాల్
చేయండి.
ప్రమాద
బాధితులకు
సంబంధించిన
సహకారం
అందించడానికి
వారు
మీకు
సహాయం
చేస్తారు.


