వాహనదారులపై మరో బాదుడు గ్యారెంటీ

Date:


Business

oi-Chandrasekhar Rao

ఇరాన్ సంక్షోభం, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంతో దేశంలో ఇంధన రేట్లపై నెలకొన్న అంచనాలు వాస్తవ రూపాన్ని దాల్చాయి. శుక్రవారం ప్రీమియం పెట్రోల్, పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే డీజిల్ ధరలు పెరిగాయి. ప్రస్తుతానికి సామాన్య వినియోగదారులు వాడే సాధారణ పెట్రోల్, డీజిల్‌ ధరలలో ప్రస్తుతం ఎటువంటి మార్పు లేదు. ఒకట్రెండు రోజుల్లో దీనిపైనా భారం మోపడం ఖాయంగా కనిపిస్తోంది

ఢిల్లీలో ప్రీమియం పెట్రోల్ ధర రూ. 99.89 నుండి రూ. 101.89కు చేరింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే పారిశ్రామిక డీజిల్ ధర ఢిల్లీలో రూ. 87.67 నుండి 109.59 రూపాయల వరకు పెరిగింది. ముంబై- రూ.90.39 నుండి రూ.113.11, కోల్‌కతా- రూ.92.30 నుండి రూ.114.27, చెన్నై- రూ.92.54 నుండి రూ.113.38లలోనూ ఈ ధరల పెరుగుదల నమోదైంది. ఇది పారిశ్రామిక వ్యయాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

సామాన్య ప్రజలకు ఊరట కొనసాగుతోంది. ఢిల్లీలో సాధారణ పెట్రోల్ రూ. 94.77, డీజిల్ రూ. 87.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ప్రకారం, ప్రీమియం పెట్రోల్ వినియోగం తక్కువ కావడం వల్లట్టి సామాన్యులపై ప్రత్యక్ష ప్రభావం ఉండదు. సాధారణ ఇంధన ధరలు పెంచే ప్రణాళిక ప్రస్తుతానికి లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ రేట్లను సవరించడానికి ముడి చమురు ధరల పెరుగుదలే ప్రధాన కారణం.

బ్రెంట్ లో బ్యారెల్‌కు 120 డాలర్లను తాకింది. ఆ తర్వాత 108 డాలర్ల వద్ద స్థిరపడింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ 102 డాలర్ల మేర నమోదైంది బ్యారెల్ రేటు. క్రూడ్ ఆయిల్, ఇరాన్ సంబంధిత సంఘర్షణలు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌లో పెరుగుతున్న ప్రమాదాలతో షిప్పింగ్ మార్గాలు మారడం, బీమా ఖర్చులు పెరిగి, సప్లై చైన్ పై తీవ్ర ప్రభావం పడింది.

సామాన్య వినియోగదారులకు తక్షణ ప్రభావం లేనప్పటికీ, పారిశ్రామిక డీజిల్ ధరల పెంపు లాజిస్టిక్స్, పారిశ్రామిక వ్యయాలను పెంచవచ్చు. ఇది పరోక్షంగా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపడం ఖాయం. ప్రస్తుతం ప్రభుత్వం వినియోగదారుల ఉపశమనంపై దృష్టి సారించింది. ముడి చమురు ధరలు పెరిగితే, భవిష్యత్తులో ఇంధన ధరలలో మార్పులు సంభవించవచ్చు. ప్రపంచ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇంధన ధరలపై నిశితంగా పర్యవేక్షించడం అవసరం.

ఈ పరిణామాల మధ్య వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలిలా ఉన్నాయి.

ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77

కోల్‌కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41

ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54

చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06

భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94

డీజిల్ ధరలు ఇవీ..

ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67

కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02

ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03

చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61

భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Weekend Special train to run as regular train from April 2

The train No. 02683/02684 Santragachhi-Yelahanka-Santragachhi weekend special express, which...

Police body cam footage of Justin Timberlake’s DWI arrest released

Officer bodycam footage from Justin Timberlake‘s DWI arrest has...